Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Congress Will Win Over 140 Seats In Karnataka Says Dk Shivaumar

DK Shivakumar: కర్ణాటకలో కాంగ్రెస్ 140 సీట్లకు పైగా గెలుస్తుంది..

Published Date :May 6, 2023 , 3:16 pm
By Mahesh Jakki
DK Shivakumar: కర్ణాటకలో కాంగ్రెస్ 140 సీట్లకు పైగా గెలుస్తుంది..
  • Follow Us :
  • google news
  • dailyhunt

DK Shivakumar: కర్ణాటకలో మే 10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 140 సీట్లకు పైగా గెలుస్తుందని కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ శనివారం విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్‌కు సౌకర్యవంతమైన మెజారిటీ వస్తుందని, 1978లో రాష్ట్రంలో పార్టీ విజయం సాధించినట్లే ఈ విజయం లోక్‌సభ ఎన్నికలకు తలుపులు తెరుస్తుందని అన్నారు.అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో యూనిఫాం సివిల్ కోడ్, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ వంటి అంశాలను లేవనెత్తినందుకు కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ బీజేపీపై విరుచుకుపడ్డారు. ఇది రాష్ట్రం పట్ల వారి ఆలోచనలను చూపుతుందని మండిపడ్డారు. కర్ణాటకపై బీజేపీకి ఎజెండా, విజన్ లేనందున ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ ఫ్యాక్టర్ పనిచేయదని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాజీ సీఎం సిద్ధరామయ్యతో పాటు ముఖ్యమంత్రి పదవిని ఆశించిన శివకుమార్, పార్టీలో అంతర్గత పోరుకు సంబంధించిన కథనాలన్నీ మీడియా సృష్టించినవేనని, వాటిలో నిజం లేదన్నారు. “వాస్తవం ఏమిటంటే కాంగ్రెస్ నాయకత్వం ఐక్యంగా ఉంది. పార్టీ కార్యకర్తలు మా సందేశాన్ని మైదానంలో, సోషల్ మీడియాలో వ్యాప్తి చేయడంలో చాలా చురుకుగా ఉన్నారు. కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చేలా మేము సంయుక్తంగా కృషి చేస్తున్నాము. “అని ఆయన చెప్పారు. తాను ముఖ్యమంత్రి పదవికి బలమైన పోటీదారుగా ఉన్నందున, కర్ణాటకలో పార్టీ మెజారిటీ సాధించేలా చూడడమే తన మొదటి ప్రాధాన్యత అని శివకుమార్ అన్నారు.గత మూడేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక టీకా ప్రచారం నుంచి 100 నాటౌట్ క్యాంపెయిన్, మేకేదాటు క్యాంపెయిన్, ఫ్రీడమ్ మార్చ్ వరకు 78 లక్షల మంది కాంగ్రెస్ సభ్యత్వ నమోదు వరకు కృషి చేస్తోంది. భారత్ జోడో యాత్ర కర్ణాటకలో ఘనవిజయం సాధించిందన్నారు.

Also Read

  • Watermelon Prices: నలుగురు మృతి.. రూ. 7కు పడిపోయిన వాటర్‌మిలన్ ధరలు..
  • West Bengal polls: బీజేపీ గుర్తుపై టేపులు.. రీపోలింగ్‌కు ఆదేశం..
  • MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
  • AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..

Read Also: Google Engineer Suicide: గూగుల్ ఆఫీస్‌పై నుంచి దూకి యువ టెకీ ఆత్మహత్య

గత మూడేళ్లలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోలేదని, ఇప్పుడు ఎటు చూసినా ఆ పార్టీ కష్టమే గెలిచిందన్న విశ్వాసం ప్రజల్లో ఉందన్నారు. “నాకు పార్టీనే మొదటి ప్రాధాన్యత, ముఖ్యమంత్రి పదవి తరువాత వస్తుంది. సీఎం పదవి విషయంలో, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా నేను కట్టుబడి ఉంటాను” అని శివకుమార్ అన్నారు. పీఎఫ్‌ఐ, భజరంగ్‌దళ్ వంటి సంస్థలపై నిషేధం విధించడంతోపాటు చట్ట ప్రకారం నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడం గురించి కాంగ్రెస్ మేనిఫెస్టోపై మాట్లాడుతున్న వివాదం గురించి అడగ్గా.. సమాజాన్ని విభజించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని శివకుమార్ ఆరోపించారు.‘బీజేపీ ప్రభుత్వం మన యువతకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయింది. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల విషయంలో సామాన్యులకు ఎలాంటి ఉపశమనం కలిగించలేకపోయింది. ఇప్పుడు రెచ్చగొట్టే ప్రసంగాలతో సమాజాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని ఆయన ఆరోపించారు. కర్ణాటకలో ఇది పనికిరాదని, ప్రజలు వాటిని తుడిచివేస్తారని ఆయన పేర్కొన్నారు. కర్ణాటక బీజేపీకి దక్షిణాదికి గేట్‌వే అని అడిగిన ప్రశ్నకు శివకుమార్ మాట్లాడుతూ, “రాష్ట్రంలో పనితీరు లేకపోవడం, అవినీతి, పెద్ద ఎత్తున నిరుద్యోగం కారణంగా కర్ణాటక ప్రజలు బీజేపీ ముఖంపై గేటును మూసివేసారు” అని అన్నారు. ప్రజలు కాంగ్రెస్‌కు పెద్దపీట వేస్తున్నారని, ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress
  • dk shivakumar
  • karnataka
  • Karnataka Assembly polls
  • karnataka elections

తాజావార్తలు

  • Sandeep Virk: క్యాస్టింగ్ కౌచ్‌పై నటి షాకింగ్ కామెంట్స్.. “రాత్రి 12 గంటలకు నా రూమ్‌లోకి వచ్చి .. ఆ పని చేయమన్నాడు!”

  • Watermelon Prices: నలుగురు మృతి.. రూ. 7కు పడిపోయిన వాటర్‌మిలన్ ధరలు..

  • Elon Musk vs OpenAI Lawsuit: ప్రపంచ కుబేరుల మధ్య AI యుద్ధం.. ఎలోన్ మస్క్ వర్సెస్ సామ్ ఆల్ట్‌మాన్.. అసలేం జరుగుతోంది?

  • West Bengal polls: బీజేపీ గుర్తుపై టేపులు.. రీపోలింగ్‌కు ఆదేశం..

  • MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions