కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు లక్షన్నరకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కేసులు భారీగా పెరుగుతుండటంతో చాలా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్డౌన్లు అమలు చేస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగానే కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ డెల్టాను అధికమించితే మరింత ప్రమాదమని, థర్డ్ వేవ్ ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టాలి అంటే తప్పని సరిగా మూడు అంశాలను ఫాలో కావాలని కోవిడ్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ ఎన్కే అరోడా…
రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా వ్యాప్తి పెరగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో నేటి నుంచి ఎమర్జెన్సీ కానీ ఆపరేషన్లను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను సైతం విడుదల చేసింది. దీంతో గాంధీ ఆస్పత్రిలో అత్యవసరం కానీ ఆపరేషన్లు జరగవు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. Read Also: ప్రైవేట్ ట్రావెల్స్పై కొరడా..నిబంధనలు…
దేశంపై మరోసారి కరోనా మహమ్మారి తన పంజా విసురుతోంది. ఇప్పటికే దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందని పలువురు నిపుణులు చెప్తున్నారు. తాజాగా అహ్మదాబాద్ ఐఐఎం వెల్లడించిన నివేదిక సంచలనం రేపుతోంది. ఈ నివేదిక ప్రకారం… దేశంలో ఇప్పటివరకు సంభవించిన కరోనా మరణాలపై కేంద్ర ప్రభుత్వం లెక్కలకు, వాస్తవ లెక్కలకు వ్యత్యాసం ఉందని తెలుస్తోంది. దేశంలో అధికారిక లెక్కల ప్రకారం కరోనా మరణాలు ఐదు లక్షలు ఉంటే… వాస్తవానికి దీని కంటే 6-7 రెట్లు అధికంగా ఉండొచ్చని…
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. నిన్నటితో పోలిస్తే .. నేడు ఏకంగా 100 శాతం కరోనా కేసులు పెరిగాయి. నేడు ఆంధ్ర ప్రదేశ్లో 1,831 కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్యాఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఒక్క రోజు వ్యవధిలో పెద్ద ఎత్తున కేసులు నమోదు కావడం గత ఆరునెలల్లో ఇదే మొదటి సారి. సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 984 కేసులు నమోదు అయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు 100కుపై గా కొత్త కేసులు…
చిత్రపరిశ్రమను కరోనా వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటికే చిత్ర పరిశ్రమలో పలువురు ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపింది. ” నాకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. ప్రస్తుతం స్వల్ప లక్షణాలను అనుభవిస్తున్నాను. వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నాను. ఇటీవల నన్ను కలిసినవారు కూడా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను.…
ఆంధ్రప్రదేశ్లో కరోనా వీరవిహారం చేస్తోంది. అందుకే నైట్ కర్ఫ్యూ విధించింది. సంక్రాంతి సందర్భంగా రిలాక్సేషన్ ఇచ్చింది. ఇదే ఒమిక్రాన్, కరోనా మహమ్మారికి కలిసి వచ్చేలా కనిపిస్తోంది. ఏపీలోని శ్రీకాకుళంలో కరోనా బాధితులు లేని ఇల్లు లేదు . ఇబ్బంది పడని ఫ్యామిలీ కనిపించదంటారు. ఫస్ట్, సెకండ్ వేవ్ లో జనాల జీవితాలను ఛిద్రం చేసింది ఈ కోవిడ్ . అయినా ప్రజల తీరులో మార్పు రాలేదు. గతాన్ని మరచిన ప్రజలు, విచ్చలవిడిగా కోవిడ్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారు.…
అమెరికాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజుకు 13 లక్షలకు పైగా కేసులు నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేసులు పెరుగుతుండటంతో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నది. సోమవారం రోజున 1.32 లక్షల మంది కరోనాతో చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరారు. రాబోయే వారం పదిరోజుల్లో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నది. సుమారు 2 నుంచి మూడు లక్షల మంది ఆసుపత్రుల్లో చేరతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొలరాడో, లూసియానా, మేరిలాండ్,…
2020లో కరోనా కారణంగా ప్రపంచంలోని చాలా దేశాలు లాక్డౌన్, కర్ఫ్యూలు అమలు చేయడంతో ప్రజలు ఇంటికే పరిమితం అయ్యారు. ఇంటికే పరిమితం కావడంతో చాలా వరకు రద్దీ తగ్గిపోయింది. అంతేకాదు, వాహనాలు పరిమిత సంఖ్యలో తిరగడంతో వాతావరణ కాలుష్యంలో అనేక మార్పులు సంభవించాయి. కరోనా కేసులు తగ్గిపోవడం, వ్యాక్సినేషన్ ప్రారంభం కావడంతో తిరిగి అన్ని రంగాలు తెరుచుకున్నాయి. కార్మిక ఉపాధి రంగాలు తిరిగి తెరుచుకోవడంతో బొగ్గుకు డిమాండ్ పెరిగింది. పెద్ద ఎత్తున బొగ్గు తవ్వకాలు, పెట్రోల్ డీజిల్…
కరోనా పేషేంట్లలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు, ఫిజికల్గా ఆరోగ్యంగా ఉండేందుకు యోగా క్లాసులు నిర్వహించాలని ఢిల్లీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కరోనా రెస్పిరేటరీ సిస్టమ్పై దాడి చేస్తుంది కాబట్టి మెరుగైన శ్వాసను తీసుకోవడానికి అనుగుణంగా యోగా క్లాసులను నిర్వహించనున్నారు. వ్యాధినిరోదక శక్తిని పెంచే యోగాసనాలు, ప్రాణాయామం వంటి వాటికి సంబంధించిన క్లాసులను నిర్వహించనున్నారు. ఢిల్లీకి యోగశాల పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారికోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేర్కొన్నారు. కరోనా…
ఢిల్లీలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. రోజువారీ కేసులు 20 వేల వరకు నమోదవుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో 1000 నుంచి 20 వేలకు పెరిగాయి. ఈ స్థాయిలో కేసులు పెరగడంతో ఢిల్లీ సర్కార్ నైట్ కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూలను అమలు చేస్తున్నది. అయితే, ఆదివారం రోజున 22 వేలకు పైగా కేసులు నమోదవ్వగా, సోమవారం రోజున 19 వేల కేసులు మాత్రమే నమోదయ్యాయి. సుమారు మూడు వేల వరకు కేసులు తగ్గుముఖం పట్టాయి. కేసులు తగ్గుముఖం పట్టడంపై…