Mizoram: మిజోరాంలో ఘోర ప్రమాదం.. నిర్మాణంలోని రైల్వే బ్రిడ్జి కూలి 17 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mizoram: మిజోరాంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలోని రైల్వే బ్రిడ్జి కూలి 17 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన శిధిలాల కింద 30 మంది వరకు కూలీలు ఉన్నట్టు సమాచారం. మిజోరం రాష్ట్రంలో సాయిరంగ్ వద్ద ఉన్న కురంగ్ నదిపై బ్రిడ్జ్ను నిర్మిస్తున్నారు. సాయిరంగ్ నుంచి బైరాబి మధ్య ఈ బ్రిడ్జ్ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనుల్లో దాదాపు 40 మంది వర్కర్లు ఉండి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇనుప బ్రిడ్జ్ కింద చిక్కుకున్న 17 మంది కార్మికులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది వర్కర్లు శిథిలాల కింద ఉన్నట్లు తెలుస్తోంది. మిజోరాం రాజధాని ఐజ్వాల్ కు 21 కి.మీ. దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో 35 నుండి 40 మంది కార్మికులు పనిచేస్తున్నారు.
Read Also: Jupalli: కేసీఆర్ మళ్లీ అధికారంలో వస్తే రాష్ట్రాన్ని అమ్మేయడం ఖాయం..! జూపల్లి కీలక వ్యాఖ్యలు
Also Read
- Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- Maharashtra: ఘోర విషాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు మృతి
శిథిలాల కింద నుండి 17 మృతదేహలను వెలికి తీశారు. ఇంకా కొందరు కార్మికుల ఆచూకీ లభ్యం కావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఆచూకీ లేకుండా పోయిన కార్మికులు శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. శిథిలాల తొలగింపు ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. విషయం తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. రైల్వే ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. బైరాగి-సాయిరాంగ్ కొత్త రైల్వే లైన్ కోసం వంతెన నిర్మాణం చేస్తున్నారు. ఈ బ్రిడ్జి కుప్పకూలినట్టుగా మిజోరం సీఎం జోరంతంగా పేర్కొన్నారు. ఈ దుర్ఘటన పై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. దేశంలోని ఇతర ప్రాంతాలతో ఐజ్వాల్ ను కలిపేందుకు 51.38 కి.మీ. దూరం కొత్త రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు.ఈ క్రమంలోనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు.
తాజావార్తలు
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
దిల్ రాజు – అక్షయ్ కుమార్ మూవీ రిలీజ్ డేట్ ఖరారు..
-
Shubman Gill: “మా ప్లాన్ వర్కవుట్ అయింది”.. హైదరాబాద్పై భారీ విజయం తర్వాత గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Ramayana: ‘రామాయణ’లో..సాయి పల్లవిపై మేకర్స్ కీలక నిర్ణయం!
-
Daily Horoscope: బుధవారం రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని శుభవార్తలు!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!