Gudivada Amarnath: చంద్రబాబు, లోకేష్లను మించిన ఐరన్ లెగ్ లేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైజాగ్ను సందర్శించిన తరుణంలో.. మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆయనపై హాట్ కామెంట్స్ చేశారు. మూడు సంవత్సరాల తర్వాత చంద్రబాబు వైజాగ్కి వచ్చారని, ఈ సందర్భంగా ‘అమరావతి అభివృద్ధిని చేస్తాం, విశాఖను రాజధాని చేస్తాం’ అని అమరావతి ప్రజలకు చంద్రబాబు చెప్పొచ్చు కదా అని అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న 14 సంవత్సరాల కాలంలో రాష్ట్రం కరువుతో ఉందని.. ఆయన రాజకీయాలు చేస్తూ, నారా లోకేష్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్లను మించిన ఐరన్ లెగ్ ఎవరు లేరని విమర్శించారు.
చంద్రబాబుకు సొంతంగా పోటీ చేసే దమ్ము లేకపోవడం వల్లే ప్రతిపక్షాలు కలవాలని అంటుంటారని మంత్రి ఎద్దేవా చేశారు. సొంత కొడుకు కంటే దత్త పుత్రుడినే చంద్రబాబు ఎక్కువగా నమ్ముకున్నారని, అందుకే పవన్ వెంటే పడుతున్నారన్నారు. పప్పు బెల్లాలులాగా సంక్షేమ పథకాలు ఇస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని, కానీ ఆ పథకాల్లో అవినీతి ఎక్కడైనా జరిగిందా? అంటూ అమర్నాథ్ ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ధరలు పెరగలేదా? అంటూ నిలదీశారు. ప్రజా ఉద్యమం రావడం వల్లే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నారని, ‘సెటప్ చంద్రబాబు గెటౌట్ చంద్రబాబు’ అనే స్లోగన్ తీసుకోండని అమర్నాథ్ పిలుపునిచ్చారు. 2024లో వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మరిన్ని సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
- OTR : టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావుకు గడ్డుకాలమా? పార్టీలో తగ్గిన ప్రాధాన్యతపై చర్చ
- OTR : మంత్రి పార్థసారధిపై మైనింగ్ ఆరోపణలు.. నూజువీడులో రాజకీయ రగడ
ఇదిలావుండగా.. రాష్ట్రంలోని పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను త్వరగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని, వీటి గురించి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలను కోరామని మంత్రి తెలిపారు. కడప జిల్లాలోని కొప్పర్తి, కాకినాడలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించామన్నారు. రాష్ట్రంలోని పోర్టులు, హార్బర్ల మధ్య విమాన, రహదారి, రైలు కనెక్టివిటీ గురించి చర్చించామన్నారు. విశాఖ-కాకినాడ మధ్య పెట్రో కెమికల్ కారిడార్లో రూ.55 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి జిఎఐఎల్, హెచ్పిసిఎల్ ముందుకొచ్చాయని. రాష్ట్రంలో 34 నూతన ప్రాజెక్టుల ప్రారంభం కోసం ప్రతిపాదనలు సమర్పించామన్నారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!