తెలంగాణ భవన్ లో కేటీఆర్, హరీష్ రావుల ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టిన రుణమాఫీపై ప్రధానంగా చర్చించారు.
బీఆర్ఎస్లో… పార్టీ అధిష్టానం పెట్టే రూల్స్ కొందరికేనా? టాప్ టు బాటమ్ అందరికీ అవే రూల్స్ వర్తించవా? ఒక సీరియస్ నిర్ణయం తీసుకున్నప్పుడు అంతా దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదా? కొందరు పెద్దలకు విచ్చలవిడి మినహాయింపులు ఉంటాయా? వాళ్ళు ఏమనుకుంటే అది మాట్లాడేయవచ్చా? పార్టీలో కొత్తగా ఇప్పుడీ చర్చ ఎందుకు జరుగుతోంది? ఏ విషయంలో రచ్చ మొదలైంది? మహాలక్ష్మి….. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం…
Eatala Rajendar: బీజేపీ లో brs విలీనం అనేది శుద్ధ అబద్ధమని.. అలాంటి చర్చ బీజేపీ లో లేదని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. బీఆర్ఎస్ నేతలు ఏమైనా మాట్లాడుకుంటునరేమో..
ఆషాఢం ఆశాజ్యోతిలా కనిపించిన బీఆర్ఎస్ పెద్దలకు శ్రావణ గండం పొంచి ఉందా? ఎప్పుడు ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఊపిరి బిగబట్టి చూస్తున్నారా? రకరకాల రీజన్స్ చూపిస్తూ… పార్టీ మారాలనుకునే ఎమ్మెల్యేలు టెక్నికల్గా భయపడేలా చేయాలనుకుంటున్నారా? ఎమ్మెల్యేల ఫిరాయింపుల చుట్టూ మొదలైన కొత్త చర్చ ఏంటి? బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చాక వలసలతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ ముఖ్య నేతలు కొందరు కూడా ఒక్కొక్కరే కొంత కాలంగా పార్టీని వదిలేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో…
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ ఇటీవల మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటుకు గురై మృతి చెందిన విద్యార్ధి అనిరుధ్ కుటుంబ సభ్యులని కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అనిరుధ్ తల్లి బాధను మీరు విన్నారు, అలాంటి బాధ ఎవరు పడవద్దని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ హాస్టల్లో అనిరుధ్ చదువుతున్నాడు,ఎంతో మంది తల్లిదండ్రుల బాధపడే అంశమని, కుటుంబ సభ్యులు ఒకరిని కోల్పోతే ఎలా ఉంటుందని అందరికి తెలుసు…
MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బెయిల్ కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది.
సుంకిశాల ప్రాజెక్టు విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఎటాక్ చేశారు. సుంకిశాలకు సంబంధించిన ఘటనలో పొరపాటును ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి.. కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడం సరికాదని అన్నారు. సుంకిశాల ఘటనతో కృష్ణా నదిపై బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల నాణ్యత పై విచారణ చేయిస్తామని తెలిపారు.
ప్రాథమిక పారిశుధ్య నిర్వహణలో విఫలమై నిధులను పక్కదారి పట్టిస్తోందని, గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ సీనియర్ శాసనసభ్యుడు టీ హరీశ్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ తప్పుడు ఆరోపణలు చేస్తోందని, తక్షణమే నిధులు విడుదల చేయాలని మంత్రి డి అనసూయ అలియాస్ సీతక్క చేస్తున్న ఆరోపణలపై ఆయన కౌంటర్ ఇచ్చారు. గ్రామపంచాయతీల అవసరాలను తీర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హరీష్ రావు గట్టి కౌంటర్లో మండిపడ్డారు. Asaduddin Owaisi: ముస్లింలను అంతం చేయడమే వక్ఫ్…