Rajahmundry Tragedy: రాజమహేంద్రవరంలో విషాదం.. గోదావరిలోకి దూకిన ఏఈ కుటుంబం, ముగ్గురు గల్లంతు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజమహేంద్రవరంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పిఠాపురానికి చెందిన పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఏఈ నూకరాజు కుటుంబ సభ్యులతో కలిసి రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకారు. ఈ ఘటనలో నూకరాజు (60), ఆయన భార్య మీనా (58), కుమార్తె సౌజన్య (34) గల్లంతయ్యారు. నూకరాజు మనవడిని మత్స్యకారులు గుర్తించి రక్షించారు. ప్రస్తుతం బాలుడు సురక్షితంగా ఉన్నాడు.
ఘటనపై సమాచారం అందుకున్న రాజమహేంద్రవరం టూ టౌన్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి గోదావరిలో గల్లంతైన ముగ్గురి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈత రావడంతో ఏఈ మనవడు ప్రాణాలతో బయటపడ్డాడు. అదే సమయంలో మత్స్యకారులు అతడికి ఒడ్డుకు చేర్చారు. బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Also Read
- AP Assembly Sessions: నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. తొలి రోజు కీలక బిల్లులు, ఎల్నినోపై చర్చ!
- TVK Vijay Government: విజయ్ ప్రభుత్వానికి 100 రోజులు.. “డమ్మీ సీఎం” అంటూ విమర్శలు..!
- Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్లో విమాన సేవలు ప్రారంభం.. తొలి కమర్షియల్ ఫ్లైట్గా ఇండిగో!
- The Hundred Women's Champions: కావ్య మారన్కు నిరాశ.. ఫైనల్లో సన్రైజర్స్పై ట్రెంట్ రాకెట్స్ విజయం.!
షేక్ షాదీ ఖాన్ వేధింపులు, మోసాల కారణంగానే తాము ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు నూకరాజు తన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. తన కుమార్తెకు సహాయంగా ఉంటానని నమ్మించి షేక్ షాదీ ఖాన్ మోసం చేశాడని ఆరోపించారు. తన మనవడు కార్తీక్ రెడ్డికి రైఫిల్ షూటింగ్లో శిక్షణ ఇప్పిస్తూ.. కుమార్తెకు సహాయం చేస్తానని నమ్మించాడని లేఖలో పేర్కొన్నారు. అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించిన డబ్బులు, విలువైన వస్తువులు, బ్యాంకు ఖాతాలు షేక్ షాదీ ఖాన్ ఆధీనంలోకి వెళ్లాయని నూకరాజు తెలిపారు. తన కుమార్తె సౌజన్య భర్త ఈ ఏడాది జూలై 2న మృతి చెందిన విషయాన్ని కూడా లేఖలో ప్రస్తావించారు.
షేక్ షాదీ ఖాన్పై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులపై విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ను నూకరాజు కోరారు. ప్రస్తుతం గోదావరిలో గల్లంతైన నూకరాజు, మీనా, సౌజన్య కోసం పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, గజ ఈతగాళ్ల బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. ఘటనకు అసలు కారణాలు ఏమిటి, సూసైడ్ నోట్లో పేర్కొన్న ఆరోపణల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
Rajahmundry Tragedy: రాజమహేంద్రవరంలో విషాదం.. గోదావరిలోకి దూకిన ఏఈ కుటుంబం, ముగ్గురు గల్లంతు!
-
Alias Rukmini: నితిన్ కోసం రంగంలోకి దిగిన నాని.. ‘అలియాస్ రుక్మిణి’ షూటింగ్కు రెడీ!
-
El Nino: నెమ్మదిగా వేడెక్కుతున్న పసిఫిక్ జలాలు.. ప్రమాదం ముంచుకొస్తోందా?
-
Prabhas : ‘ఫౌజీలో ఈ సీన్ ఎంత బాగా తీశాడంటే’.. హను వర్క్ పట్ల సన్నిహితులతో ప్రభాస్
-
Explainer: ఆంధ్రప్రదేశ్లో దారుణ పరిస్థితులు..వర్షపు నీరు లేక రైతుల కంట కన్నీరు.. దేశంలోనే టాప్!
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?