Hurun India Rich List 2023: రిలియన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఇండియా కుబేరుల్లో మొదటిస్థానంలో నిలిచారు. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి మొదటిస్థానంలో నిలిచారు. గతేడాది మొదటిస్థానంలో అదానీ ఉన్నారు. హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు వచ్చిన తర్వాత గౌతమ్ అదానీ సంపద హెచ్చుతగ్గులకు ప్రభావితమైంది. దీంతోనే ఈ ఏడాది ఇండియా అత్యధిక ధనవంతుల జాబితాలో ముకేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచినట్లు తెలుస్తోంది.
Maruti:ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియాకు ఆదాయపు పన్ను శాఖ నుంచి రూ.2160 కోట్ల నోటీసులు అందాయి. ఈ విషయాన్ని మారుతీ సుజుకీ స్వయంగా వెల్లడించింది. అక్టోబర్ 3, మంగళవారం స్టాక్ ఎక్స్ఛేంజ్కు నోటీసు గురించి సమాచారం ఇస్తూ, పెండింగ్లో ఉన్న రూ. 2,160 కోట్ల బకాయిల కోసం ఆదాయపు పన్ను శాఖ నుండి డ్రాఫ్ట్ అసెస్మెంట్ ఆర్డర్ను అందుకున్నట్లు తెలిపింది.
ఆపిల్, గూగుల్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు మరో కొత్త యాప్ స్టోర్ మార్కెట్ లోకి రాబోతోంది. వాల్మార్ట్ యాజమాన్యంలోని ఫిన్టెక్ కంపెనీ ఫోన్పే తన మొబైల్ యాప్ స్టోర్ను డెవలపర్ల కోపం తీసుకు వస్తుంది. ఇండస్ యాప్స్టోర్ అనే పేరుతో ఈ మొబైల్ యాప్ మార్కెట్ ప్లేస్ ప్లాట్ఫామ్లోకి అడుగు పెడుతుంది.
Fertiliser, Labour Cost Hike: ఆగస్టులో వర్షపాతం తక్కువగా ఉండటంతో రైతుల కష్టాలు ఇప్పటికే పెరిగాయి. ఇప్పుడు పెరుగుతున్న కూలీ ఖర్చులు వ్యవసాయాన్ని మరింత కష్టతరం చేశాయి. ఇటీవలి కాలంలో దేశంలో ఆహార పదార్థాల ధరలు భారీగా పెరిగాయి.
Suzlon Energy: రెన్యూవబుల్ ఎనర్జీ సొల్యూషన్ ప్రొవైడర్ కంపెనీ సుజ్లాన్ ఎనర్జీ షేర్లు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. కంపెనీ షేర్లలో ఈ పెరుగుదల వెనుక ప్రధాన కారణం కంపెనీకి వచ్చిన కొత్త వర్క్ ఆర్డర్.
Saving Account Nominee: మారుతున్న కాలంతో పాటు భారతదేశంలో బ్యాంకింగ్ పద్ధతుల్లో పెనుమార్పులు వచ్చాయి. దేశంలో దాదాపు ప్రతి వ్యక్తి పొదుపు ఖాతా కలిగి ఉండటం సర్వసాధారణం.
భారతదేశపు తదుపరి స్టార్టప్ పవర్హౌస్గా హైదరాబాద్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. భారతదేశంలోని మొదటి ఐదు స్టార్టప్ హబ్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే టెక్ హబ్గా పేరున్న బెంగళూరు, ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, పుణె నగరాలు మన కంటే ముందున్నాయి.
Tomato Price: చాలా కాలంగా పెరిగిన టమాటా ధర ఇప్పుడు సామాన్యులకు ఊరట కలిగింది. రెండు నెలల క్రితం వరకు దేశంలో టమాటా ధరల నియంత్రణకు ప్రభుత్వం నిరంతర చర్యలు తీసుకుంటుండడంతో దాని ప్రభావం కనిపిస్తోంది.
వినాయక చవితితో పండుగల సీజన్ స్టార్ట్ అయింది. ఈ ఫెస్టివల్ టైంలో టీవీ-ఫ్రీజ్-వాషింగ్ మెషిన్ వరకు వివిధ వస్తువులపై భారీ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఈ సందర్భంగా, బ్యాంకులు తగ్గింపు వడ్డీ రేట్లతో, జీరో ప్రాసెసింగ్ ఫీజుల ఆఫర్లను కూడా అమలు పరుస్తాయి.
కేంద్ర ప్రభుత్వానికి కాసుల వర్షం కురిసింది. కార్పొరేట్ల కంపెనీల నుంచి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు గణనీయంగా పెరగడంతో సెప్టెంబర్ నెల మధ్య నాటికే ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 23.51 శాతం పెరిగి 8. 65 లక్షల కోట్ల రూపాయలకుకు చేరుకున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా తెలిపింది.