రేపల్లె రైల్వే స్టేషన్ అత్యాచార ఘటనపై చంద్రబాబు చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్రంలో అగ్గి రాజేశాయి. ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రాష్ట్రంలో శాంతి – భద్రతలు కూడా లోపించాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. జరిగిన సంఘటనల గురించి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని, ఒకట్రెండు సంఘటనలతో రాష్ట్రంలో శాంతి – భద్రతలులేవని వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదన్నారు. దిశా చట్టం లేకపోయినప్పటికీ, ఆ స్ఫూర్తితో తాము జరుగుతున్న ఘటనలపై విచారణ…
టీడీపీ పాలనలో చేసిన అప్పులతో తాము ఇబ్బందులు పడుతున్నామన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. టిడ్కో ఇళ్లపై మంత్రి ఆదిమూలపు సురేష్ సమీక్ష జరిపారు. అన్ని వసతులతో టిడ్కో ఇళ్ళు పూర్తి చేస్తాం. గతంలో టీడీపీ అప్పులు మిగిలిస్తే వాటిని తీరుస్తున్నాం. డిసెంబరుకు 2.62 లక్షల ఇళ్ళు పూర్తికి ప్రణాళిక రెడీ చేశామన్నారు. గత ప్రభుత్వాల మాదిరి అర్భాటాలకు పోయి అప్పులు చేసి ప్రజా సమస్యలను గాలికి వదలటం లేదు. మాట ఇస్తే దానికి కట్టుబడి పని చేయటం…
ఈరోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, టీడీపీ పార్టీ కార్యకర్తల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబుకు స్పెషల్ బర్త్ డే విషెస్ తెలుపుతూ మెగాస్టార్ చిరంజీవి ఓ పిక్ ను షేర్ చేశారు. గతంలో చంద్రబాబును కలిసినప్పుడు చిరు ఫ్లవర్స్ బొకే అందిస్తున్న పిక్ అది. “శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మ దిన శుభాకాంక్షలు… వారు కలకాలం సంపూర్ణ…
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు హయాంలో ప్రాధాన్యత ఉన్న కీలక పనులేవీ చేయలేదు. టీడీపీ పాలనలో కాంట్రాక్టర్లకు బాగా మిగిలే పనులు మాత్రమే చేశారు. వైసీపీ ప్రభుత్వం కీలకమైన పనులే టేకప్ చేశాం. రెండు సార్లు కోవిడ్ వచ్చినా పనులు ఆగకుండా చిత్తశుద్ధితో పని చేశాం అన్నారు అంబటి. ఈ జలయజ్ఞాన్ని వైఎస్సార్ ప్రారంభించారు.. ఆగే ప్రసక్తే లేదు. మేము అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యత క్రమంలో 6…
ఏపీలో వరుస ఛార్జీల పెంపుదలతో సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. బాదుడే బాదుడు పై వీడియో కాన్ఫరెన్సులో టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రం క్షేమం కోసం టీడీపీకీ అధికారం కావాలన్నారు చంద్రబాబు. టీడీపీకి అధికారం ఇప్పుడు చారిత్రిక అవసరం. రాష్ట్రం మిగిలి ఉండాలంటే.. టీడీపీ అధికారంలోకి రావాలి. https://ntvtelugu.com/pawan-kalyan-assurance-to-koulu-rythulu/ టీడీపీ గెలుపు అనేది కేవలం పార్టీ కోసమే కాదు….రాష్ట్రం కోసం అవసరం. మిగులు విద్యుత్తుగా ఉండే రాష్ట్రంలో ఈ స్థాయి కరెంట్ కష్టాలకు జగన్…
తెలుగుజాతి వెలుగు కిరణం ఎన్టీఆర్. అటు సినిమా, ఇటు రాజకీయరంగంలో ఎన్టీఆర్ అచంద్రతారార్కం అయిన చరిత్ర. ఏపీలో ఇవాళ కొత్త జిల్లాలకు శ్రీకారం చుట్టారు సీఎం జగన్. ఎన్టీఆర్ జిల్లా సగర్వంగా ఆవిష్కృతం అయింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరుగా బాధ్యతలు స్వీకరించారు ఢిల్లీ రావు.ఆయన్ని అభినందించారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తెలుగు అకాడెమీ ఛైర్మన్ లక్ష్మీపార్వతి, ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి, విజయవాడ సీపీ కాంతి రాణా టాటా. ఎన్టీఆర్ జిల్లా జిల్లా జేసీగా బాధ్యతలు…
తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో 1982లో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. పార్టీ స్థాపించిన 9 నెలలకే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. ఇది అప్పట్లో ఓ రికార్డు. ఎందుకంటే పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలో ఎవరూ అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. అయితే ఇప్పట్లో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత టీడీపీకి కలిసొచ్చింది. ఆ సమయంలో బీజేపీ ఉన్నా ఆ పార్టీకి బలం లేదు. దీంతో ప్రజలకు ప్రత్యామ్నాయంగా కనిపించిన ఏకైక పార్టీ తెలుగు దేశం పార్టీ. ఆవిర్భావం…
టీడీపీ స్థాపించి 40 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, ప్రస్తుత ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1983లో కాంగ్రెస్ వ్యతిరేక గాలిలో కమ్యూనిస్టులకు రావాల్సిన అధికారాన్ని ఎన్టీఆర్ తన్నుకుపోయారని నారాయణ వెల్లడించారు. ప్రపంచంలో రాజకీయ పార్టీ స్థాపించిన అతి తక్కువ సమయంలో అధికారంలోకి వచ్చిన నేత ఎన్టీఆరేనని ఆయన గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం రాజకీయ నేతల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదన్నారు. ఇప్పడున్న…
నేను.. తెలుగుదేశం అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో మళ్ళీ అధికారంలోకి రావడమే కాదు.. ఆంద్రప్రదేశ్ ను పునఃనిర్మాణం చేయాల్సిన అవసరం ఉందన ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ తరుపున లాభాలు పొందిన వ్యక్తి సీపీఐ నారాయణ అని, నన్ను ఎప్పుడు విమర్శించారు… ఇప్పుడు అర్థం చేసుకున్నారు. నేను ప్రతి విమర్శ చేయలేకుండా సద్విమర్శగా తీసుకున్నానన్నారు. చిత్తశుద్ధితో ఉన్న కార్యకర్త. ఒకే వ్యక్తి ఒకే పార్టీ…
TDP MP Rammohan Naidu Made Comments on CM Jagan. ఆర్టికల్ 360 ఉపయోగించాల్సిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో దాపురించాయని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయంపై కేంద్రం పరిశీలించి అవసరమైతే ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించి ఏపీ ఆర్థిక పరిస్థితిని సరిదిద్దాలన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుండి ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసకర పాలన సాగుతోందని ఆయన ఆరోపించారు. జగన్ ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్ లేకుండా చేస్తున్నారు…