పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం అంతకంతకు బలపడుతోంది. వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని ఐఎండీ ప్రకటించింది. ఏపీ తీరానికి సమాంతరంగా పయనిస్తూ మయన్మార్ వైపు వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం కాకినాడ నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు తీవ్రంగా ఉండనుంది. తీరం వెంట గంటకు 60 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది.
ఫెంగల్ తుఫాన్ తీరాన్ని తాకింది.. పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాకినట్టు ఐఎండీ ప్రకటించింది.. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. తుఫాన్ తీరం తాకిన తర్వాత.. మహాబలిపురం-కరైకల్ మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైనట్లు భారత వాతావరణ విభాగం పేర్కొంది.. దాదాపు 4 గంటల్లో తీరం దాటే ప్రక్రియ పూర్తి అవుతుందని అంచనా వేస్తున్నారు.. ఇక, ఈ రోజు రాత్రి 11.30 గంటల సమయానికి.. తీవ్ర వాయుగుండంగా…
దానా తుఫాన్ ఇచ్ఛాపురంపైనే అధిక ప్రభావాన్ని చూపుతుందనే అంచనాలతో పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లోని ఉద్దానం, తీర గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. గత, అనుభవాల దృష్ట్యా.. దానా ఏం చేస్తుందో అనే టెన్షన్లో పడిపోయారు..
భారత వాతావరణ శాఖ అంచనాలకు తగ్గట్టుగానే ఒడిశాలోని పూరీ దగ్గర తీవ్ర వాయుగుండం తీరం దాటింది. భూ ఉపరితలంపై అదే తీవ్రతతో ఈ రోజు అర్ధరాత్రి వరకు కొనసాగుతూ బలహీనపడుతుందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం అంచనా వేస్తోంది.. ఇక, దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
'రెమాల్' తుఫాను తీవ్ర తుఫానుగా మారింది. ఆదివారం అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీపం, బంగ్లాదేశ్లోని ఖేపుపరా మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. మరోవైపు తీవ్ర తుపాను 'రెమల్' హెచ్చరికల మధ్య కోల్కతాలో వర్షం ప్రారంభమైంది. ఈ మేరకు వాతావరణ శాఖ సమాచారం ఇచ్చింది. ముందస్తు రుతుపవనాల సీజన్లో బంగాళాఖాతంలో తుఫాను రావడం ఇదే తొలిసారి. భారత వాతావరణ శాఖ (IMD) ఆదివారం విడుదల చేసిన సమాచారం ప్రకారం.. 'రెమల్' ఉత్తర బంగాళాఖాతం, ఖేపుపారాకు 220…
కాకినాడ తీరంలో అగ్నిప్రమాదం జరిగింది. సముద్రంలో వేటకు వెళ్తున్న మత్య్సకారుల బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు బోటు మొత్తం అంటుకున్నాయి. దీంతో మత్య్సకారులు లైఫ్ జాకెట్లు ధరించి సముద్రంలోకి దూకేశారు. ఇక, విషయం తెలుసుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది ప్రాణాలకు తెగించి రెస్యూ ఆపరేషన్ నిర్వహించారు.
నైరుతి రుతుపవనాల కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ముంబయిలో అయితే వర్షాలు ఆగకుండా కురుస్తూనే ఉన్నాయి.
గ్రీక్ తీరంలో ఓడ బోల్తా పడడంతో 17 మంది మృతి చెందారు. 100 మంది రక్షించబడ్డారు. పెలోపొన్నీస్ సముద్రంలో బుధవారం తెల్లవారు జామున పడవ బోల్తా పడటంతో 17 మంది వలసదారులు మరణించారని.