Rajahmundry Tragedy: రాజమహేంద్రవరంలో విషాదం.. గోదావరిలోకి దూకిన ఏఈ కుటుంబం, ముగ్గురు గల్లంతు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజమహేంద్రవరంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పిఠాపురానికి చెందిన పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఏఈ నూకరాజు కుటుంబ సభ్యులతో కలిసి రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకారు. ఈ ఘటనలో నూకరాజు (60), ఆయన భార్య మీనా (58), కుమార్తె సౌజన్య (34) గల్లంతయ్యారు. నూకరాజు మనవడిని మత్స్యకారులు గుర్తించి రక్షించారు. ప్రస్తుతం బాలుడు సురక్షితంగా ఉన్నాడు.
ఘటనపై సమాచారం అందుకున్న రాజమహేంద్రవరం టూ టౌన్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి గోదావరిలో గల్లంతైన ముగ్గురి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈత రావడంతో ఏఈ మనవడు ప్రాణాలతో బయటపడ్డాడు. అదే సమయంలో మత్స్యకారులు అతడికి ఒడ్డుకు చేర్చారు. బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Also Read
- Bigg Boss 10 Telugu Live: బిగ్బాస్ సీజన్ 10 లైవ్ అప్డేట్స్.. హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు కంటెస్టెంట్స్..
- NTR Bharosa Pensions: ఎన్టీఆర్ భరోసా పింఛన్లు.. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇలా..
- Iran-Israel War: ఒకేసారి నాలుగు వైపుల నుంచి ఇజ్రాయెల్పై దాడి? ఇరాన్ భారీ వ్యూహం
- Temple Tourism: అమరావతికి సరికొత్త కాంతి.. తిరుమల తర్వాత ఆ స్థాయిలో అక్కడ శ్రీవారి క్షేత్రం..
షేక్ షాదీ ఖాన్ వేధింపులు, మోసాల కారణంగానే తాము ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు నూకరాజు తన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. తన కుమార్తెకు సహాయంగా ఉంటానని నమ్మించి షేక్ షాదీ ఖాన్ మోసం చేశాడని ఆరోపించారు. తన మనవడు కార్తీక్ రెడ్డికి రైఫిల్ షూటింగ్లో శిక్షణ ఇప్పిస్తూ.. కుమార్తెకు సహాయం చేస్తానని నమ్మించాడని లేఖలో పేర్కొన్నారు. అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించిన డబ్బులు, విలువైన వస్తువులు, బ్యాంకు ఖాతాలు షేక్ షాదీ ఖాన్ ఆధీనంలోకి వెళ్లాయని నూకరాజు తెలిపారు. తన కుమార్తె సౌజన్య భర్త ఈ ఏడాది జూలై 2న మృతి చెందిన విషయాన్ని కూడా లేఖలో ప్రస్తావించారు.
షేక్ షాదీ ఖాన్పై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులపై విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ను నూకరాజు కోరారు. ప్రస్తుతం గోదావరిలో గల్లంతైన నూకరాజు, మీనా, సౌజన్య కోసం పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, గజ ఈతగాళ్ల బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. ఘటనకు అసలు కారణాలు ఏమిటి, సూసైడ్ నోట్లో పేర్కొన్న ఆరోపణల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
Bigg Boss 10 Telugu Live: బిగ్బాస్ సీజన్ 10 లైవ్ అప్డేట్స్.. హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు కంటెస్టెంట్స్..
-
NTR Bharosa Pensions: ఎన్టీఆర్ భరోసా పింఛన్లు.. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇలా..
-
Iran-Israel War: ఒకేసారి నాలుగు వైపుల నుంచి ఇజ్రాయెల్పై దాడి? ఇరాన్ భారీ వ్యూహం
-
Temple Tourism: అమరావతికి సరికొత్త కాంతి.. తిరుమల తర్వాత ఆ స్థాయిలో అక్కడ శ్రీవారి క్షేత్రం..
-
Harish Rao : అసెంబ్లీలో కాంగ్రెస్కు చుక్కలు చూపిస్తాం
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!