నవమాసాలు మోసి కన్న తల్లినే కొడుకు కడతేర్చిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి 2.30 ప్రాంతంలో ఎక్సర్ సైజ్ చేస్తుండగా తల్లి మందలించింది. దీంతో సైకో కొడుకు సుధీర్ రాడ్ తో తల్లిని తలపై కొట్టాడు. అంతేకాకుండా అడ్డు వచ్చిన చెల్లెను సుధీర్ కూడా రాడ్ తో కొట్టాడు. అయితే ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సమాచారం అందుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు.
అప్పటికే సుధీర్ తల్లి పాపమ్మ మృతి చెందగా.. చెల్లికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన చెల్లిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు మృతి చెందిన పాపమ్మను మార్చురీకి తరలించారు. గతకొన్ని రోజులుగా సుధీర్ సైకోగా (మతిస్థిమితం లేని) ప్రవర్తిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. సుధీర్ ను అదుపులోకి తీసుకుని.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.