House Collapsed: మీరట్లో కూలిన మూడంతస్తుల భవనం, శిథిలాల కింద 8 మంది..!
- మీరట్లో పెను ప్రమాదం
- జాకీర్ కాలనీలో కూలిపోయిన 50 ఏళ్ల నాటి మూడంతస్తుల భవనం
- శిథిలాల కింద 8 మందికి పైగా సమాధి అయినట్లు సమాచారం.
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో పెను ప్రమాదం చోటు చేసుకుంది. లోహియా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాకీర్ కాలనీలో 50 ఏళ్ల నాటి మూడంతస్తుల భవనం కూలిపోయింది. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా శిథిలావస్థలో ఉన్న ఓ ఇల్లు కూలిపోయింది. దీంతో.. కుటుంబం మొత్తం శిథిలాల లోపలే చిక్కుకుపోయారు. ఇంట్లో ఉన్న 8 మందికి పైగా సమాధి అయినట్లు సమాచారం. స్థానిక పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
Read Also: NASA: రికార్డు స్థాయిలో భూమి చుట్టూ తిరుగుతున్న వ్యోమగాములు.. ఎంతమంది ఉన్నారంటే..?
Also Read
- Cylinder Vs Hotels: ‘సిలిండర్ రేట్లు పెరిగాయ్.. అందుకే ధరలు పెంచాం’.. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న హోటల్స్..
- Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్పై రూ. 4-5, LPGపై రూ. 40-50 పెరిగే ఛాన్స్..?
- Bengal Repolling: పశ్చిమ బెంగాల్లో రీపోలింగ్.. 15 కేంద్రాల్లో మళ్లీ ఓటింగ్..
- UAE: 48 గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. పాకిస్తానీ ఉద్యోగులకు యూఏఈ షాక్..
సమాచారం ప్రకారం.. ఆ ఇల్లు నఫో అనే 50 ఏళ్ల మహిళకు చెందినది. నఫో ఇద్దరు కుమారులు సాజిద్, గోవిందలు తమ భార్యలు, పిల్లలతో కలిసి ఇంట్లో నివసిస్తున్నారు. కుటుంబం మొత్తం శిథిలాల కింద పడిపోయారు. ఈ కుటుంబం పాల వ్యాపారం నిర్వహిస్తూ జీవిస్తున్నారు. కింది అంతస్తులో గేదెలను కూడా కట్టేశారు. ఒక్కసారిగా ఇల్లు కూలిపోవడంతో గేదెలు కూడా శిథిలాల కింద పడి పోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో జేసీబీ లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో రెస్క్యూ ఆపరేషన్కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
Read Also: Indore: బ్యాంక్ ఉద్యోగి భార్యపై ఆర్మీ సైనికుడు అత్యాచారం.. తర్వాత ప్రైవేట్ పార్ట్లో..!
ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అంతే కాకుండా.. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సహాయక బృందాలు అక్కడికక్కడే సహాయక చర్యల్లో నిమగ్నమై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
తాజావార్తలు
-
Buchi Babu: ‘పెద్ది’ని గుండెల్లోంచి తీసేయడం ఎవరికీ సాధ్యం కాదు.. బుచ్చిబాబు
-
Cylinder Vs Hotels: ‘సిలిండర్ రేట్లు పెరిగాయ్.. అందుకే ధరలు పెంచాం’.. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న హోటల్స్..
-
Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్పై రూ. 4-5, LPGపై రూ. 40-50 పెరిగే ఛాన్స్..?
-
Sukumar: శిష్యుడిని మెచ్చుకున్న గురువు.. ‘పెద్ది’ లాంటి కమర్షియల్ ఎమోషనల్ రైడ్ ఈ మధ్య రాలేదు: సుకుమార్
-
Bengal Repolling: పశ్చిమ బెంగాల్లో రీపోలింగ్.. 15 కేంద్రాల్లో మళ్లీ ఓటింగ్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!