Home
Covid 19 2
Covid 19 2 News
-
కోవిడ్ దండయాత్ర.. యూఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం
కరోనా మహమ్మారి మరోసారి అగ్రరాజ్యం అమెరికాపై దండయాత్ర చేస్తోంది.. ఒమిక్రాన్ విజృంభణతో యూఎస్ విలవిల్లాడుతోంది. ప్రతిరోజు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. దీంతో యూఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంట్లోనే కోవిడ్-19 పరీక్షలు చేసుకునేలా 100 కోట్ల ర్యాపిడ్ కిట్లతో పాటు వైరస్ బారినపడకుండా రక్షణ కల్పించే ఎన్95 మాస్క్లను తమ పౌరులకు ఉచితంగా అందిస్తామని దేశాధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. దీంతోపాటు వచ్చే వారం నుంచి వెయ్యి మంది సైనిక వైద్య సిబ్బందిని దేశవ్యాప్తంగా మోహరిస్తామని… -
తెలంగాణ పల్లెలకు కరోనా టెన్షన్.. కారణం ఇదే..!
కరోనా మహమ్మారి మరోసారి పల్లెలను టెన్షన్ పెడుతోంది.. ముఖ్యంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు మళ్లీ మహరాష్ట్ర టెన్షన్ పట్టుకుంది.. దేశంలో అత్యధిక ఒమిక్రాన్ కరోనా కేసులు అక్కడే నమోదు అవుతుండగా.. దాన్ని ఆనుకోని ఉన్న తెలంగాణ జిల్లాలైనా ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం జిల్లాతోపాటు మంచిర్యాల జిల్లాకు కరోనా భయం పట్టిపీడిస్తుంది.. మరి ముఖ్యంగా మహారాష్ట్రలో రోజుకు వేలకు పైగా కరోనా కొత్తకేసులు నమోదు అవుతుండగా అక్కడ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ సరిహద్దు పంచుకున్న యవత్మాల్ జిల్లా,… -
మంత్రి అవంతి శ్రీనివాస్కు కరోనా పాజిటివ్
దేశ వ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఏపీ దేవాదాయ శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. తనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని మంత్రి అవంతి శ్రీనివాస్ స్వయంగా వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. తనకు నివాసానికి… -
కరోనా కల్లోలం.. 32 కోట్లు దాటిన పాజిటివ్ కేసులు
మరోసారి కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది… ప్రపంచదేశాల వెన్నులో వణుకుపుట్టిస్తోంది.. భారత్ సహా అనేక దేశాల్లో భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి.. ప్రపంచవ్యాప్తంగా ఒకేరోజు 31 లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయి.. తాజాగా గణాంఖాల ప్రకారం.. 24 గంటల వ్యవధిలో.. 31,86,254 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 7,606 మంది కరోనా బాధితులు కన్నుమూశారు.. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 32 కోట్ల మార్క్ను కూడా… -
ఖాకీలను వణికిస్తోన్న కరోనా మహమ్మారి..
కరోనా థర్డ్ వేవ్ ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది… సెకండ్ డోస్ వ్యాక్సిన్ కంప్లీట్ చేసుకున్న వారిపైనా కరోనా అటాక్ చేస్తుండడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలీసు అధికారులతో పాటు పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు.. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేసే పోలీసు ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు. వారం రోజుల్లోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీస్… -
తెలంగాణలో లాక్డౌన్..? క్లారిటీ ఇచ్చిన కేటీఆర్..
కరోనా మళ్లీ భారత్ను వణికిస్తోంది.. థర్డ్ వేవ్ దెబ్బకు రికార్డు స్థాయిలో రోజువారి కేసులు పెరుగుతూ పోతున్నాయి.. దీంతో అప్రమత్తమైన ఆయా రాష్ట్రాలు.. కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.. నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్డౌన్లు విధిస్తున్నాయి.. మరోవైపు, వ్యాక్సినేషన్పై ఫోకస్ పెడుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణలోనూ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పైకి కదులుతోంది.. ఇప్పటి వరకు తెలంగాణలో సాధారణ కోవిడ్ నిబంధనలు తప్పితే.. అదనంగా ఎలాంటి ఆంక్షలు లేవు.. అయితే, దీనిపై మంత్రి కేటీఆర్ను ప్రశ్నించారు నెటిజన్లు..… -
బుసలు కొడుతోన్న కరోనా.. ఒకేరోజు 2.64 లక్షల కేసులు
భారత్లో కరోనా థర్డ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది.. ఒమిక్రాన్ వేరియంట్గా పంజా విసురుతోంది.. దీంతో.. రోజువారి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతోంది… రోజుకో రికార్డు తరహాలో పాజిటివ్ కేసులు నమోదు అవుతూ కలవరపెడుతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,64,202 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 315 మరణాలు నమోదు, ఇక, దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 12,72,073కు చేరింది..… -
అరుదైన ఘనత.. ‘యూనివర్సల్ వ్యాక్సిన్’గా కొవాగ్జిన్
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ఇది గుర్తించిన అన్ని దేశాలు వ్యాక్సిన్ల ఉత్పత్తి, వ్యాక్సినేషన్పై దృష్టిసారించాయి.. ఇక, భారత్లో దేశీయంగా తయారై.. అనుమతి పొందిన వ్యాక్సిన్లలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా ఒకటి… తాజాగా, మరో అరుదైన ఘనత సాధించింది కొవాగ్జిన్.. చిన్నారులు, వయోజనులకు పంపిణీ చేస్తున్న కొవాగ్జిన్ టీకా ‘యూనివర్సల్ వ్యాక్సిన్’గా గుర్తింపు పొందింది.. ఈ విషయాన్ని భారత్ బయోటెక్ వెల్లడించింది.. Read Also:… -
ఢిల్లీ, కర్ణాటకలో భారీగా పెరిగిన కేసులు…
దేశంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి అన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నా ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో కేసులు ఇప్పటి వరకు అదుపులోకి రాలేదు. తాజాగా ఢిల్లీలో 28,867 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాతో 31 మంది మృతి చెందారు. 24 గంటల్లో కరోనా నుంచి 22,121 మంది కోలుకున్నట్టు ఢిల్లీ ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 94,160 యాక్టీవ్ కేసులు ఉన్నట్టు ఢిల్లీ ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఢిల్లీలో… -
సీఎంలతో ప్రధాని మోడీ కాన్ఫరెన్స్…
దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ ప్రధాని మోడీ ఈరోజు దేశంలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి కూడా హాజరయ్యారు. దేశంలో థర్డ్ వేవ్ దృష్ట్రా రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై ఈ సమీక్షా సమావేశంలో చర్చిస్తున్నారు. వ్యాక్సినేషన్ పైకూడా ప్రధాని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చిస్తున్నారు. అయితే, ఈ సమావేశానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కాలేదు. ఆయన…
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?