యూఎస్ హౌస్ స్పీకర్ కెవిన్ మెక్కార్తీని కలిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చైనా బెదిరించినప్పటికీ దౌత్యపరమైన ఒప్పందాల కోసం తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ న్యూయార్క్ చేరుకున్నారు.
Ajit Doval: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సిఓ) సభ్యదేశాలు పరస్పరం తమ ప్రాదేశిక సమగ్రతను గౌరవించుకోవాలని భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ఢిల్లీలో జరిగిన ఎస్సిఓ స్థాయి ఎన్ఎస్ఏ సమావేశంలో ఆయన ఇలా వ్యాఖ్యానించారు. సార్వభౌమాధికారం మరియు ప్రాదేశిక సమగ్రతను పరస్పరం గౌరవించుకోవాలని సభ్యదేశాలకు పిలుపునిచ్చారు.
ఆసియా కుబేరుడు, అలీబాబా సంస్థల వ్యవస్థాపకుడు జాక్మా స్వదేశం చైనాకు తిరిగి వచ్చాడు. సోమవారం ఆయన ఓ పాఠశాలను సందర్శించారు. ప్రభుత్వ ఆగ్రహానికి గురైన దేశాన్ని వీడిన జాక్ మా.. దాదాపు ఏడాదిన్నర తర్వాత చైనాలో అడుగుపెట్టారు.
భారత్లో జరిగిన జీ20 రహస్య సమావేశానికి చైనా గైర్హాజరయ్యిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ వేదికగా జీ-20 రహస్య సమావేశం జరిగింది.
Girl Friend On Rent: చైనాలో జనాభా వృద్ధి గణనీయంగా తగ్గిపోతోంది. 30 ఏళ్లు నిండిన యువతీయువకులు పెళ్లిళ్లు చేసుకునేందుకు ఒప్పుకోవడం లేదు. ఒంటరి జీవితానికే ఓటేస్తున్నారు. దీంతో సంతానోత్పత్తి రేటు తగ్గడంతో జనాభా వృద్ధి తగ్గుతోంది. గత 40 ఏళ్లతో పోలిస్తే 2022లో అతి తక్కువ జనాభా వృద్ధి చైనాలో నమోదు అయింది. వన్ చైల్డ్ విధానం కూడా ఇందుకు ఓ కారణం అయింది. దీంతో ఇప్పుడు చైనాలో ముసలి జనాభా పెరిగింది.
PM Narendra Modi: ప్రధాని మోదీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. ప్రపంచ దిగ్గజ నాయకుల్లో ఒకరిగా ప్రశంసిస్తున్నారు. అయితే మనం శతృవుగా భావించే చైనాలో కూడా మోదీకి ఆదరణ పెరుగుతోంది. ఏకంగా మోదీకి ముద్దు పేరు పెట్టి పిలుచుకుంటున్నారు. చైనా ప్రజల నుంచి ఇంతకుముందు ఏ విదేశీ నేతకు ఇంత ఆదరణ రాలేదు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత ఉన్నా.. చైనా ప్రజలు మాత్రం మోదీని అసాధారణ నేతగా పరిగణిస్తున్నారు.
S Jaishankar: ఇండియా, చైనాల మధ్య పరిస్థితి ప్రమాదకరంగానే ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. హిమాలయాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇరు దేశాల బలగాలు దగ్గరదగ్గరగా ఉన్నాయని, సైనికపరంగా ప్రమాదకరంగా ఉన్నాయని శనివారం ఆయన అన్నారు. ఇండియా టుడే ఇండియా టుడే కాన్క్లేవ్లో ఎస్ జైశంకర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Insect rain in China : అదేంటో ప్రపంచంలో వింతలన్నీ చైనాలోనే జరుగుతుంటాయి. ఇలాంటి వింతతో మరోసారి ఆ దేశం వార్తల్లో నిలిచింది. ఆ దేశ రాజధాని బీజింగ్లో ఇటీవల పురుగుల వాన కురిసింది.