Heavy Rains: తీరం వైపు దీసుకొస్తున్న తీవ్ర అల్పపీడనం.. ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు..
- అల్పపీడన ప్రభావంతో ఏపీలో భారీవర్షాలు కురిసే అవకాశం..
- కోస్తాంధ్రలో చాలాచోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వానలు..
- గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ..
- ప్రధాన పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ ..
- అల్పపీడనం వల్ల ఉగ్రరూపం దాల్చిన సముద్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rains: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం అంతకంతకు బలపడుతోంది. వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని ఐఎండీ ప్రకటించింది. ఏపీ తీరానికి సమాంతరంగా పయనిస్తూ మయన్మార్ వైపు వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం కాకినాడ నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు తీవ్రంగా ఉండనుంది. తీరం వెంట గంటకు 60 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ప్రధాన పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక, అల్పపీడన ప్రభావంతో ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వానలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే చాన్స్ ఉంది.
Read Also: Hyderabad: ఐకియా వాహనంలో గంజాయి సరఫరా.. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఇస్తున్న డ్రైవర్లు
Also Read
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
- AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ!.
- Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
- CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. విశాఖలో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. గోపాలపట్నం ఇందిరానగర్లో ప్రహరీ కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అల్పపీడనం ప్రభావంతో విజయనగరం జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. వర్షాలకు తోడు, కారుమబ్బులు కమ్ముకోవడంతో వాహనదారులు పట్టపగలే లైట్లు వేసుకుంటూ ప్రయాణం చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతంలో అల్పపీడనం పంటలపై ప్రభావం చూపుతోంది. నాన్ స్టాప్గా పడుతున్న వర్షానికి పత్తి పంట దెబ్బతింది. చేతికి అందే సమయంలో పంట తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గుమ్మలక్ష్మీపురం, కురుపాం ఏజెన్సీ ప్రాంతంలో రెండు రోజులుగా మోస్తరు వర్షాలు పడుతున్నాయి.
Read Also: CM Chandrababu: రైతులకు గుడ్న్యూస్ చెప్పిన సీఎం.. 48 గంటల్లోనే డబ్బులు..!
అల్పపీడనం వల్ల సముద్రం ఉగ్రరూపం దాల్చింది. ఉప్పాడ తీరంలో అలల ఉధృతి ఎక్కువైంది. సూరాడపేటలో నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ భవనం కుప్పకూలింది. ఉప్పాడ, సుబ్బంపేట, సూరాడపేట, మాయపట్నం, అమీనాబాద్, కోనపాపపేట గ్రామాల దగ్గర తీరం కోతకు గురైంది. ఇళ్లు, చెట్లు కూలిపోయాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. తుఫాన్లు వచ్చిన ప్రతిసారి తీరం కోతకు గురై పదులు సంఖ్యలో నివాసాలు సముద్రగర్భంలో కలిసిపోతున్నాయని మత్స్యకారులు వాపోతున్నారు. తీర ప్రాంతం కోతకు గురికాకుండా ప్రభుత్వం శాశ్వత పరిస్కారం చూపాలని కోరుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!