Heavy Rains: తీరం వైపు దీసుకొస్తున్న తీవ్ర అల్పపీడనం.. ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు..
- అల్పపీడన ప్రభావంతో ఏపీలో భారీవర్షాలు కురిసే అవకాశం..
- కోస్తాంధ్రలో చాలాచోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వానలు..
- గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ..
- ప్రధాన పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ ..
- అల్పపీడనం వల్ల ఉగ్రరూపం దాల్చిన సముద్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rains: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం అంతకంతకు బలపడుతోంది. వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని ఐఎండీ ప్రకటించింది. ఏపీ తీరానికి సమాంతరంగా పయనిస్తూ మయన్మార్ వైపు వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం కాకినాడ నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు తీవ్రంగా ఉండనుంది. తీరం వెంట గంటకు 60 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ప్రధాన పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక, అల్పపీడన ప్రభావంతో ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వానలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే చాన్స్ ఉంది.
Read Also: Hyderabad: ఐకియా వాహనంలో గంజాయి సరఫరా.. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఇస్తున్న డ్రైవర్లు
Also Read
- Sajjala Ramakrishna Reddy: రెండేళ్ల పాలనపై ప్రజల ఆగ్రహం బయటపడింది.. చంద్రబాబుకు ఇదే లాస్ట్ టర్మ్..!
- Minister Vasamsetti Subhash: కార్మికుల కోసం సర్కార్ కీలక నిర్ణయం.. అంతా ఒకే దగ్గర..!
- CM Chandrababu: విధ్వంసం నుంచి అభివృద్ధి దిశగా.. సంక్షేమం – అభివృద్ధే మా ప్రభుత్వ లక్ష్యం
- CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. విశాఖలో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. గోపాలపట్నం ఇందిరానగర్లో ప్రహరీ కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అల్పపీడనం ప్రభావంతో విజయనగరం జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. వర్షాలకు తోడు, కారుమబ్బులు కమ్ముకోవడంతో వాహనదారులు పట్టపగలే లైట్లు వేసుకుంటూ ప్రయాణం చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతంలో అల్పపీడనం పంటలపై ప్రభావం చూపుతోంది. నాన్ స్టాప్గా పడుతున్న వర్షానికి పత్తి పంట దెబ్బతింది. చేతికి అందే సమయంలో పంట తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గుమ్మలక్ష్మీపురం, కురుపాం ఏజెన్సీ ప్రాంతంలో రెండు రోజులుగా మోస్తరు వర్షాలు పడుతున్నాయి.
Read Also: CM Chandrababu: రైతులకు గుడ్న్యూస్ చెప్పిన సీఎం.. 48 గంటల్లోనే డబ్బులు..!
అల్పపీడనం వల్ల సముద్రం ఉగ్రరూపం దాల్చింది. ఉప్పాడ తీరంలో అలల ఉధృతి ఎక్కువైంది. సూరాడపేటలో నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ భవనం కుప్పకూలింది. ఉప్పాడ, సుబ్బంపేట, సూరాడపేట, మాయపట్నం, అమీనాబాద్, కోనపాపపేట గ్రామాల దగ్గర తీరం కోతకు గురైంది. ఇళ్లు, చెట్లు కూలిపోయాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. తుఫాన్లు వచ్చిన ప్రతిసారి తీరం కోతకు గురై పదులు సంఖ్యలో నివాసాలు సముద్రగర్భంలో కలిసిపోతున్నాయని మత్స్యకారులు వాపోతున్నారు. తీర ప్రాంతం కోతకు గురికాకుండా ప్రభుత్వం శాశ్వత పరిస్కారం చూపాలని కోరుతున్నారు.
తాజావార్తలు
-
Social Media: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కు అంతరాయం.. ఇబ్బందుల్లో యూజర్లు
-
Rao Bahadur Teaser: లాస్ట్లో ఆ డైలాగ్ నెక్స్ట్ లెవెల్.. సత్యదేవ్ ‘రావు బహదూర్’ టీజర్ చూశారా!
-
CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
-
Trigrahi Raja Yoga: జూన్ 15న మిథున రాశిలో “త్రిగ్రాహి రాజయోగం”.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
-
Meenakshi Natarajan: నాది బూటకపు కేసు కాదు.. మీనాక్షి నటరాజన్ ఫిర్యాదుదారు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!