Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Kishan Reddy Sensational Comments On Cm Revanth Reddy

Kishan Reddy: అసలు రాష్ట్రంలో ఏం మార్పు వచ్చింది.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Published Date :November 27, 2024 , 5:13 pm
By Mahesh Jakki
  • ఏడాది పాలనలో ఏం చేశారో ప్రజలకు వివరించాలి
  • ఏడాదిలో రేవంత్ రెడ్డి సాధించింది ఏంటి?
  • అసలు రాష్ట్రంలో ఏం మార్పు వచ్చింది
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Kishan Reddy: అసలు రాష్ట్రంలో ఏం మార్పు వచ్చింది.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kishan Reddy: ఏడాది పాలనలో ఏం చేశారో ప్రజలకు వివరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తామని.. సోనియా పుట్టిన రోజున రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారని.. ఇచ్చిన ఏ గ్యారంటీని కూడా అమలు చెయ్యలేదని విమర్శించారు. ఏడాదిలో రేవంత్ రెడ్డి సాధించింది ఏంటి అంటూ ప్రశ్నలు గుప్పించారు. బెదిరింపులు.. తిట్ల పురాణాలు, వ్యక్తిగత దాడులు.. అక్రమ కేసులు తప్ప కాంగ్రెస్ సాధించింది లేదన్నారు. సమస్యలపై మాట్లాడితే నీ ఎన్‌డీఏ ఏంటని అడుగుతున్నారని.. తన డీఎన్‌ఏ బీజేపీదని.. మిగతా వాళ్ల లాగా పది పార్టీలు తిరిగిన డీఎన్‌ఏ కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల మీద డిసెంబర్ 1 నుంచి 5 వరకు బీజేపీ ప్రచారం చేయనుందన్నారు.

తెలంగాణ బీజేపీ పార్లమెంట్, శాసన సభ్యులు పీఎంను కలిశామన్నారు. ఇవాళ 12 గంటలకు ప్రధానిని కలిశామన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణ లో ఎలా అమలు జరుగుతున్నాయనే దానిపై ప్రధాని అడిగి తెలుసుకున్నారన్నారు. కేంద్ర పథకాలను సమగ్రంగా అమలు చేసేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు పని చెయ్యాలని దిశా నిర్దేశం చేశారన్నారు. మహేశ్వర్ రెడ్డి మినహా ప్రధానినీ అందరం కలిశామన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ప్రధానితో సమావేశం అనంతరం మేమంతా ప్రత్యేకంగా సమావేశమయ్యామన్నారు. ఎన్నికలకు ముందు అనేక రకాల హామీలు, గ్యారంటీలు.. సబ్ గ్యారంటీలు ఇవ్వడం జరిగిందన్నారు. సమస్యలపై మాట్లాడితే కేసీఆర్ ఎలా వ్యక్తిగతంగా దాడి చేసే వారో.. ఇపుడు రేవంత్ రెడ్డి కూడా అలాగే వ్యవహరిస్తున్నారన్నారు.

Also Read

  • Gayatri Gupta: ‘పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది’.. శివాజీపై గాయత్రి గుప్తా ఫైర్..
  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
  • UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..
  • PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం.!

విపక్షాలను తిట్టడం మీద పెట్టే దృష్టి పాలన మీద పెడితే.. రాష్ట్రం పరిస్థితి బాగుంటుందన్నారు. కానీ సీఎం దీన్ని పట్టించుకోవడం లేదన్నారు. రెండ్రోజుల క్రితం కొమురంభీం జిల్లాలో.. శైలజ అనే అమ్మాయి.. ఫుడ్ పాయిజనింగ్‌తో చనిపోయిందన్నారు. దీని మీద సీఎం కనీసం దృష్టిపెట్టరన్నారు. సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయరన్నారు. సంబంధం లేని విషయాలపైనా ఆయనకు ఆసక్తి ఎక్కువ అంటూ విమర్శించారు. అందుకే బీజేపీ తరపున.. రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా.. ఇప్పటికైనా నిర్మాణాత్మకంగా పాలనమీద దృష్టిపెట్టాలని కోరుతున్నామన్నారు. రాజకీయ పరమైన ఆరోపణలు, ప్రత్యారోపణలతో.. తెలంగాణ నష్టపోతోందన్నారు. తెలంగాణ గతంలో బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ కారణంగా.. రాష్ట్రం నష్టపోతోందని విమర్శలు గుప్పించారు. రాజకీయ వ్యవస్థ భ్రష్టు పడుతోందని మండిపడ్డారు.

Read Also: Kaleshwaram Commission: రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇవ్వకపోవడం వల్లే ఎన్‌డీఎస్ఏ నివేదిక ఆలస్యం..

