హన్మకొండ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో 8న వరంగల్లో ప్రధాని పర్యటన పైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, అరూరి రమేష్, నన్నపనేని నరేందద్, తాటికొండ రాజయ్య లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవాస్తవాలు మాట్లాడారని ఆయన అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విబేధాలు లేవు.. సర్దుకున్నాయని తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ ఠాక్రే స్పష్టం చేశారు. బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని.. కేసీఆర్ వ్యవహరం తెలంగాణ ప్రజలకు తెలిసిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఈరోజు ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ తలపెట్టిందని, తమ నాయకుడు పాదయాత్ర పూర్తి చేసుకోవడం పెద్ద ఎత్తున చేరికలు ఉండడంతో ఈ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఆయన మాట్లాడుతూ.. స
సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు వారితో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ సమీక్ష చేయనున్నారు. దీంతో ఈ మీటింగ్ కు సర్వాత్ర ఆసక్తి నెలకొంది.
Times Now Navbharat Survey: దేశంలో నరేంద్రమోడీ హవా తగ్గలేదని తాజా సర్వేలు చెబుతున్నాయి. 2024 లోకసభ ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలో టైమ్స్ నౌ నవభారత్ సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నడిపెల్లి దివాకర్ రావు, మరోమారు బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. దివాకర్ రావు గతంలో 1999, 2004 ఎన్నికల్లో మంచిర్యాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వరసగా రెండు సార్లు గెలిచారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు సేవలందించారు. తరువాత, 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ కొత్త పేరు.. బీఆర్ఎస్ తరపున మరోమారు రంగంలో దిగేందుకు సర్వం సిద్ధమైంది.. breaing news, latest news, telugu…
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర బీఆర్ఎస్ సర్కారును కదిలించింది. ఫామ్ హౌస్ కే పరిమితమైన సీఎం కేసీఆర్ ను ప్రజల వద్దకు పరుగులు తీసేలా చేసింది. పోడు భూముల గురించి పట్టించుకోని సీఎం కేసీఆర్.. ఈనాడు పట్టాలు పంపిణీ చేయడం పాదయాత్ర ద్వారా ప్రభుత్వంపై భట్టి చేసిన పోరాట ఫలితమే. ఈ పీపుల్స్ మార్చ్ పాదయాత్ర తెలంగాణలో సరికొత్త ప్రజా విప్లవోద్యమంలా మారింది.
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరిట చేపట్టిన పాదయాత్ర శనివారం నాడు ఖమ్మం పట్టణంలోకి ప్రవేశించింది. మార్చి 16న ప్రారంభమైన ఈ పాదయాత్ర మూడు నెలల పాటు నిర్విఘ్నంగా కొనసాగింది. ఇవాళ మధ్యాహ్నం ఖమ్మంకు భట్టి విక్రమార్క పాదయాత్ర చేరుకుంది.. breaking news, latest news, telugu news, bhatti vikramarka, brs, congress,
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తన కూతురు పై హైకోర్టును ఆశ్రయించిన విషయంలో భావోద్వేగానికి గురయ్యారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాజ్ఞాస్టిక్ సెంటర్లో అప్గ్రేడ్ చేయబడిన 134 వైద్య పరీక్షలను వర్చువల్గా ప్రారంభమైన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే భావోద్వేగానికి గురయ్యారు. అమాయకురాలైన నా బంగారు తల్లి.. నా బిడ్డను వాడుకొని అల్లుడిని ప్రేరేపించడం అధర్మమని ఆరోపించారు.
మహబూబాబాద్ జిల్లా పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్రమంత్రి కేటీఆర్ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. మానుకోటలో రూ.50 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ అసహనానికి గురయ్యారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ప్రారంభించేందుకు వెళ్తున్న కేటీఆర్ తో ఎమ్మెల్యే శంకర్ నాయక్ కరచాలనం చేసేందుకు ప్రయత్నించగా మంత్రి కేటీఆర్ సీరియస్ గా ఎమ్మెల్యే చేయిని తీసి పడేశారు.