సాధారణంగా చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి పీటలెక్కిన తర్వాత హీరోయిన్లను దర్శకనిర్మాతలు చూసే కోణం మారిపోతుందనేది బహిరంగ రహస్యం. తాజాగా టాలీవుడ్, కోలీవుడ్లో విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar),ప్రియమణి (Priyamani) ఒక ఇంటర్వ్యూలో ఈ అంశంపై కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు.
Also Read : Keerthy Suresh: వెంకీ-కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ లో.. హీరోయిన్ కన్ఫర్మ్ !
‘పెళ్లయ్యాక హీరోయిన్లకు లీడ్ రోల్స్ రావు అనేది ఒక చేదు నిజం. పెళ్లి కాగానే హీరోయిన్లను కేవలం అక్క, వదిన లేదా తల్లి పాత్రలకే పరిమితం చేస్తారు. పెళ్లయిన హీరోయిన్లను ఆడియన్స్ రొమాంటిక్ పాత్రల్లో చూడటానికి ఇష్టపడరని మేకర్స్ బలంగా నమ్ముతారు. కానీ అందులో నిజం లేదు’ అని వరలక్ష్మి తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఇదే ఇంటర్వ్యూలో ప్రియమణి కూడా వరలక్ష్మితో ఏకీభవించారు.. ‘పెళ్లయ్యాక కూడా మాకు నటనపై అదే ప్యాషన్ ఉంటుంది. కానీ ఇండస్ట్రీ ఇచ్చే ఆఫర్లలో మాత్రం కచ్చితంగా మార్పు వస్తుంది. పెళ్లి అనేది కెరీర్కు పులిస్టాప్ కాకూడదు’ అని ఆమె పేర్కొన్నారు.
అయితే, నయనతార లాంటి వారు పెళ్లయ్యాక కూడా స్టార్డమ్ను మెయింటైన్ చేయడం చూస్తున్నాం, కానీ కమర్షియల్ సినిమాల్లో మాత్రం ఇప్పటికీ పెళ్లిని ఒక బ్రేక్ లాగే చూస్తున్నారని వారు అభిప్రాయపడ్డారు. పెళ్లయినంత మాత్రాన హీరోయిన్లు తమ గ్లామర్ను లేదా నటనను కోల్పోరని, మేకర్స్ తమ మైండ్సెట్ మార్చుకోవాలని ఈ ఇద్దరు భామలు డిమాండ్ చేశారు. ప్రజంట్ వీరి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.