కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అనర్హత వేటు తర్వాత ఖుష్బూ సుందర్ పాత ట్వీట్ వైరల్గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఖుష్బు.. తన పాత ట్వీట్ను తొలగించేదే లేదని తేల్చి చెప్పారు.
Swara Bhasker: అనర్హత వేటు ఎదుర్కొంటున్న రాహుల్ గాంధీకి బాలీవుడ్ నటి స్వరాభాస్కర్ మద్దతుగా నిలిచారు. పప్పు అని విమర్శిస్తున్నవారు ఆయనకు ఎందుకు భయపడుతున్నారంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్ సభ్యుడిగా అనర్హత వేటు వేయడంపై ట్వీట్ చేస్తూ.. చట్టాన్ని దుర్వినియోగం చేశారని వ్యాఖ్యానించారు. ఆయనను డిస్ క్వాలిఫై చేయడానికి చట్టాలను దుర్వినియోగం చేశారని అన్నారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. పరువునష్టం కేసులో సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. రెండేళ్లు, అంతకన్నా ఎక్కువ కాలం జైలు శిక్ష పడితే.. ‘‘ప్రజాప్రాతినిధ్య చట్టం-1951’’లోని సెక్షన్ 8(3) ప్రకారం అనర్హత వేటు పడుతుంది. అయితే తాజాగా ఆయన తన ట్విట్టర్ బయోలో మార్పులు చేశారు. "డిస్ క్వాలిఫై ఎంపీ" అంటూ ప్రొఫైల్ లో మార్పులు చేశారు.
Rahul Gandhi: అదానీపై నా తరువాతి ప్రసంగానికి భయపడే మోదీ నాపై అనర్హత వేటు వేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ కళ్లలో భయాన్ని చూశాను. నేను ఏ ప్రశ్న అడిగిన ఆలోచించే అడుగుతానని అన్నారు. అదానీతో మా ముఖ్యమంత్రులకు సంబంధం ఉందని తెలిస్తే జైళ్లలో వేయండి అని అన్నారు. దేశం నాకు గౌరవం, ప్రేమ ఇచ్చారని అన్నారు. ప్రధానిని కాపాడేందుకు ఈ డ్రామా జరుగుతోందని అన్నారు. నేను జైలు శిక్ష గురించి భయపడనని అన్నారు. ప్రజల్లోకి…
Rahul Gandhi: పరువునష్టం కేసులో రెండేళ్లు జైలు శిక్ష, పార్లమెంట్ సభ్యుడిగా అనర్హత పడిన తర్వాత రాహుల్ గాంధీ ఈ రోజు మాట్లాడారు. డిస్ క్వాలిఫై చేసినా, జైలులో పెట్టిన భయపడనని, నేను భారత ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాని, తాను సత్యాన్నే మాట్లాడుతున్నానని రాహుల్ గాంధీ అన్నారు.