Cent Percent Work From Home: స్పెషల్ ఎకనమిక్ జోన్ యూనిట్లలో 100 శాతం ‘వర్క్ ఫ్రం హోం’ కావాలంటున్న ఇండస్ట్రీ డిమాండ్ను పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రతిపాదన వల్ల చిన్న సిటీల్లో ఉద్యోగావకాశాలను అందుబాటులోకి తెచ్చేందుకు వీలుపడుతుందని, సర్వీసుల ఎగుమతులు పెరుగుతాయని కూడా అంచనా వేస్తున్నట్లు తెలిపింది.
Infosys: ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఇన్ఫోసిస్ ఒకటి. అయితే ఇటీవల కరోనా కారణంగా పలు ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడంతో చాలా మంది ఉద్యోగులు పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్నట్లు బహిర్గతమైంది. దీంతో పలు కంపెనీలు చర్యలు చేపట్టాయి. ఇన్ఫోసిస్ కూడా రంగంలోకి దిగింది. కొద్దిరోజుల కిందట తమ ఉద్యోగులందరికీ మెయిల్స్ పంపించింది. ఎవరైనా పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కంపెనీ నియమాలను ఉల్లంఘించిన వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని…
Prepaid Card for Kamineni: కామినేని ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ కోసం ప్రీపెయిడ్ వ్యాలెట్ బ్యాలెన్స్ కార్డును అందుబాటులోకి తెచ్చారు. ఈ మేరకు ఆఫర్డ్ ప్లాన్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కార్డును ఉపయోగిస్తే క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. మందుల పైన, మెడికల్ టెస్టుల పైన డిస్కౌంట్ ఇస్తారు. 10 వేల రూపాయలు మొదలుకొని 10 లక్షల రూపాయల వరకు మెడికల్ లోన్ కూడా అందిస్తారు.
Shock News to Samsung: శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ సంస్థకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి సంబంధిత ప్రోత్సాహక పథకం కింద ఇవ్వాల్సిన 900 కోట్ల రూపాయలను నిలిపేసింది. ఆ కంపెనీ జనరేట్ చేసిన ఇన్వాయిస్లలో కొన్ని లోటుపాట్లు బయటపడటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇంక్రిమెంటల్ ప్రొడక్షన్ మరియు సేల్స్కి సంబంధించి శామ్సంగ్ ఇచ్చిన డేటాకి, కేంద్ర ప్రభుత్వం సేకరించిన సమాచారానికి మధ్య వ్యత్యాసాలు ఉన్నట్లు తేలింది.
Akasa Air Pilot’s Salaries: మన దేశ విమానయాన రంగంలోకి కొత్తగా ప్రవేశించిన ఆకాశ ఎయిర్ సంస్థ.. పైలట్ల శాలరీలను భారీగా పెంచటంలో ముందంజలో నిలుస్తోంది. తాజాగా సగటున 60 శాతం హైక్ చేసింది. వైమానిక సేవలను మరింతగా విస్తరించాలనే లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం 2 లక్షల 79 వేలు మాత్రమే ఉన్న కెప్టెన్ల స్టార్టింగ్ శాలరీ నాలుగున్నర లక్షలకు చేరింది. ఫస్ట్ ఆఫీసర్ల వేతనం లక్షా 11 వేల నుంచి…
Kakatiya Mega Textile Park: కాకతీయ వీవర్స్ కోపరేటివ్ సొసైటీ ఆరేళ్ల కల ఎట్టకేలకు నెరవేరింది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో చీరల తయారీ ప్రారంభమైంది. ఈ పార్క్ను చేనేత మరియు జౌళి శాఖ మంత్రి కేటీఆర్ అధికారికంగా ప్రారంభించాల్సి ఉంది. హన్మకొండ జిల్లా మడికొండ గ్రామంలోని ఔటర్ రింగ్ రోడ్డులో ఈ పార్క్ను 60 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. అక్కడ 364కి పైగా పవర్ లూమ్ యూనిట్లు ఉన్నాయి.
Ravi Narain-Bhagavad Gita: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) మాజీ చీఫ్ చిత్రా రామకృష్ణ, మాజీ ఎండీ రవి నరైన్తోపాటు ముంబై మాజీ పోలీస్ కమిషనర్ సంజయ్ పాండేలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ కోర్టులో ఛార్జ్షీట్లు దాఖలుచేసింది. అనంతరం ఈ ముగ్గురి జ్యుడీషియల్ కస్టడీని కోర్టు ఈ నెల 21వ తేదీకి పొడిగించింది. ఇదిలా ఉండగా తనకు భగద్గీతతోపాటు మరో పుస్తకాన్ని, కళ్లజోడును అందించాలని రవి నరైన్ న్యాయస్థానానికి విజ్జప్తి చేశారు.
Telangana-Amazon Tieup: అమేజాన్ వెబ్ సర్వీసెస్ సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయనుంది. మరింత ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టడం ద్వారా పౌర సేవల రంగంలో సమూల మార్పులు తేనుంది. కంప్యూటింగ్, స్టోరేజ్, మేనేజ్మెంట్, గవర్నెన్స్ క్యాపబిలిటీస్లో అమేజాన్ వెబ్ సర్వీసెస్ సొల్యూషన్స్ను వినియోగించనున్నారు.
Hyderabad Hosting Restaurant Conclave: హైదరాబాద్ మరో ప్రతిష్టాత్మక సదస్సుకు వేదిక కాబోతోంది. 13వ తేదీన ‘ది ఇండియన్ రెస్టారెంట్ కాన్క్లేవ్’కి ఆతిథ్యమివ్వబోతోంది. రెస్టారెంట్ల రంగానికి సంబంధించి ఇదే అతిపెద్ద సమావేశం కానుండటం విశేషం. హైటెక్స్లోని హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటుచేసిన ఈ మీటింగ్ని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. ‘ది నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ హైదరాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది.
IKEA India New Idea: ఐకియా ఇండియా సరికొత్త ఐడియాను అమలుచేస్తోంది. ‘‘ఒకసారి మా ఇంటికి వచ్చి వెళ్లండి’’ అంటూ వినూత్న ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తద్వారా మా స్టోర్కి రండి అని సాదరంగా ఆహ్వానిస్తోంది. రెడీమేడ్ ఫర్నీచర్ను విక్రయించే ఈ సంస్థ ‘ఘర్ ఆ జావో’ పేరుతో కొత్త బ్రాండ్ పొజిషనింగ్ని ప్రారంభించినట్లు వెల్లడించింది. వినియోగదారులతో భావోద్వేగపూరితమైన మరియు హేతుబద్ధమైన అనుబంధాన్ని ఏర్పరచుకునేందుకు ఈ క్యాంపెయిన్ని వివిధ ప్రచార మాధ్యమాల్లో