Cyclone Fengal: తీరాన్ని తాకిన ఫెంగల్ తుఫాన్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..
- తీరాన్ని తాకిన ఫెంగల్ తుఫాన్..
- పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాకినట్టు ఐఎండీ ప్రకటన..
- తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్లోని భారీ వర్షాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone Fengal: ఫెంగల్ తుఫాన్ తీరాన్ని తాకింది.. పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాకినట్టు ఐఎండీ ప్రకటించింది.. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. తుఫాన్ తీరం తాకిన తర్వాత.. మహాబలిపురం-కరైకల్ మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైనట్లు భారత వాతావరణ విభాగం పేర్కొంది.. దాదాపు 4 గంటల్లో తీరం దాటే ప్రక్రియ పూర్తి అవుతుందని అంచనా వేస్తున్నారు.. ఇక, ఈ రోజు రాత్రి 11.30 గంటల సమయానికి.. తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది.. ప్రధానంగా తమిళనాడుకు సరిహద్దు ప్రాంతాల్లో వర్షపు జోరు కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో అధికంగా వర్షాలు కుడుస్తుండడంతో జనజీవనానికి అంతరాయం కలుగుతుంది.. వాగులు.. వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.. స్వర్ణముఖి.. కాలంగి.. కైవల్యా నదులతో పాటూ బొగ్గేరు.. బీరా పేరు.. పంబలేరులలో నీటి ప్రవాహం పెరిగింది. కాలంగినది నీరు పులికాట్ కు చేరుతుండడంతో సరస్సు జలకళను సంతరించుకుంటోంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు జిల్లా అధికారులు సూచిస్తున్నారు.
Read Also: Scissors In Abdomen: మహిళ కడుపులో కత్తెర.. చూసి షాకైన డాక్టర్లు
Also Read
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
- Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
ఇక, ఫెంగల్ తుఫాన్ దెబ్బకు అల్లాడిపోతోంది డెల్టా… ఇప్పటికే తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ లలో ప్రభావం చూపిస్తోంది తుఫాన్.. డెల్టా ప్రాంతంలోని తెనాలి, బాపట్ల డివిజన్లతో పాటు, గుంటూరు డివిజన్లో వర్షాలు కురుస్తున్నాయి.. డెల్టా ప్రాంతంలో అనేక చోట్ల నేలకొరిగాయి వరి పంట.. నవంబర్ మాసంలో వచ్చే తుఫాన్లు డెల్టా ప్రాంతానికి తీవ్ర నష్టం చేకూరుస్తాయని, ఆందోళన చెందుతున్నారు రైతులు.. కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, తుఫాన్ తీరం దాటే సమయంలో గంటలకు 70 నుంచి 80 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని ఐఎండీ పేర్కొంది.. తిరుపతి, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తుండగా.. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది..
తాజావార్తలు
-
Moto G Max: మోటో జీ మ్యాక్స్ భారత్లో త్వరలో లాంచ్.. 50MP Sony కెమెరా, Snapdragon చిప్
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
ట్రెండింగ్
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!