Caste Enumeration : తెలంగాణలో కులగణన విధివిధానాలపై కసరత్తు
- తెలంగాణలో కులగణన విధివిధానాలపై ప్రభుత్వం కసరత్తు
- నెల రోజుల్లోపు కుల గణన పూర్తి చేసేయోచన
- 2-3 రోజుల్లో ప్రభుత్వం కీలక భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కుల గణన చేయడానికి వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. కుల గణన పై షెడ్యూల్ ఖరారు చేయడానికి రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో సెక్రటేరియట్ లోని వారి ఛాంబర్ లో కీలక సమావేశం జరిగింది. సమావేశంలో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తో పాటు ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి,బీసీ కమిషన్ సభ్యులు , సభ్యులు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Srisailam Dam Safety: శ్రీశైలంలో ముగిసిన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల పరిశీలన.. నవంబర్లో టెండర్లు..
Also Read
- Akhilesh Yadav: ‘18 ఏళ్లు రాగానే బీజేపీని ఓడించండి’.. జెన్ ఆల్ఫాకు అఖిలేష్ పిలుపు
- Murmu: జెన్-జీపై తొలిసారి స్పందించిన ముర్ము.. ఏమన్నారంటే..!
- RBI SGB Redemption: గ్రాము బంగారం రూ.3 వేలకు కొన్నారు.. ఇప్పుడు లక్షకు రూ.4 లక్షలు..
- Murmu warns: ‘ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం’.. ఉగ్రవాదులకు రాష్ట్రపతి ముర్ము హెచ్చరిక
ప్రభుత్వం బీసీల్లో రిజర్వేషన్స్ ఖరారు చేయడానికి బీసీ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే కుల గణన కోసం అసెంబ్లీలో ,క్యాబినెట్ లో కూడా తీర్మానం చేసింది. అయితే కుల గణన ఎలా చేయాలి అనే దానిపై అధికారులతో చర్చించారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో చేసిన కుల గణన పై అధ్యయనం చేశారు. కర్ణాటక , బీహార్, ఆంధ్రప్రదేశ్ లో చేసిన కుల గణన పై సమావేశంలో చర్చించారు. కర్ణాటక లో బీసీ కమిషన్ చేసిన సర్వే , బీహార్ లో జీఏడి ద్వారా చేసిన సర్వే , ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ రాజ్ ద్వారా సర్వే చేసిన అంశాల పై చర్చించారు. అక్కడ డోర్ టూ డోర్ పూర్తి స్థాయి సర్వే నిర్వహించారు. ఇందులో మూడు రాష్ట్రాల్లో చేసిన బెస్ట్ పాలసీ నీ తీసుకొని ఇక్కడ అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
ఫేస్బుక్, ఇన్స్టా మాదిరి.. వాట్సాప్లో ఇంట్రెస్టింగ్ ఫీచర్స్!
మరోవైపు ఎస్సి వర్గీకరణ కు సుప్రింకోర్టు సానుకూలంగా తీర్పు ఇవ్వడం ప్రభుత్వం వర్గీకరణ మీద సబ్ కమిటీ సమావేశాలు కొనసాగుతుండటంతో కుల గణన సర్వే నివేదిక ఎస్సి వర్గీకరణ కు కూడా అవసరం ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయి కులాల గణన చేసి వారికి అవసరమైన డేటా తీసుకునేలా చేసే అంశం పై చర్చించారు. రిపోర్ట్ పారదర్శకంగా ఉండడానికి ఇరు శాఖలకు సంబంధం లేకుండా కుల గణన జీఏడీ లేదా పంచాయతీ రాజ్ , రెవెన్యూ లో దేని ద్వారా చెపించాలనే దానిపై రెండు రోజుల్లో సీనియర్ మంత్రులతో ప్రభుత్వం కీలక సమావేశం ఏర్పాటు చేయనుందని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కుల గణన కు సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో మానిటరింగ్ చేసేలా చూడాలని సూచించారు. కుల గణన ప్రారంభమై నెల రోజుల్లో పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘18 ఏళ్లు రాగానే బీజేపీని ఓడించండి’.. జెన్ ఆల్ఫాకు అఖిలేష్ పిలుపు
-
Murmu: జెన్-జీపై తొలిసారి స్పందించిన ముర్ము.. ఏమన్నారంటే..!
-
RBI SGB Redemption: గ్రాము బంగారం రూ.3 వేలకు కొన్నారు.. ఇప్పుడు లక్షకు రూ.4 లక్షలు..
-
Murmu warns: ‘ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం’.. ఉగ్రవాదులకు రాష్ట్రపతి ముర్ము హెచ్చరిక
-
‘తప్పుడు కేసులతో వేధిస్తున్నారు’.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!