Home
Business News
Business News News
-
Zomato: డెలివరీ చేసింది చాలు. ఇక.. ‘‘ఇంటికి వెళ్లండి’’
Zomato: జొమాటో అనగానే ఫుడ్ డెలివరీ గుర్తుకొస్తుంది. నిమిషాల వ్యవధిలో ఇంటికి తెచ్చిస్తారు. ఇంటికే కాదు. ఆఫీసులో ఉన్నా.. మరెక్కడ ఉన్నా.. లోకేషన్ ప్రకారం వాలిపోతారు. పార్సిల్ మన చేతిలో పెట్టిపోతారు. అయితే ఆ సంస్థ ఇప్పుడు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడింది. దాదాపు 3 శాతం మంది సిబ్బందిని పనిలోంచి తీసేయాలనుకుంటోంది. తద్వారా లాభాలు ఆర్జించాలని కూడా ఆశిస్తోంది. -
Text Message: ‘SMS’ @ 30 ఏళ్లు.. తొలి మెసేజ్ ఏంటో తెలుసా?
Text Message: ఇప్పుడు అంతా స్మార్ట్ఫోన్ యుగం నడుస్తోంది. మొబైల్ లేనిదే ఎలాంటి పని జరగడం లేదు. అందరూ ఆన్లైన్లోనే చాటింగ్ చేసుకుంటూ పనులు చక్కబెట్టేస్తున్నారు. ఇంటర్నెట్ విస్తరణతో వాట్సాప్ మెసేజ్లు, మెసేంజర్ నుంచి మెసేజ్లు పంపుతున్నాం. అయితే పూర్వం ఇంటర్నెట్ లేకుండానే మెసేజ్లను మాములుగా పంపేవాళ్లం. ఈ మెసేజ్ ప్రారంభమై 30 ఏళ్లు గడిచిపోయాయి. యూకేలోని బెర్క్షైర్కు చెందిన ఇంజినీర్నీల్పాప్వర్త్ 1992 డిసెంబర్ 3న తొలిసారిగా ఓ ఎస్ఎంఎస్ చేశాడు. వొడాఫోన్ నెట్వర్క్ ద్వారా కంప్యూటర్… -
New Rules: ముఖ్య గమనిక.. డిసెంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు
మరో రెండు రోజుల్లో నవంబర్ నెల ముగియనుంది. అనంతరం ఈ ఏడాదిలోనే చివరి నెల డిసెంబర్ ప్రారంభం కానుంది. సాధారణంగా ప్రతినెల 1వ తేదీన కొన్ని మార్పులు జరుగుతుంటాయి. డిసెంబర్లో కూడా కొన్ని రూల్స్ మారబోతున్నాయి. ఇవి ప్రజల జీవనంపై ప్రభావం చూపనున్నాయి. పెన్షన్ పొందేవారు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి దేశవ్యాప్తంగా పెన్షనర్లకు ముఖ్యమైన వార్త. పెన్షన్ పొందడానికి 30 నవంబర్ 2022లోపు మీ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి. ఒకవేళ ఈనెలాఖరులోగా సర్టిఫికెట్ సమర్పించకపోతే డిసెంబర్ 1… -
Reliance Jio: దేశవ్యాప్తంగా జియో సేవలకు అంతరాయం
Reliance Jio: దేశంలోని పలు ప్రాంతాల్లో రిలయన్స్ జియో సేవల్లో అంతరాయం కలిగింది. నెట్వర్క్ డౌన్ కావడంతో జియో ఇంటర్నెట్, కాల్స్, ఫైబర్ సేవలు నిలిచిపోయాయని పలువురు వినియోగదారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు జియో నెట్ వర్క్లో సమస్యలు ఎదురైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జియో నెట్వర్క్ నుంచి కాల్స్ చేసుకునేందుకు, మాట్లాడేందుకు కుదరట్లేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఎస్ఎంఎస్లు పంపించేందుకు… -
Airtel Recharge Plan: యూజర్లకు షాక్.. మళ్లీ ఛార్జీలను పెంచేసిన ఎయిర్టెల్
Airtel Recharge Plan: ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్టెల్ మరోసారి తన వినియోగదారులకు బ్యాడ్న్యూస్ అందించింది. నెలవారీ రీఛార్జ్ ప్లాన్ను ఎయిర్టెల్ 57 శాతం పెంచేసింది. 28 రోజుల మొబైల్ ఫోన్ సర్వీస్ ప్లాన్ను రూ.99 నుంచి ఏకంగా రూ.155కి పెంచినట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఎయిర్టెల్ వినియోగదారులు అపరిమిత కాలింగ్, ప్రతిరోజూ 1 జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్లు కావాలంటే రూ.155 చెల్లించాల్సి ఉంటుంది. తొలుత ట్రయల్ ప్లాన్గా అందుబాటులోకి తెచ్చిన ఎయిర్టెల్ త్వరలో… -
Sukhant Funeral Company: అంత్యక్రియలతోనూ వ్యాపారం.. అద్దెకు ఏడ్చేవాళ్లు
Sukhant Funeral Company: ఈరోజుల్లో వ్యాపారానికి సాటిరాని వస్తువు అంటూ ఏం లేదు. ఆవుల పేడను కూడా ఆన్లైన్లో పెట్టి అమ్మేస్తున్నారు. చివరకు మనిషి చావును కూడా సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా ఓ స్టార్టప్ కంపెనీ మనిషి అంత్యక్రియలను నిర్వహిస్తామంటూ పబ్లిసిటీ చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా నిలిచింది. ఢిల్లీ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్లో ముంబైకు చెందిన సుఖాంత్ ఫ్యునరల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఈ మేరకు ఓ స్టాల్ పెట్టి అంత్యక్రియలను తమ కంపెనీ… -
Reliance Jio: ఈ విషయంలో జియో అట్టర్ ఫ్లాప్.. మరి ఐపీఎల్ను ఏం చేస్తుందో?
Reliance Jio: భారీ అంచనాల నడుమ ఫిఫా ప్రపంచకప్ ఎంతో ఘనంగా ప్రారంభమైంది. ఈ మెగా టోర్నీ ప్రసార హక్కులను రిలయన్స్ సంస్థకు చెందిన వయాకామ్ 18 దక్కించుకుంది. దీంతో వయాకామ్ 18, వూట్ యాప్, జియో సినిమా యాప్ ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. వూట్ యాప్ ఈ మ్యాచ్లను చూడాలంటే అభిమానులు రూ.599తో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. దీంతో ఫుట్బాల్ అభిమానులు జియో సినిమా యాప్ను ఆశ్రయిస్తున్నారు. కానీ అభిమానులకు తీవ్ర నిరాశ… -
Sandhya Devanathan: మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ గురించి ఈ విషయాలు తెలుసా?
Sandhya Devanathan: ప్రస్తుతం సోషల్ మీడియాను ఏలుతున్న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ సంస్థలు మెటాలో భాగమయ్యాయి. అయితే ఆయా సంస్థలు పలు రకాల సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరిలో మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్గా సంధ్య దేవనాథన్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అయితే ఆమె నేపథ్యం గురించి చాలా మందికి తెలియదు. 46 ఏళ్ల సంధ్య దేవనాథన్ ఏపీలోని విశాఖలోనే చదివారు. ఆంధ్రా యూనివర్సిటీలో 1994లో కెమికల్ ఇంజనీరింగ్ చేసిన ఆమె ఢిల్లీ యూనివర్శిటీలో… -
Twitter: ఈనెల 29 నుంచి మళ్లీ అందుబాటులోకి ‘బ్లూ టిక్’ సేవలు
Twitter: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ను కొనుగోలు చేసిన అనంతరం బ్లూటిక్ ఛార్జీలు వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా బ్లూ టిక్ రూల్స్ మార్చడంతో సెలబ్రిటీల పేర్లతో నకిలీ ఖాతాలు తెరిచే వాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. చాలా మంది బ్లూ టిక్ కోసం చందా కట్టి నకిలీ ఖాతాలను తెరవడం ప్రారంభించారు. అయినా ఛార్జీల వసూలు విషయంలో ఎలాన్ మస్క్ తగ్గలేదు. దీంతో ట్విట్టర్ యూజర్లు.. సెలబ్రిటీల అసలు అకౌంట్ ఏదో, నకిలీ అకౌంట్ ఏదో… -
Byjus: ‘‘బైజూస్.. నీకింత బిల్డప్ అవసరమా?’’
Byjus: ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఫుడ్బాలర్లలో లియోనెల్ మెస్సీ ఒకరు. ఆ స్టార్ ప్లేయర్ని ఎడ్టెక్ స్టార్టప్ బైజూస్.. ‘ఎడ్యుకేషన్ ఫర్ ఆల్’ అనే సామాజిక కార్యక్రమానికి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ సంస్థ లేటెస్ట్గా తీసుకున్న ఈ నిర్ణయాన్ని.. ‘2ఎక్స్’ ఫౌండర్ మరియు పబ్లిక్ స్పీకర్ రిషభ్ ధేడియా తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు లింక్డిన్లో హాట్ హాట్గా పోస్టింగ్ పెట్టారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన హర్మన్ప్రీత్ కౌర్.. దేశ చరిత్రలోనే తొలి ప్లేయర్గా..
-
NEET UG 2026: నీట్ రాసే విద్యార్థులకు అలర్ట్.. అడ్మిట్ కార్డులు వచ్చేశాయి! ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
-
Bhatti Vikramarka : చరిత్రను, భవిష్యత్తును గుండెకు హత్తుకున్న నగరం హైదరాబాద్
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
INDW Vs PAKW: పాక్ బౌలర్లను ఉతికి ఆరేసిన స్మృతి.. టీ20 వరల్డ్కప్లో అరుదైన రికార్డు..
ట్రెండింగ్
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!