Cyclone Michaung: తీరం దిశగా దూసుకొస్తోన్న మిచౌంగ్.. తీరం దాటేది అక్కడే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone Michaung: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్ మిచుంగ్ కోస్తా ఆంధ్ర దిశగా దూసుకొస్తోంది. ప్రస్తుతం నెల్లూరుకు ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలో తుపాన్ కొనసాగుతుంది. అలాగే బాపట్లకు ఆగ్నేయ దిశలో 300 కిలోమీటర్ల దూరంలో… మచిలీపట్నానికి దక్షిణంగా 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర దిశగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలైన నెల్లూరు-మచిలీపట్టణానికి సమాంతరంగా ప్రయాణిస్తోంది. బాపట్ల-దివిసీమ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తుఫాన్ వల్ల దివిసీమకు ఉప్పెన ముప్పు పొంచి ఉందని తెలుస్తుంది. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. సముద్రంలో రాకాసి అలలు ఎగసిపడతాయంటున్నారు వాతావరణ నిపుణులు. తుఫాన్ ప్రభావం వల్ల కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావారణ శాఖ హెచ్చరించింది.
Read Also: Nani: తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు.. నాని ఏమన్నాడంటే.. ?
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
మిచౌంగ్ తుఫాన్ సన్నద్ధతపై అధికారులతో సమీక్షించారు ఏపీ ముఖ్యమంత్రి YS జగన్. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదే అన్నారాయన. కోతకు వచ్చిన ఖరీఫ్ పంటను కాపాడుకోవాల్సి అవసరం ఉందన్నారు సీఎం జగన్. తుఫాన్ వల్ల నష్టపోయిన వాళ్లకు వెంటనే పరిహారం ఇవ్వాలన్నారు. తుఫాను సహాయక చర్యల్లో కలెక్టర్లకు సాయంగా ప్రతి జిల్లాకు సీనియర్ అధికారులను నియమిస్తున్నామన్నారు సీఎం జగన్. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో తాను కూడా పర్యటిస్తానన్నారు సీఎం జగన్. ప్రజల దగ్గరకు వెళ్లి.. కలెక్టర్లు బాగా చేశారా? లేదా? అని అడుగుతానన్నారు. బాధితుల నుంచి అధికారుల పనితీరు బాలేదనే సమాధానం రాకూడదని స్పష్టం చేశారు జగన్. ప్రస్తుతం తెలంగాణ వైపు తూర్పు దిశ నుంచి బలంగా గాలులు వీస్తున్నాయి. దీంతో తెలంగాణకి ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ చేసింది ఐఎండీ. మిచౌంగ్ తుఫాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండటంతో… 115 రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. అటు ఒడిశాలోని భువనేశ్వర్ కేంద్రంగా పని చేస్తున్న ఈస్ట్ కోస్టు రైల్వే కూడా 60 రైళ్లను రద్దు చేసింది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!