దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కూడా కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొద్దిరోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఓమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం జనవరి 31వ తేదీ వరకు పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కాలంలో పిల్లలకు ఆన్లైన్ విద్య కొనసాగుతుందన్నారు. Read Also:రైతు బంధుకు నిధుల కొరత లేదు: మంత్రి నిరంజన్రెడ్డి రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా…
కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న చిన్నారులకు భారత్ బయోటెక్ శుభవార్త వినిపించింది. 12నుంచి18 సంవత్సరాల వయసున్న పిల్లలకు భారత్ బయోటెక్ తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో కరోనా మహమ్మారి నుంచి పిల్లల్ని రక్షించేందుకు మార్గం సుగమం కానుంది. దేశంలో 18 సంవత్సరాల లోపువారికి యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ల సరఫరా జరుగుతోంది. చిన్నారుల వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ఎప్పుడో పూర్తయ్యాయి. డీసీజీఐ అనుమతి వచ్చిన వెంటనే చిన్నారులకు వ్యాక్సిన్ కార్యక్రమం…
ఇప్పటికే కరోనా ఎప్పటికప్పుడు తన రూపం మార్చుకుంటూ ఒమిక్రాన్, డెల్టా వేరింయంట్ల రూపంలో టెన్షన్ పెడుతుంటే మరోవైపు తెలంగాణలో కొత్త వ్యాధి విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో స్ర్కబ్ టైఫస్ అనే వ్యాధి బారిన పడ్డవారు ఏకంగా 15మంది చికిత్స తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెలలో నలుగురు చిన్నారులు ఆస్పత్రుల్లో చేరారని ఇప్పటికే ఇద్దరికి వ్యాధి నయమైందని అధికారులు వెల్లడించారు. ఈ వ్యాధి ఎక్కువగా చిన్నారుల్లో కనిపిస్తుందని వైద్యులు పేర్కొన్నారు. ఈ వ్యాధికి సంబంధించి…
రాజేంద్ర నగర్ లో దారుణం చోటుచేసుకొంది. భర్తతో గొడవపడిన భార్య క్షణికావేశంలో దారుణానికి పాల్పడింది. తన ఇద్దరు చిన్నారులను చంపి తాను ఆత్మహత్య చేసుకొంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రాజేంద్ర నగర్ లో నివాసముంటున్న పార్వతి(35), సాయి కుమార్ దంపతులు సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరికి శ్రేయ, తన్వికి అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కలహాలు లేని వీరి కాపురంలో గతకొద్దిరోజుల నుంచి మనస్పర్థలు మొదలయ్యాయి. శుక్రవారం పెళ్లికి వెళ్లివచ్చిన…
కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఎన్ని జాగ్రత్తలు పాటించినా నివారణ చర్యలు ఎన్ని తీసుకున్నా దాని పని అది సైలైం ట్గా చేసుకుంటూ వెళ్తుంది. తాజాగా జైపూర్లోని ఓ పాఠశాలలో 11 మంది విద్యార్థులకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలడంతో ఆపాఠశా లను ప్రభుత్వం మూసివేసింది. కోవిడ్ మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి పాఠశాలలను మూసివేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. దాదాపు ఒకటిన్నర సంవత్సరాల విరామం తర్వాత, సెప్టెంబర్ నుం డి రాజస్థాన్లో పాఠశాలలు, కళాశాలలు, విద్యా…
విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అంతర్జాతీయ సంస్థ సేవలు ప్రశంస నీయమని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ అన్నారు. చిన్నారుల్లో ఉన్న ప్రతిభను గమనించి వారిని సరైన దిశలో ప్రోత్సహించడానికి విశ్వగురు అధినేత సత్యవోలు రాంబాబు చేస్తున్న కృషి గొప్పదని ఆయన కొనియాడారు. విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా సోమ వారం విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్ర మానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా శర్మన్ హాజరయ్యారు. వివిధ…
పిల్లలకు కోవిడ్-19 వ్యాక్సిన్లు వేయడంలో ప్రభుత్వం తొందరపడ కూడదని ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. కొన్ని దేశా లలో పరిమిత పద్ధతిలో ప్రారంభించబడినప్పటికీ, ప్రపంచంలో ఎక్క డా పెద్ద ఎత్తున COVID-19 పిల్లలకు టీకాలు వేయడం లేదని ఆయ న తెలిపారు. రేపటి తరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంద న్నారు. “మేము తొందరపడటం ఇష్టం లేదు…జాగ్రత్తగా నడ వాలి” అని మన్సూఖ్ మాండవీయ తెలిపారు. ఇప్పటికే పిల్లల కోసం పలు కంపెనీలు టీకాలు తయారు…
ప్రస్తుతం వివాహ బంధంలో ప్రేమ కన్నా అనుమానమే ఎక్కువ కనిపిస్తుంది. ఆ అనుమానంతో భార్యాభర్తలు ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు. ఇటీవల భార్య అనుమానించిందని ఆమెను, కన్న బిడ్డలని కడతేర్చి భర్త కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎంతటి సంచలనాన్ని రేకెత్తించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా అలాంటి సంఘటనే జర్మనీలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. జర్మనీలోని సోలెంగెన్ పట్టణానికి చెందిన ఒక మహిళకు కొన్నేళ్ల క్రితం ఒక వ్యక్తితో పెళ్ళైంది. వీరికి ఆరుగురు పిల్లలు. ఎప్పుడు…
18 ఏళ్లలోపు చిన్నారుల కోసం తయారైన కొవాగ్జిన్ ప్రయోగాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం సమాచార విశ్లేషణ కొనసాగుతోంది. వీటికి సంబంధించిన సమాచారాన్ని డీసీజీఐకి వచ్చే వారం అందించనున్నారు. దాదాపు వెయ్యి మంది వాలంటీర్లపై ఈ ప్రయోగాలు నిర్వహించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న కొవాగ్జిన్ టీకా ఉత్పత్తిని గణనీయంగా పెంచినట్లు సంస్థ అధికారులు తెలిపారు. మరో వైపు ముక్కు ద్వారా తీసుకునే వ్యాక్సిన్ రెండో దశ ప్రయోగాలు వచ్చే నెల నాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయని భారత్ బయోటెక్ అధికారులు వెల్లడించారు.…
5-11 ఏళ్ళ లోపు చిన్న పిల్లలకు తమ టీకా సురక్షితమని ప్రకటించింది ఫైజర్. ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయ్యాయి అని స్పష్టం చేసింది. తమ టీకా తీసుకున్న చిన్నారులలో యాంటీబాడీస్ ప్రతిస్పందన కనిపిస్తోందని తెలిపింది ఫైజర్. ఐదేళ్ల నుంచి 11 ఏళ్ల లోపు చిన్నారుల విషయంలో తాము రూపొందించిన కరోనా వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తున్నట్లు ప్రకటించాయి ఫైజర్ మరియు బయోఎన్ టెక్ సంస్థలు. క్లినికల్ ట్రయల్స్ లో సమర్థంగా పని చేస్తున్నట్లు నిర్ధారించాయి ఈ…