Vizag: తృటిలో తప్పిన ప్రమాదం.. కంచరపాలెంలో కూలిన రైల్వే గోడ
- విశాఖలో జోరు వానలకు తడిచి కూలుతున్న గోడలు
- కూలిన రైల్వే గోడపక్కనే వినాయక మండపం
- సురక్షితంగా బయటపడిన వినాయక మండపంలోని చిన్నారులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖలో కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ప్రమాదం తప్పింది. జోరు వానలకు తడిచి గోడలు కూలిపోతున్నాయి. మరోవైపు.. కంచరపాలెంలో రైల్వే గోడ కూలిన ఘటన చోటు చేసుకుంది. దీంతో.. తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. గవర కంచరపాలెంలో ఇళ్లకు ఆనుకొని రైల్వే గోడ ఉండటంతో.. అది కూలి కార్లు, బైక్ లు, కరెంట్ పోల్స్ ధ్వంసం అయ్యాయి. ఇదిలా ఉంటే.. కూలిన రైల్వే గోడ పక్కన వినాయక మండపం ఉంది. గోడ కూలిన సమయంలో వినాయక మండపంలో చిన్నారులు ఉన్నారు. అయితే.. మండపంలో ఉన్న చిన్నారులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వానలకు మిగిలిన రైల్వే గోడ ఎక్కడ కూలి విద్యుత్ స్తంభాలు, ఇంటిమీద పడిపోతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Ap Floods : 3 రోజుల్లో 60 వేల మందికి రేషన్ పంపిణీ.. 42 డ్రోన్ల సహాయంతో లక్ష మందికి పైగా ఫుడ్
Also Read
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
- President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
- Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. 'నా వ్యాఖ్యల్లో తప్పు లేదు'..!
మరోవైపు.. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో.. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచనతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. అంతేకాకుండా.. విశాఖ, అల్లూరి జిల్లా, అనకాపల్లి, కాకినాడ, యానంలకు భారీ వర్షంతో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు విశాఖ వాతావరణ శాఖ అధికారులు. విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ఫ్లాష్ ఫ్లాట్ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. తీవ్రవాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకి 40 నుంచి 50 కి.మీ గరిష్టంగా 70 కిలోమీటర్ల బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. రేపు సాయంత్రం లేదా రాత్రి పూరి- దిఘా మధ్య తీవ్ర వాయుగుండం తీరాన్ని దాటే అవకాశం ఉందన్నారు. కళింగపట్నం, భీమునిపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులలో మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
Jackal attack: యూపీలో తోడేళ్లకు తోడైన నక్కలు.. దాడిలో 12 మంది గాయాలు..
తాజావార్తలు
-
Virat Kohli: లండన్లో ఆ ప్లేయర్తో విరాట్ సీక్రెట్ మీటింగ్.. రెండు గంటల్లోనే వైరల్ ఫొటోలు చూసి కోహ్లీ షాక్!
-
Wedding Fight: మటన్ పెడతామని ఒప్పుకొని.. చికెన్ పెడతారా?.. పెళ్లి విందులో పొట్టు పొట్టు తన్నుకున్న వైనం
-
Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
-
Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జోడీగా ‘శ్రీశ్రీ’.. క్లాసిక్ లవ్ స్టోరీతో వస్తోన్న పాన్ ఇండియా మూవీ
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!