తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి విమానాశ్రయంలో ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న నూతన టెర్మినల్ భవనంలో కొంత భాగం కుప్ప కూలింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు కార్మికులు కొంత దూరంగా ఉండటంతో సురక్షితంగా బయటపడ్డారు. అయితే ప్రమాదానికి సంబంధించి ఎలా జరిందనే దానిపై అధికారులు విచారణ చేపట్టారు.
గత కొన్ని రోజులుగా మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా ఉజ్జయినిలోని మహాకాల్ ఆలయ సరిహద్దు గోడ కుప్పకూలింది. కాగా.. ఈ ప్రమాదంలో శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నారని తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్లో విషాదం చోటు చేసుకుంది. రోడ్డుకు ఆనుకుని ఉన్న చిత్రగుప్త దేవాలయం గోడ కూలిపోయింది. ఈ సమయంలో అక్కడ రోడ్డు నిర్మాణం పనులు చేస్తున్న కార్మికులపై పడింది. దీంతో.. నలుగురు కూలీలపై శిథిలాలు పడ్డాయి. భారీ శబ్దం రావడంతో.. వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని శిథిలాల నుండి కూలీలను బయటకు తీసి ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఓ కూలీ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
మీరట్లో పెను ప్రమాదం చోటు చేసుకుంది. లోహియా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాకీర్ కాలనీలో 50 ఏళ్ల నాటి మూడంతస్తుల భవనం కూలిపోయింది. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా శిథిలావస్థలో ఉన్న ఓ ఇల్లు కూలిపోయింది. దీంతో.. కుటుంబం మొత్తం శిథిలాల లోపలే చిక్కుకుపోయారు. ఇంట్లో ఉన్న 8 మందికి పైగా సమాధి అయినట్లు సమాచారం.
విశాఖలో కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ప్రమాదం తప్పింది. జోరు వానలకు తడిచి గోడలు కూలిపోతున్నాయి. మరోవైపు.. కంచరపాలెంలో రైల్వే గోడ కూలిన ఘటన చోటు చేసుకుంది. దీంతో.. తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. గవర కంచరపాలెంలో ఇళ్లకు ఆనుకొని రైల్వే గోడ ఉండటంతో.. అది కూలి కార్లు, బైక్ లు, కరెంట్ పోల్స్ ధ్వంసం అయ్యాయి. ఇదిలా ఉంటే.. కూలిన రైల్వే గోడ పక్కన వినాయక మండపం ఉంది. గోడ కూలిన సమయంలో వినాయక మండపంలో…
మహారాష్ట్రలోని రాజ్కోట్ కోటలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. 8 నెలల క్రితం ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభమైన విగ్రహం కూలిపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
3 Store Building Collapsed In Uttarpradesh: ఉన్నట్టుండి మూడంతస్తుల భవనం కుప్పకూలింది. దీంతో పలువురు శిధిలాల కింద చిక్కుకున్నారు. ఇద్దరు మరణించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బారాబంకీలో జరిగింది. అనుకోకుండా భవనం కుప్పకూలి పోవడంతో చుట్టుపక్కల వారు బిల్డింగ్ లో ఉన్న వారు భయభ్రాంతులకు గురయ్యారు. కొంతమంది బిల్డింగ్ నుంచి బయటకు పరుగులు పెట్టారు. మరికొందరు భవనంలో ఉండిపోవడంతో శిధిలాల కింద చిక్కుకున్నారు. అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు అందిస్తున్నారు.…
ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. మధురలోని బాంకే బిహారీ దేవాలయం సమీపంలో మంగళవారం సాయంత్రం పెను ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా మూడంతస్తుల భవనం పైభాగం కూలిపోవడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
గుజరాత్లోని జునాగఢ్లో ఓ రెండు అంతస్థుల బిల్డింగ్ కూలిపోయింది. దీంతో ఆ భవనం శిథిలాల కింద నలుగురు చిక్కుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. నగరంలోని దాతర్ రోడ్లోని కడియావాడ్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల నేపథ్యంలో.. బిల్డింగ్ పాతది కావడంతో కూలిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.