Mallikarjuna Kharge: కర్ణాటకలో కాంగ్రెస్ ఓడిపోతే.. నాదే పూర్తి నైతిక బాధ్యత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallikarjuna Kharge On Karnataka Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నో రోజులు లేని పక్షంలో.. రాజకీయ పార్టీలు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాయి. ముఖ్యంగా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలైతే ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఇప్పుడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఓడించాలని కృత నిశ్ఛయంతో కాంగ్రెస్ ఉందని, తీరక సమయం లేకుండా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని అన్నారు. ఒకవేళ కర్ణాటకలో కాంగ్రెస్ ఓడిపోతే.. అందుకే తనదే పూర్తి నైతిక బాధ్యత అని ప్రకటించారు. ఈమేరకు ఆయన ఒక జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
WhatsApp Loan: వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి.. రూ.10 లక్షల లోన్ పొందండి
Also Read
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
- Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
- Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
కర్ణాటక ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్గా ఉన్న ఖర్గే.. ఈసారి కచ్చితంగా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తామని, ఈసారి హంగ్ వచ్చే పరిస్థితి ఉండదని అభిప్రాయపడ్డారు. తాను రోజూ నాలుగు ర్యాలీల్లో పాల్గొంటున్నానని, ఒక్కోసారి 100 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని తెలిపారు. బీజేపీని ఎలాగైనా ఓడించాలని అకింతభావంతో ఉన్నామని, అందుకే ఎన్ని సవాళ్లనైనా అధిగమిస్తున్నామని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ విస్పష్ట మెజారిటీతో పగ్గాలు చేపడుతుందని, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బల్లగుద్ది మరీ చెప్పారు. ఎన్నికల్లో గెలవాలనే సంకల్పం, నిబద్ధత ఉండాలని అన్నారు.
PM Bengaluru Roadshows: పీఎం బెంగళూరు రోడ్షోలో మార్పులు.. కారణమిదే!
కాగా.. కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరగనుండగా, మే 13న ఫలితాలు వెలువడనున్నాయి. కర్ణాటకలో 58282 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని స్థానాలకు కలిపి పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందుకోసం సన్నాహాలు పూర్తి చేస్తున్న కమిషన్.. భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Dhurandhar 2: ‘ధురంధర్ 2’ OTT రిలీజ్పై ట్విస్ట్..
-
NBK111 : ‘బాలయ్య – నర్గిస్ ఫక్రి’ దబిడి.. దిబిడి.. షూటింగ్ ఫినిష్.. టీజర్ ఎప్పుడంటే?
-
NPS Sanchay Yojana: NPS సంచయ్ యోజన.. ఖాతా ఎలా తెరవాలి? ఎవరికీ ఉపయోగం? పూర్తి వివరాలు
-
Karuppu : ఫైనాన్స్ అడ్డంకులు తొలగి థియేటర్లలోకి వచ్చిన సూర్య ‘కరుప్పు’
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
ట్రెండింగ్
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!