Hurun India Rich List 2023: అదానీని వెనక్కినెట్టి అగ్రస్థానంలోకి ముకేష్ అంబానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hurun India Rich List 2023: రిలియన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఇండియా కుబేరుల్లో మొదటిస్థానంలో నిలిచారు. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి మొదటిస్థానంలో నిలిచారు. గతేడాది మొదటిస్థానంలో అదానీ ఉన్నారు. హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు వచ్చిన తర్వాత గౌతమ్ అదానీ సంపద హెచ్చుతగ్గులకు ప్రభావితమైంది. దీంతోనే ఈ ఏడాది ఇండియా అత్యధిక ధనవంతుల జాబితాలో ముకేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచినట్లు తెలుస్తోంది.
హూరున్ ఇండియా మరియు 360 వన్ వెల్త్ సంయుక్త నివేదిక ప్రకారం హూరున్ ఇండియా రిచ్లిస్ట్ 2023ని విడుదల చేసింది. ఇది భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యక్తుల జాబితా 12వ ఎడిషన్ని సూచిస్తుంది. ముకేష్ అంబానీ, అతని కుటుంబం ఆస్తుల విలువ రూ.. 8,08,700 కోట్ల నికర విలువతో అగ్రస్థానంలో నిలిచారు. గౌతమ్ అదాని, అతని కుటుంబ ఆస్తుల విలువ రూ.4,74,800 కోట్లతో, సైరస్ పూనావల్లా అండ్ ఫ్యామిలీ రూ.2,78,500 కోట్లతో తదుపరి స్థానాల్లో ఉన్నారు.
Also Read
- NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
- ESIC Scheme: డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు గుడ్న్యూస్.. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా సహా పలు ప్రయోజనాలు!
- Family Vacation: యూరప్ను తలపించేలా నేపాల్ గ్రామాలు.. తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీ ట్రిప్కు బెస్ట్!
- Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు

Read Also: Israel-Hamas: బందీలకు ఏమైనా జరిగితే ఊరుకోమన్న ఇజ్రాయిల్.. అలా అయితే బందీలను ఉరితీస్తామన్న హమాస్..
ఈ ఏడాది విడుదలైన హూరున్ రిపోర్ట్ ప్రకారం 1319 మంది వ్యక్తులు రూ. 1000 కోట్లకుపైగా నికర ఆస్తుల విలువను కలిగి ఉన్నారు. వీరిలో 219 మంది ఆస్తుల విలువ పెరిగింది. కొత్తగా ఈ జాబితాలోకి 219 మంది చేరారు. ఈ నివేదిక ప్రకారం.. ఈ ధనవంతుల సంపద సింగపూర్, యూఏఈ, సౌదీ అరేబియాల మొత్తం జీడిపిని అధిగమించి రూ. 109 లక్షల కోట్లకు చేరుకుంది. మొత్తం వ్యక్తుల సంపద 8.5 శాతం పెరిగితే.. సగటున వ్యక్తుల సంపద 9.3 శాతం తగ్గిందని నివేదిక వెల్లడించింది.
ఈ జాబితాలోని 278 మంది కొత్త వారితో సహా మొత్తం 1054 మంది వ్యక్తుల సంపద వృద్ధి చెందడం లేదా స్థిరంగా ఉండటాన్ని నివేదిక హైలెట్ చేసింది. 264 మంది వ్యక్తుల సంపద క్షీణించినట్లు, 55 మంది ఈ జాబితా నుంచి తప్పుకున్నట్లు తెలిపింది. భారతదేశంలో 259 మంది బిలియనీర్లు ఉన్నారు, ఇది గతేడాదితో పోలిస్తే 38 శాతం పెరుగుదలను సూచిస్తుంది. పరిశ్రయలు, పారిశ్రామిక ఉత్పత్తులు, మెటల్ అండ్ మైనింగ్ జాబితాలోకి అత్యధిక మంది కొత్తగా చేరారు.. ఫార్మా నుంచి 133 మంది కొత్త వారు జాబితాలోకి వచ్చారు. జెప్టో వ్యవస్థాపకుడు కైవల్య వోహ్రా(20) అతి చిన్న వయస్సు సంపన్నుడిగా నివేదిక పేర్కొంది.
తాజావార్తలు
-
Maa Inti Bangaram: 73 కోట్ల వసూళ్లతో అన్-స్టాపబుల్ ‘బంగారం’!
-
Joker : నిర్మాతగా బన్నీ బెస్ట్ ఫ్రెండ్.. అల్లు అరవింద్ క్లాప్’తో ‘జోకర్’ గ్రాండ్ లాంచ్!
-
Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..