Harish Rao: అది నోరా మొరా.. రాహుల్ గాంధీపై మంత్రి హరీష్ రావు ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: అది నోరా.. మొరా.. మీకు మొక్కాలి అంటూ రాహుల్ గాంధీపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. సిద్ధిపేట నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పర్యటించారు. సిద్దిపేటలోని పత్తి మార్కెట్ యార్డులో రైతులకు స్పింక్లర్లను మంత్రి హరీశ్ రావు పంపిణీ చేసారు. అనంతరం మాట్లాడుతూ.. రాహుల్ గాంధీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ అంటున్నారని ప్రశ్నించారు. రైతుల భూములకు, అటవీశాఖ 10 వేల కోట్లు ఇచ్చినామని తెలిపారు. కాళేశ్వరంతో ఏంపని కాలేదు అన్ని బట్ట కాల్చి మీద వేస్తున్నారు? అంటూ మండిపడ్డారు. కాళేశ్వరం పూర్తి కాకపోతే ఇంత పంట ఎలా పండింది? అని ప్రశ్నించారు. అది నోరా లేక మొరా మీకు మొక్కలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగనాయక సాగర్ లో ముంచి బయటికి తీస్తే నీళ్లు వచ్చాయా లేదా తెలుస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ఒక్క చెరువు కూడా మరమ్మతు చేయలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ పాలిస్తే మాకు కాళేశ్వరం రాకపోవు.. పంటలు పొండకపోవు అంటూ అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు కట్టింది 80 వేల కోట్లు లక్ష కోట్లు ఎక్కడివి రాహుల్ గాంధీ? అంటూ ప్రశ్నించారు.
Read also: Balagam Movie: ‘బలగం’కు మరో అరుదైన రికార్డు.. ఏకంగా 100 ఇంటర్నేషనల్ అవార్డులు
Also Read
- Siddipet: సీరియల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు.. కొడుకును కూడా హత్యలకు ప్రేరేపించిన తల్లి.!
- Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
- Siddipet : యాప్తో బయటపడిన యూరియా మాఫియా..!
- Ponnam Prabhakar - Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..
అంతకు ముందు కొమురవెళ్లి శ్రీ మల్లికార్జున స్వామి వారిని మంత్రి హరీష్రావు దర్శించుకుని మల్లన్నకు ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. అంనతరం రూ.12 కోట్ల వ్యయంతో క్యూలైన్ల కాంప్లెక్స్ నిర్మాణానికి మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి శంకుస్థాపన చేశారు. కాగా.. మల్లన్న సాగర్ నీటితోనే సీఎం కేసీఆర్ స్వామివారికి అభిషేకం చేశారని మంత్రి అన్నారు. ఇక.. జాతీయ రహదారి నుంచి ఆలయం వరకు డబుల్ రోడ్ నిర్మాణ పనులను వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. అంతేకాకుండా.. ఆలయానికి సంబంధించిన వంద గదుల సత్రం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఇక గుట్టపై దాతల సహకారంతో భక్తుల సౌకర్యార్థం గదులను నిర్మిస్తున్నామని, కొమురవెల్లి దేవాలయం దినదిన అభివృద్ధి చెందుతోందని మంత్రి తెలిపారు. కాగా.. గతంలో ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ ఉండేవని కానీ, ప్రస్తుతం ప్రతీ యేటా దాదాపు రూ.18 కోట్ల ఆదాయం వస్తోందని తెలపారు. మల్లన్న స్వామి ఆశీస్సులతో ఈ ప్రాంతం సుభీక్షంగా ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు.
MLA Raghunandan Rao: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు అరెస్ట్.. కారణం ఇదే..
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!