Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లో ఘోరం.. భవనం పైభాగం కూలి ఐదుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం సంభవించింది. మధురలోని బాంకే బిహారీ దేవాలయం సమీపంలో మంగళవారం సాయంత్రం పెను ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా మూడంతస్తుల భవనం పైభాగం కూలిపోవడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరణించిన ఐదుగురిలో ముగ్గురు కాన్పూర్కు చెందినవారిగా గుర్తించారు. వారు బాంకే బిహారీ దేవాలయాన్ని సందర్శించడానికి వచ్చారు. మరోవైపు శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసి.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని.. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. జేసీబీ సాయంతో అధికారులు శిథిలాలను తొలగిస్తున్నారు.
Read Also: Heart Attack Treatment: గుండె చికిత్సలపై సర్కార్ స్పెషల్ ఫోకస్.. ప్రత్యేక వైద్య వ్యవస్థ ఏర్పాటు..
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
ఈ ఘటనపై ఎస్ఎస్పీ శైలేష్ పాండే మాట్లాడుతూ.. జిల్లాలో మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తోందని.. వర్షం కారణంగా సాయంత్రం ఇంటి పైభాగం ఒక్కసారిగా కుప్పకూలిందని తెలిపారు. స్థానికులు ఈ ఘటనపై సమాచారం అందించారని.. వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు తెలిపారు. మరోవైపు మునిసిపల్ కార్పొరేషన్ బృందాన్ని సంఘటనా స్థలానికి పిలిచినట్లు ఎస్ఎస్పీ శైలేష్ పాండే తెలిపారు. వారు ఆ భవనాన్ని పరిశీలిస్తున్నారని.. భవనంలోని ఏదైనా భాగం దెబ్బతిన్నట్లు గుర్తించినట్లయితే, భవిష్యత్తులో అలాంటి సంఘటనలు జరగకుండా, భవనాన్ని కూల్చివేయనున్నట్లు తెలిపారు. మరోవైపు ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో జనాలు భయాదోళనకు గురయ్యారు.
తాజావార్తలు
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!