చెరువులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే నగరంలో చెరువుల పరిరక్షణపై లేక్ ప్రొటక్షన్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల గుర్తించేందుకు ఇరిగేషన్, రెవెన్యూ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్, సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో సోమవారం హైడ్రా కమిషనర్ ,లేక్ ప్రొటక్షన్ కమిటీ ఛైర్మెన్ ఏవీ రంగనాథ్ సమీక్ష నిర్వహించారు. నగరంలో చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు,…
హైదరాబాద్ ఆసిఫ్నగర్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్, ఎంఐఎం నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్, కాంగ్రెస్ నేత ఫిరోజ్ఖాన్ అనుచరుల మధ్య గొడవ జరిగింది. బ్యాంకు కాలనీలో రహదారి పనుల పరిశీలనకు కాంగ్రెస్ నేత ఫిరోజ్ఖాన్పై వచ్చారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ చోటు చేసుకుంది. అయితే.. వివరాల్లోకి వెళితే.. కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్, నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ వారి మద్దతుదారుల మధ్య సోమవారం మధ్యాహ్నం నాంపల్లి…
దసరా ఆపరేషన్స్పై పోలీస్, రవాణా శాఖల అధికారులతో ఆర్టీసీ సమన్వయ సమావేశం నిర్వహించారు. సద్దుల బతుకమ్మ, దసరా పండుగలకు ప్రయాణికులను క్షేమంగా సొంతూళ్లకు చేర్చేందుకు టీజీఎస్ఆర్టీసీకి సహకరించాలని పోలీస్, రవాణా శాఖల అధికారులను సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ కోరారు. గత దసరాతో పోల్చితే ఈ సారి మహాలక్ష్మి పథకం అమలు వల్ల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముందని, గతంలో మాదిరిగానే సహాయసహకారాలు అందించాలని ఆయన కోరారు. దసరా ఆపరేషన్స్పై హైదరాబాద్ లోని బస్ భవన్ లో…
దుబాయ్లో పాఠశాల విద్య, హైదరాబాద్లో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసిన విద్యార్థిని ఎంబీబీఎస్ అడ్మిషన్లకు స్థానిక అభ్యర్థిగా గుర్తించాలని తెలంగాణ హైకోర్టు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ను ఆదేశించింది. కొండాపూర్కు చెందిన అనుమత ఫరూక్ పిటిషన్ను విచారించిన అనంతరం చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ శ్రీనివాస్రావుతో కూడిన డివిజన్ బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లలో స్థానిక అభ్యర్థిగా పరిగణించకుండా తప్పించడాన్ని ఫరూక్ సవాలు చేశారు. ఫరూక్ 1998 నుంచి…
రాష్ట్ర ప్రభుత్వం 11,063 ఉపాధ్యాయ పోస్టుల జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) రిక్రూట్మెంట్ తుది జాబితాను నేటి (అక్టోబర్ 7, సోమవారం) సాయంత్రంలోపు విడుదల చేయనుంది. ఎంపికైన ఉద్యోగ అభ్యర్థులకు ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తమ జాయినింగ్ ఆర్డర్లను స్వీకరించేందుకు అక్టోబర్ 9వ తేదీ బుధవారం మధ్యాహ్నం 2 గంటలలోపు ఎల్బి స్టేడియానికి చేరుకోవాలని అభ్యర్థించడం జరిగింది. ఆదివారం సాయంత్రం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ..…
ప్రజల సంక్షేమం, అభివృద్ధి కంటే మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రూ.1.5 లక్షల కోట్లతో మూసీ రివర్ఫ్రంట్ వంటి గొప్ప కార్యక్రమాలను ఏకకాలంలో నిర్వహిస్తూనే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ముఖ్యమంత్రి అనడంపై ఆయన మండిపడ్డారు. “ప్రతిరోజూ రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పెరుగుతున్న అప్పుల గురించి ఏడుస్తూనే ఉంటాడు, కానీ చాలా మందికి అనవసరమైన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్…
హైడ్రాపేరుతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కొన్ని వాస్తవ విషయాలు తెలియాలని ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైడ్రా పేరు మీద ప్రతిపక్షాలు కొన్ని వ్యవస్థలు ప్రభుత్వం పై చేస్తున్న నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని, మూసీ రిజర్వేషన్ పై సీఎం, ప్రభుత్వం కార్యక్రమంపై అపోహలు సృష్టించి… పాలనపై తప్పుడు ఆరోపణలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.…
రోజు రోజుకు కూరగాయాల ధరలు మండిపోతున్నాయి. మటన్, చికెన్ ధరలకు పోటీగా కూరగాయాల ధరలు పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు జేబులకు చిల్లుపడుతోంది. దసరా నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో కూరగాయాల ధరలు ఆకాశానంటుతున్నాయి. పండుగ వేళ కావడంతో మార్కెట్లలో పూల ధరలు సైతం పెరిగిపోయాయి. అయితే.. దేవి నవరాత్రోత్సవాల ఉండటంతో శాఖాహార ప్రియులు కూరగాయలు కొనడం తప్పదనే చెప్పాలి. అయితే.. ముఖ్యంగా కూరగాయాల్లో టమాటో ధరలు కన్నీరు పెట్టిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని మైదరాబాద్ మార్కెట్లలో కిలో టమాటో ధర…
Bomb Blast: పాకిస్థాన్లోని కరాచీ విమానాశ్రయం సమీపంలో జరిగిన పేలుడులో ముగ్గురు చైనా పౌరులు మరణించారు. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో రాత్రి 11 గంటల సమయంలో పోర్ట్ ఖాసిమ్ ఎలక్ట్రిక్ పవర్ కంపెనీకి చెందిన చైనా ఉద్యోగులతో వెళ్తున్న కాన్వాయ్పై దాడి జరిగిందని చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఉగ్రదాడిని పాకిస్థాన్లోని చైనా ఎంబసీ, కాన్సులేట్ జనరల్ తీవ్రంగా ఖండించారు. ఈ పేలుడులో మరణించిన చైనా బాధితులకు రాయబార కార్యాలయం…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ బహిరంగ లేఖ రాశారు. ‘అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పేదల అభ్యున్నతే లక్ష్యంగా కొట్లాడే వ్యక్తిని నేను. హైడ్రాసంస్థకు, హైదరాబాద్ ముంపు గురికాకుండా చూసేందుకు, మూసీ ప్రక్షాళనకు, మూసీను కొబ్బరినీళ్లలా చేసేందుకు, ఎకలాజికల్ బాలన్స్ కాపాడడానికి, విదేశీ పక్షులు రావడానికి, చేపలు పెంచడానికి, పిల్లలు ఈతకొట్టేల చెరువులు తయారు చేయడానికి నేను వ్యతిరేకం కాదు. చెరువు కన్నతల్లి లాంటిది. కానీ హైదరాబాద్ లో ఉన్న ఏ చెరువు…