Nandigam Suresh: సింగిల్గా వచ్చే దమ్ము లేకే, పొత్తులకు వెంపర్లాడుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో పొత్తు రాజకీయాలపై చర్చలు సాగుతున్న తరుణంలో.. ఎంపీ నందిగం సురేష్ స్పందించారు. చంద్రబాబుకు సింగిల్గా వచ్చే దమ్ము లేకపోవడం వల్లే, ‘రండి కలిసి రండి’ అంటూ అడుక్కుంటున్నారని విమర్శించారు. దత్తపుత్రుడితో కలిసి, కుయుక్తులు పన్నాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎంతమంది కలిసి వచ్చినా, జగన్ని ఎవరూ కదిపించలేరని వ్యాఖ్యానించారు. 2014, 2019 ఎన్నికల్లో జగన్ సింగిల్గా పోటీ చేశారని.. పొత్తులకు వెంపర్లాడలేదని చెప్పారు. సోషల్ మీడియాలో టీడీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు.
గతంలో అగ్రవర్ణాలకు మాత్రమే పదవులు దక్కేవని, జగన్ పాలనలో మాత్రం అన్ని వర్గాలకూ న్యాయం జరుగుతోందని నందిగం సురేష్ అన్నారు. పేదల సంక్షేమం కోసం తాము పథకాలు అమలు చేస్తోంటే, పేదలకు డబ్బులిస్తే సోంబేరుల్లా మారుతారని వ్యాఖ్యానించడం వాళ్ల ఆలోచనా ధోరణికి నిదర్శనమని చెప్పారు. అలసిపోయిన వారికి బాసటగా ఉంటుందనే ఆలోచనతో సీఎం జగన్ పథకాలు తీసుకొచ్చారని, కానీ ప్రతిపక్షం అది సహించడం లేదని వెల్లడించారు. అత్యాచారాలు, మహిళలపై దాడుల పేరుతో ప్రభుత్వాన్ని విమర్శించాలని ప్రతిపక్షం ప్రయత్నిస్తోందన్నారు. కానీ, గత ప్రభుత్వంలోనే ప్రజలు చాలా కష్టపడ్డారని, వైసీపీ అధికారంలోకి వచ్చాక అందరూ సంతోషంగా ఉన్నారన్నారు.
Also Read
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
- Poleramma Jatara 2026: వెదురుపాకలో పోలేరమ్మతల్లి జాతర.. సందడి చేసిన దేవిశ్రీ ప్రసాద్!
ఓటుకు నోటు కేసులో అర్ధరాత్రి పారిపోయి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని సురేశ్ విమర్శించారు. లోకేష్ మూర్ఖుడని చెప్పుకుంటున్నారని, ఆయన మూర్ఖుడే కాదు పప్పు కూడా అంటూ సెటైర్స్ వేశారు. ప్రజా క్షేమం కోసం మళ్లీ వైఎస్సార్సీపీనే అధికారంలోకి వచ్చేలా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని, తిరిగి జగన్ను ముఖ్యమంత్రిని చేయాలని ఎంపీ నందిగం సురేష్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!