Asaduddin Owaisi: సోనియా గాంధీ నుంచి ఇలాంటిది ఊహించలేదు.. ఎన్నికల ప్రచారంపై ఓవైసీ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: కర్ణాటక ఎన్నికల ప్రచారం తుది ఘట్టానికి చేరుకుంది. రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ రోజు, రేపు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే మాజీ బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆయన కాంగ్రెస్ తరుపు నుంచి హుబ్బళి నుంచి అసెంబ్లీ బరిలో ఉన్నారు. ఆయన కోసం సోనియా గాంధీ శనివారం ప్రచారం చేశారు.
Read Also: Wife Extramarital Affair: భార్య ఘాతుకం.. ప్రియుడితో కలిసి దారుణం
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
అయితే దీనిపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ కు చెందిన జగదీష్ షట్టర్ కు సోనియాగాంధీ ప్రచారం చేయడంపై ఆయన ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సిద్ధాంతాన్ని ప్రశ్నిస్తూ.. ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి సోనియాగాంధీ ప్రచారం చేస్తారని తాను ఊహించలేదని ఆయన అన్నారు. ఇదేనా సెక్యులరిజం..? మోడీని ఇలాగే ఎదుర్కొవాలా.? అంటూ ప్రశ్నించారు. సైద్ధాంతిక పోరులో కాంగ్రెస్ విఫలం అవడం సిగ్గు చేటు అని ఓవైసీ విమర్శించారు. ఇలాంటి వారు తాను బీజేపీ-బీ టీమ్ అంటూ నిందిస్తారని ఎద్దేవా చేశారు.
బీజేపీ పార్టీ కీలక నేతగా ఉన్న జగదీష్ షెట్టర్ కు ఈ సారి పార్టీ టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం హుబ్బలి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీలో నిలబడ్డారు. ఆర్ఎస్ఎస్ తో సంబంధాలు ఉన్నప్పటికీ.. షెట్టర్ లౌకిక వ్యక్తి అంటూ కాంగ్రెస్ ప్రశంసలు కురిపించింది. ఆయనకు మద్దతుగా సోనియాగాంధీ మూడేళ్ల తరువాత తొలిసారిగా ప్రచారం చేశారు. ము 10న కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఫలితాలు వెలువడనున్నాయి.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!