Hurun India Rich List 2023: అదానీని వెనక్కినెట్టి అగ్రస్థానంలోకి ముకేష్ అంబానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hurun India Rich List 2023: రిలియన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఇండియా కుబేరుల్లో మొదటిస్థానంలో నిలిచారు. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి మొదటిస్థానంలో నిలిచారు. గతేడాది మొదటిస్థానంలో అదానీ ఉన్నారు. హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు వచ్చిన తర్వాత గౌతమ్ అదానీ సంపద హెచ్చుతగ్గులకు ప్రభావితమైంది. దీంతోనే ఈ ఏడాది ఇండియా అత్యధిక ధనవంతుల జాబితాలో ముకేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచినట్లు తెలుస్తోంది.
హూరున్ ఇండియా మరియు 360 వన్ వెల్త్ సంయుక్త నివేదిక ప్రకారం హూరున్ ఇండియా రిచ్లిస్ట్ 2023ని విడుదల చేసింది. ఇది భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యక్తుల జాబితా 12వ ఎడిషన్ని సూచిస్తుంది. ముకేష్ అంబానీ, అతని కుటుంబం ఆస్తుల విలువ రూ.. 8,08,700 కోట్ల నికర విలువతో అగ్రస్థానంలో నిలిచారు. గౌతమ్ అదాని, అతని కుటుంబ ఆస్తుల విలువ రూ.4,74,800 కోట్లతో, సైరస్ పూనావల్లా అండ్ ఫ్యామిలీ రూ.2,78,500 కోట్లతో తదుపరి స్థానాల్లో ఉన్నారు.
Also Read
- Crude Oil Prices: ప్రభుత్వ చమురు సంస్థలకు రోజూ రూ.1,000 కోట్ల నష్టం!.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?
- Gold Sales Decline: పడిపోయిన బంగారం అమ్మకాలు.. కళకళలాడాల్సిన సమయంలో వెలవెలబోతున్న షాపులు
- Gold Prices: షాకింగ్.. అమాంతం పెరిగిన బంగారం ధర.. తులం బంగారం ఎంతంటే..?
- Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!

Read Also: Israel-Hamas: బందీలకు ఏమైనా జరిగితే ఊరుకోమన్న ఇజ్రాయిల్.. అలా అయితే బందీలను ఉరితీస్తామన్న హమాస్..
ఈ ఏడాది విడుదలైన హూరున్ రిపోర్ట్ ప్రకారం 1319 మంది వ్యక్తులు రూ. 1000 కోట్లకుపైగా నికర ఆస్తుల విలువను కలిగి ఉన్నారు. వీరిలో 219 మంది ఆస్తుల విలువ పెరిగింది. కొత్తగా ఈ జాబితాలోకి 219 మంది చేరారు. ఈ నివేదిక ప్రకారం.. ఈ ధనవంతుల సంపద సింగపూర్, యూఏఈ, సౌదీ అరేబియాల మొత్తం జీడిపిని అధిగమించి రూ. 109 లక్షల కోట్లకు చేరుకుంది. మొత్తం వ్యక్తుల సంపద 8.5 శాతం పెరిగితే.. సగటున వ్యక్తుల సంపద 9.3 శాతం తగ్గిందని నివేదిక వెల్లడించింది.
ఈ జాబితాలోని 278 మంది కొత్త వారితో సహా మొత్తం 1054 మంది వ్యక్తుల సంపద వృద్ధి చెందడం లేదా స్థిరంగా ఉండటాన్ని నివేదిక హైలెట్ చేసింది. 264 మంది వ్యక్తుల సంపద క్షీణించినట్లు, 55 మంది ఈ జాబితా నుంచి తప్పుకున్నట్లు తెలిపింది. భారతదేశంలో 259 మంది బిలియనీర్లు ఉన్నారు, ఇది గతేడాదితో పోలిస్తే 38 శాతం పెరుగుదలను సూచిస్తుంది. పరిశ్రయలు, పారిశ్రామిక ఉత్పత్తులు, మెటల్ అండ్ మైనింగ్ జాబితాలోకి అత్యధిక మంది కొత్తగా చేరారు.. ఫార్మా నుంచి 133 మంది కొత్త వారు జాబితాలోకి వచ్చారు. జెప్టో వ్యవస్థాపకుడు కైవల్య వోహ్రా(20) అతి చిన్న వయస్సు సంపన్నుడిగా నివేదిక పేర్కొంది.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!