Gudivada Amarnath: చంద్రబాబు, లోకేష్లను మించిన ఐరన్ లెగ్ లేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైజాగ్ను సందర్శించిన తరుణంలో.. మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆయనపై హాట్ కామెంట్స్ చేశారు. మూడు సంవత్సరాల తర్వాత చంద్రబాబు వైజాగ్కి వచ్చారని, ఈ సందర్భంగా ‘అమరావతి అభివృద్ధిని చేస్తాం, విశాఖను రాజధాని చేస్తాం’ అని అమరావతి ప్రజలకు చంద్రబాబు చెప్పొచ్చు కదా అని అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న 14 సంవత్సరాల కాలంలో రాష్ట్రం కరువుతో ఉందని.. ఆయన రాజకీయాలు చేస్తూ, నారా లోకేష్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్లను మించిన ఐరన్ లెగ్ ఎవరు లేరని విమర్శించారు.
చంద్రబాబుకు సొంతంగా పోటీ చేసే దమ్ము లేకపోవడం వల్లే ప్రతిపక్షాలు కలవాలని అంటుంటారని మంత్రి ఎద్దేవా చేశారు. సొంత కొడుకు కంటే దత్త పుత్రుడినే చంద్రబాబు ఎక్కువగా నమ్ముకున్నారని, అందుకే పవన్ వెంటే పడుతున్నారన్నారు. పప్పు బెల్లాలులాగా సంక్షేమ పథకాలు ఇస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని, కానీ ఆ పథకాల్లో అవినీతి ఎక్కడైనా జరిగిందా? అంటూ అమర్నాథ్ ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ధరలు పెరగలేదా? అంటూ నిలదీశారు. ప్రజా ఉద్యమం రావడం వల్లే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నారని, ‘సెటప్ చంద్రబాబు గెటౌట్ చంద్రబాబు’ అనే స్లోగన్ తీసుకోండని అమర్నాథ్ పిలుపునిచ్చారు. 2024లో వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మరిన్ని సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
- Potti Sriramulu's Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
- CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
ఇదిలావుండగా.. రాష్ట్రంలోని పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను త్వరగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని, వీటి గురించి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలను కోరామని మంత్రి తెలిపారు. కడప జిల్లాలోని కొప్పర్తి, కాకినాడలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించామన్నారు. రాష్ట్రంలోని పోర్టులు, హార్బర్ల మధ్య విమాన, రహదారి, రైలు కనెక్టివిటీ గురించి చర్చించామన్నారు. విశాఖ-కాకినాడ మధ్య పెట్రో కెమికల్ కారిడార్లో రూ.55 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి జిఎఐఎల్, హెచ్పిసిఎల్ ముందుకొచ్చాయని. రాష్ట్రంలో 34 నూతన ప్రాజెక్టుల ప్రారంభం కోసం ప్రతిపాదనలు సమర్పించామన్నారు.
తాజావార్తలు
-
Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
-
Reverse Gear Bikes: రివర్స్ గేర్ ఉన్న టూ వీలర్స్ ఇవే.. పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ ఇక సులువు!
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?