Mahesh Kumar Goud: తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని టీపీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ నేత మైనంపల్లి ఇంటికి మహేష్ కుమార్ వెళ్లారు.
బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కున్న భక్తిప్రపత్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. సమకాలీన రాజకీయాల్లో యాగాలతో సెంటిమెంట్ను పండించే అతికొద్ది మంది నేతల్లో ఒకరు కేసీఆర్. గతంలో ఎర్రవల్లిలోని తన ఫామ్హౌస్లో చండీయాగం, రాజశ్యామల యాగంతోపాటు రకరకాల పూజలు నిర్వహించారాయన. అయితే ఈసారి గతానికి భిన్నంగా నవగ్రహ శాంతి యాగం నిర్వహించారట.
Jitta Balakrishna Reddy Dead:తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి (52) కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. బాలకృష్ణారెడ్డి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు స్వస్థలం భువనగిరికి తరలించారు. సాయంత్రం 4 గంటలకు భువనగిరి శివారు మగ్గంపల్లిలోని ఫామ్హౌస్లో అంతక్రియలు జరగనున్నాయి. రాజకీయ నాయకులు జిట్టా మృతికి సంతాపం తెలుపుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో జిట్టా బాలకృష్ణారెడ్డి కీలక పాత్ర పోషించారు.…
Revanth Reddy Chitchat: ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గుండె కరిగిపోయే దృశ్యాలు… మనసు చెదిరిపోయే కష్టాలు…స్వయంగా చూశానని తెలిపారు.
కేసీఆర్ ట్రెండ్ మార్చబోతున్నారా? ఇక దూకుడు పెంచబోతున్నారా? అందుకోసం కీలక నిర్ణయం తీసుకున్నారా? దాని ప్రభావంతో కేడర్లో ఊపు వస్తుందా? ఎన్నికల ఫలితాలు, వలసలతో డీలాపడ్డ గులాబీ దళంలో ఉత్తేజం నింపడానికి కేసీఆర్ అందించబోతున్న ఆ చవన్ప్రాస్ ఏంటి? దాని ప్రభావం నిజంగానే ఆ రేంజ్లో ఉంటుందా? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది బీఆర్ఎస్. పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం పదహారు శాతం ఓటు బ్యాంక్కు పరిమితం కావడం, పార్టీ చరిత్రలో తొలిసారి లోక్సభలో…
మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్రావు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి చిట్ చాట్ లు కాదు.. చీట్ చాట్ లు అని, చిట్ చాట్ రికార్డ్ ఉండదు కాబట్టి, గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రుణమాఫీ చేయని గజ దొంగ.. నన్ను దొంగ అంటున్నాడని, నేను ఇప్పటి కి రాజీనామా కి కట్టుబడి ఉన్నానని ఆయన తెలిపారు. ఆగస్టు 15 లోగా చాలా చోట్ల రుణమాఫీ జరగలేదని,…
MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ను కలవనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఆమె ఇంటి నుంచి ఎర్రవెల్లి ఫామ్హౌస్కు వెళ్లనున్నారు.
కవిత బెయిల్ విషయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల స్పందనపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కవితకు బెయిలు విషయంలో కాంగ్రెస్, బీజేపీలది అనైతిక వాదన అని ఆయన తెలిపారు. వీళ్ల రాజకీయం కోసం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీద, న్యాయవాదుల మీద బురద జల్లుతున్నారని ఆయన మండిపడ్డారు. ఢిల్లీ మద్యం పాలసీ విషయంలో కవిత మీద మోపబడిన అభియోగాలకు ఎలాంటి నైతికత లేదు అని, కేవలం రాజకీయ కక్ష్యతో మోపబడిన…
రైతులను అయోమయానికి గురిచేస్తూ రుణమాఫీ అమలుపై మంత్రులు చేస్తున్న వివాదాస్పద ప్రకటనలను ఎత్తిచూపుతూ, రాష్ట్రంలో నెలకొన్న దుస్థితికి కాంగ్రెస్ అవాస్తవాలు, తప్పుడు వాగ్దానాలే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు బుధవారం అన్నారు. రైతులకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు మొత్తం రూ.31000 కేటాయించి రుణమాఫీ పూర్తయిందని ముఖ్యమంత్రి ప్రకటించగా, ఆగస్టు 15లోగా మాఫీ పూర్తి చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని మరో మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి మాటను ఖండిస్తూ ఆర్థిక మంత్రి ఇప్పటి వరకు…