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు, వ్యక్తిగత దాడులు.. అసాధ్యమైన అంశాల్లో.. ప్రజలను మభ్యపెట్టేలా పనులు చేయడంలో ఇద్దరూ ఇద్దరేనన్నారు. కాంగ్రెస్ వాళ్లు.. బీఆర్ఎస్ వాళ్లను చేర్చుకున్నారని.. బీఆర్ఎస్ వాళ్లు.. కాంగ్రెస్ వాళ్లను చేర్చుకున్నారన్నారు. చట్టాలకు తూట్లు పొడుస్తున్నారని.. సకాలంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పినా.. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. నిస్సిగ్గుగా.. కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన వారు బీఆర్ఎస్‌లో చేరి.. మంత్రులయ్యారన్నారు. ఆ పార్టీ నాయకులు.. అక్కడ గెలిచి.. ఇక్కడ మంత్రులయ్యారని.. ఇంతకన్నా సిగ్గుచేటు ఉంటుందా అంటూ ఎద్దేవా చేశారు. ఇంతకన్నా రికార్డులు, సాక్ష్యాలు ఇంకేం కావాలన్నారు. ప్రభుత్వాలు హామీల అమలుకు సమయం ఇవ్వాలని.. కానీ రెండ్రోజుల్లో హామీలు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పడం.. వందరోజుల్లో హామీలు అమలుచేస్తామని.. సోనియా గాంధీ పేరుతో లేఖలు పంపడం.. నిజం కాదా అంటూ కేంద్ర మంత్రి ప్రశ్నించారు. నిరుద్యోగులు.. రాహుల్, రేవంత్ చెప్పిన మాటలను విని మోసమోయారన్నారు. జాబ్ క్యాలెండర్ల విడుదలతో యువతను మోసం చేశారని విమర్శించారు. రైతులకు రైతు భరోసా.. కౌలు రైతులకు, రైతు కూలీలకు ఇస్తామన్న డబ్బుల సంగతేంది అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

Read Also: Bhatti Vikramarka: రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై డిప్యూటీ సీఎం కీలక ప్రకటన!

“మహిళలకు రూ.2,500 ఇస్తామన్న సంగతేమైంది? నిరుద్యోగ భృతి, ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తామన్నారు? ఎందరికి అందింది? సుమారు 13 పంటలకు రూ.500 బోనస్ ఇస్తామన్నారు. కనీసం వరికి కూడా ఇవ్వకుండా.. సన్నబియ్యం, దొడ్డు బియ్యం అని కొత్త రూల్స్ జోడించడం దారుణం. ధాన్యం కొనుగోలును.. కేంద్రం డబ్బులిచ్చి కొంటుంటే.. కొనుగోలు కేంద్రాల నిర్వహణ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చేతకావడం లేదు. మహిళలకు సంబంధించి.. తులం బంగారం, కల్యాణ లక్ష్మి, వృద్ధాప్య పింఛన్, దివ్యాంగుల పింఛన్.. ఒక్క రూపాయి కూడా పెరగలేదు. ఉన్నది సరిగ్గా ఇవ్వడం లేదు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఉన్న రేషన్ కార్డులే ఇంకా నడుస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్లు అవుతున్నా.. తెలంగాణ రాష్ట్రం లో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేక పోవడం దురదృష్టకరం. పాలనమీద దృష్టిపెట్టాలని కాంగ్రెస్ కు సూచిస్తున్నాను. ముఖ్యమంత్రి హుందాగా వ్యవహరించాలి.ఎవరైనా సమస్యమీద మాట్లాడితే.. వ్యక్తిగతంగా విమర్శించే ప్రయత్నం, దిగజారి మాట్లాడే ప్రయత్నం సరికాదు. అప్రజాస్వామిక భాష మాట్లాడటాన్ని కేసీఆర్ ప్రవేశపెడితే.. రేవంత్ కొనసాగిస్తున్నాడు.

అసలు రాష్ట్రంలో ఏం మార్పు వచ్చింది. కాంగ్రెస్ పాత అలవాటు ప్రకారం.. అవినీతి విలయతాండవం చేస్తోంది. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పూర్తిగా దెబ్బతిన్నది. గతంలో.. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అప్పులమీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపితే.. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి. చిన్న చిన్న పట్టణాలకు కూడా డెవలప్ మెంట్ అథారిటీలు ఏర్పాటుచేసి.. డబ్బులు ఖర్చుచేస్తున్నారు. 30వ తేదీనాడు.. దీనిపై విస్తృతస్థాయిలో హైదరాబాద్ లో చర్చిస్తాం. ఆ తర్వాత డిసెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు ఇంటింటికి వెళ్తాం. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతాం. అమెరికాలో చట్టాల అమలు విషయం అక్కడి ప్రభుత్వం చూసుకుంటుంది. పార్లమెంటు ఎన్నికలకు ముందు.. ఏదో ఒక ఇలాంటి అంశాన్ని సృష్టించి.. కుట్ర చేస్తున్నారు. ఇది కుట్రపూరితమైన చర్య. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నం ఏనాడూ చేయలేదు. చేయదు. ప్రజాసమస్యల మీద పోరాడండి, కేంద్రప్రభుత్వ పథకాలు అమలుచేయండి.క్షేత్రస్థాయిలో నిర్మాణాత్మకంగా పనిచేయాలని మోదీ గారు సూచించారు. ఆ మార్గంలోనే మేం ముందుకెళ్తున్నాం. డిసెంబర్ చివరి నాటికల్లా.. సంస్థాగత ఎన్నికలు పూర్తవుతాయి. పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎన్నిక పూర్తవుతుంది.”అని కిషన్ రెడ్డి అన్నారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • BRS
  • CM Revanth Reddy
  • congress
  • Kishan Reddy

తాజావార్తలు

  • Gayatri Gupta: ‘పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది’.. శివాజీపై గాయత్రి గుప్తా ఫైర్..

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • Yashasvi Jaiswal: “నేనూ చిన్నవాడినే, కానీ అతడితో పోలిస్తే..” వైభవ్‌పై జైస్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు..

  • Marcus Stoinis: 4, 6, 6, 4, 4.. స్టోయినిస్ డెత్ ఓవర్ బీభత్సం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్

  • Vaibhav Sooryavanshi: పొలార్డ్ రికార్డుకు ఎసరు.. ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో వైభవ్ సూర్యవంశీ..

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions