ESIC to expand: ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పరిధి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 598 జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ESICని 750 జిల్లాలకు విస్తరించనున్నట్లు కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. ESIC పథకం కింద ఇప్పుడు 3 కోట్ల 90 లక్షల కుటుంబాలు, 12 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పారు. ESICని భవన నిర్మాణ రంగానికి కూడా విస్తరింపజేస్తామని…
Samsung SmartPhones Sales: ఆన్లైన్ ఫెస్టివ్ సేల్స్లో మొదటి రోజే శామ్సంగ్కి సంబంధించి కోటి రూపాయలకు పైగా విలువైన స్మార్ట్ఫోన్ల సేల్స్ జరిగాయి. అమేజాన్ మరియు ఫ్లిప్కార్ట్ల ద్వారా ఈ అమ్మకాలు జరిగినట్లు శామ్సంగ్ ఇండియా వెల్లడించింది. 12 లక్షలకు పైగా గెలాక్సీ స్మార్ట్ఫోన్లను విక్రయించామని తెలిపింది. పండుగ సీజన్ నేపథ్యంలో శామ్సంగ్ గెలాక్సీ సిరీస్ స్మార్ట్ఫోన్ల రేట్లను 17 శాతం నుంచి 60 శాతం వరకు తగ్గించింది.
అమ్మో ఒకటో తారీఖు.. ఇది సినిమా పేరు కాదండి. నిజంగానే ఒకటో తారీఖు వచ్చిందంటే సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. అలా శాలరీ క్రెడిట్ కాగానే ఇలా డబ్బులన్నీ అయిపోతాయి. ఉద్యోగులకే కాదు సామాన్యులందరికీ ఒకటో తారీఖు అంటే ఓ రకమైన ఫీలింగ్. అయితే అక్టోబర్ 1వ తేదీ సామాన్యుల జీవితాల్లో మరింత పెనుభారం కాబోతోంది. ఎందుకంటే అక్టోబర్ 1 నుంచి పలు నిబంధనలు మారనున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ సిస్టమ్లో నిబంధనలు, ఎల్పీజీ గ్యాస్ రేట్లు వంటి…
UPI Lite: యూపీఐ పేమెంట్లు చెయ్యాలంటే మొబైల్లో డేటా ఉండాలి. దీంతోపాటు పిన్ కూడా తెలిసుండాలి. కానీ.. ఈ రెండూ లేకపోయినా పేమెంట్ చేసేందుకు లేటెస్ట్గా ‘యూపీఐ లైట్’ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ రీసెంట్గా ప్రారంభించారు. యూపీఐ లైట్ ద్వారా గరిష్టంగా 200 రూపాయలు చెల్లించొచ్చు. ముందుగా బ్యాంక్ అకౌంట్ నుంచి యూపీఐ లైట్ వ్యాలెట్లోకి అమౌంట్ను డిపాజిట్ చేసుకోవాలి. ఈ బ్యాలెన్స్ 2 వేల రూపాయలకు మించకూడదు.
Funds for Bhanzu: హైదరాబాద్కి చెందిన ఇంటర్నేషనల్ మ్యాథ్స్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ భాన్జుకి 115 కోట్ల రూపాయల నిధులు సమకూరాయి. ప్రపంచంలోనే ఫాస్ట్గా లెక్కలు చేసే హ్యూమన్ క్యాలిక్యులేటర్ నీలకంఠ భాను ఈ సంస్థను తన పేరిటే భాన్జుగా ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. టెక్నాలజీకి సంబంధించిన మౌలిక సదుపాయాలను మరియు మ్యాథ్స్ కరికులమ్లను ఇంకా డెవలప్ చేసేందుకు ఈ ఫండ్స్ను వినియోగిస్తామని సంస్థ సీఈఓగా కూడా వ్యవహరిస్తున్న నీలకంఠ భాను తెలిపారు.
Early Diwali to India: మన దేశానికి ఈ ఏడాది దీపావళి పండుగ ముందే రానుందని బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ అన్నారు. భారత్-బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల ఇరు దేశాలకూ ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. మరీ ముఖ్యంగా ఇండియాకి లెదర్, టెక్స్టైల్, జ్యులరీ, ప్రాసెస్డ్ ఆగ్రో ప్రొడక్ట్స్ వంటి రంగాల్లో ఎగుమతులు ఊపందుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
RBI Orders: 10 వేల కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు కలిగిన అర్బన్ కోపరేటివ్ బ్యాంకులు వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నాటికి చీఫ్ కాంప్లియెన్స్ ఆఫీసర్లను నియమించాలని రిజర్వ్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. టయర్-4 ఎంటిటీస్గా వర్గీకరించిన ఈ బ్యాంకుల్లో కార్పొరేట్ గవర్నెన్స్ను మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయాన్ని అమలుచేయాలని సూచించింది.
Key Treatment For Knee Problems: ముసలితనంలో వచ్చే కీళ్ల వ్యాధికి కీలకమైన చికిత్స అందుబాటులోకి వస్తోంది. దేశంలోనే తొలిసారిగా ‘ఆఫ్ ది సెల్ఫ్’ సెల్ థెరపీ ట్రీట్మెంట్కు రంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పేషెంట్కి ఇచ్చే ఒక్క ఇన్జెక్షన్ ఖరీదే లక్షా పాతిక వేల రూపాయలు కావటం గమనించాల్సిన విషయం. ఈ మెడిసిన్ ప్రభావం రెండేళ్ల కన్నా ఎక్కువే ఉంటుంది.
Three Wheels Electric Car: ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలో మరో కొత్త ఎలక్ట్రిక్ కారు విడుదల కానుంది. అయితే ఈ కారుకు మూడు చక్రాలు మాత్రమే ఉండనున్నాయి. స్ట్రోమ్ 3 పేరుతో విడులవుతున్న ఈ కారు ధర కూడా తక్కువే ఉంటుందని తెలుస్తోంది. డైమండ్ కట్ ఆకారంతో కొత్త డిజైన్తో విడుదల కానున్న ఈ కారుకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ కారులో ఇద్దరు వ్యక్తులు సులభంగా కూర్చోవచ్చు. అంతేకాకుండా…
IT Returns Refund: ఇంకమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసి రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నారా.. రెండు నెలలు దాటినా ఇంకా మీకు ఐటీఆర్ రీఫండ్ కాలేదా.. అయితే కొన్ని కారణాల వల్ల మీకు ఐటీఆర్ రీఫండ్ కాకపోవచ్చు. ఆ కారణాలేంటో ముందు తెలుసుకోవడం ముఖ్యం. అసలు ఐటీఆర్ రీఫండ్కు మీరు అర్హులేనా అన్న విషయం తెలుసుకోవాలి. అందుకోసం ఐటీఆర్ను ఆదాయపు పన్నుశాఖ ప్రాసెస్ చేసిందా లేదా చూడాలి. ఒకవేళ రీఫండ్కు మీరు అర్హులు అని ఐటీశాఖ ధ్రువీకరిస్తేనే…