దుబాయ్లో పాఠశాల విద్య, హైదరాబాద్లో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసిన విద్యార్థిని ఎంబీబీఎస్ అడ్మిషన్లకు స్థానిక అభ్యర్థిగా గుర్తించాలని తెలంగాణ హైకోర్టు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ను ఆదేశించింది. కొండాపూర్కు చెందిన అనుమత ఫరూక్ పిటిషన్ను విచారించిన అనంతరం చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ శ్రీనివాస్రావుతో కూడిన డివిజన్ బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లలో స్థానిక అభ్యర్థిగా పరిగణించకుండా తప్పించడాన్ని ఫరూక్ సవాలు చేశారు. ఫరూక్ 1998 నుంచి…
రాష్ట్ర ప్రభుత్వం 11,063 ఉపాధ్యాయ పోస్టుల జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) రిక్రూట్మెంట్ తుది జాబితాను నేటి (అక్టోబర్ 7, సోమవారం) సాయంత్రంలోపు విడుదల చేయనుంది. ఎంపికైన ఉద్యోగ అభ్యర్థులకు ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తమ జాయినింగ్ ఆర్డర్లను స్వీకరించేందుకు అక్టోబర్ 9వ తేదీ బుధవారం మధ్యాహ్నం 2 గంటలలోపు ఎల్బి స్టేడియానికి చేరుకోవాలని అభ్యర్థించడం జరిగింది. ఆదివారం సాయంత్రం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ..…
ప్రజల సంక్షేమం, అభివృద్ధి కంటే మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రూ.1.5 లక్షల కోట్లతో మూసీ రివర్ఫ్రంట్ వంటి గొప్ప కార్యక్రమాలను ఏకకాలంలో నిర్వహిస్తూనే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ముఖ్యమంత్రి అనడంపై ఆయన మండిపడ్డారు. “ప్రతిరోజూ రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పెరుగుతున్న అప్పుల గురించి ఏడుస్తూనే ఉంటాడు, కానీ చాలా మందికి అనవసరమైన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్…
హైడ్రాపేరుతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కొన్ని వాస్తవ విషయాలు తెలియాలని ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైడ్రా పేరు మీద ప్రతిపక్షాలు కొన్ని వ్యవస్థలు ప్రభుత్వం పై చేస్తున్న నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని, మూసీ రిజర్వేషన్ పై సీఎం, ప్రభుత్వం కార్యక్రమంపై అపోహలు సృష్టించి… పాలనపై తప్పుడు ఆరోపణలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.…
రోజు రోజుకు కూరగాయాల ధరలు మండిపోతున్నాయి. మటన్, చికెన్ ధరలకు పోటీగా కూరగాయాల ధరలు పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు జేబులకు చిల్లుపడుతోంది. దసరా నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో కూరగాయాల ధరలు ఆకాశానంటుతున్నాయి. పండుగ వేళ కావడంతో మార్కెట్లలో పూల ధరలు సైతం పెరిగిపోయాయి. అయితే.. దేవి నవరాత్రోత్సవాల ఉండటంతో శాఖాహార ప్రియులు కూరగాయలు కొనడం తప్పదనే చెప్పాలి. అయితే.. ముఖ్యంగా కూరగాయాల్లో టమాటో ధరలు కన్నీరు పెట్టిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని మైదరాబాద్ మార్కెట్లలో కిలో టమాటో ధర…
Bomb Blast: పాకిస్థాన్లోని కరాచీ విమానాశ్రయం సమీపంలో జరిగిన పేలుడులో ముగ్గురు చైనా పౌరులు మరణించారు. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో రాత్రి 11 గంటల సమయంలో పోర్ట్ ఖాసిమ్ ఎలక్ట్రిక్ పవర్ కంపెనీకి చెందిన చైనా ఉద్యోగులతో వెళ్తున్న కాన్వాయ్పై దాడి జరిగిందని చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఉగ్రదాడిని పాకిస్థాన్లోని చైనా ఎంబసీ, కాన్సులేట్ జనరల్ తీవ్రంగా ఖండించారు. ఈ పేలుడులో మరణించిన చైనా బాధితులకు రాయబార కార్యాలయం…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ బహిరంగ లేఖ రాశారు. ‘అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పేదల అభ్యున్నతే లక్ష్యంగా కొట్లాడే వ్యక్తిని నేను. హైడ్రాసంస్థకు, హైదరాబాద్ ముంపు గురికాకుండా చూసేందుకు, మూసీ ప్రక్షాళనకు, మూసీను కొబ్బరినీళ్లలా చేసేందుకు, ఎకలాజికల్ బాలన్స్ కాపాడడానికి, విదేశీ పక్షులు రావడానికి, చేపలు పెంచడానికి, పిల్లలు ఈతకొట్టేల చెరువులు తయారు చేయడానికి నేను వ్యతిరేకం కాదు. చెరువు కన్నతల్లి లాంటిది. కానీ హైదరాబాద్ లో ఉన్న ఏ చెరువు…
తెలంగాణలోని ప్రముఖ పూల పండుగ బతుకమ్మను అరేబియా గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రవాసులు ఘనంగా జరుపుకుంటున్నారు. బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించబడుతుండటంతో జెడ్డా వ్యాప్తంగా తెలంగాణ ప్రవాసాంధ్రులలో సంబరా వాతావరణం నెలకొంది. బతుకమ్మ సంబరాలను నిర్వహించడంలో గల్ఫ్ ప్రాంతంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముందుంది. గల్ఫ్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ (జిడబ్ల్యుసిఎ) ఆధ్వర్యంలో దుబాయ్లోని వివిధ సంస్థలు శని, ఆదివారాల్లో ఈ వేడుకను జరుపుకోవడానికి పోటీ పడుతున్నాయి. జువ్వాడి శ్రీనివాస్రావు, సలావుద్దీన్, శామ్యూల్,…
హైదరాబాద్ నగరం వివిధ మతాలకు, సంస్కృతులకు ప్రతీకగా ఉంది. కానీ, ఇటీవలి కాలంలో పాశ్చాత్య సంస్కృతితో కలుషితం అవుతోంది. ఢిల్లీ, ముంబైలకు పరిమితమైన పబ్ కల్చర్ ఇప్పుడు హైదరాబాద్లో వేగంగా విస్తరిస్తోంది. వీకెండ్లో నగర యువత పబ్లలో నింగి తాకుతూ, మద్యం సేవించి, అర్థనగ్న డాన్సులకు రాలిపోతున్నారు. ఈ నేపథ్యంలో, పబ్ నిర్వాహకులు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. అమ్మాయిలతో డాన్సు షోలు ఏర్పాటు చేసి, ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించడం జరుగుతోంది. కొంతకాలం క్రితం కేబీఆర్ పార్క్…
దసరా ఉత్సవాలకు రెండు రోజుల ముందుగా అక్టోబర్ 9న ఇటీవల నిర్వహించిన డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) పరీక్షలో అర్హత సాధించిన 11,063 మంది అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం నియామక పత్రాలు ఇవ్వనుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన పరీక్షలో ఎంపికైన 1,635 మంది అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్లను ఆదివారం పంపిణీ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. రెసిడెన్షియల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, 659 మంది అసిస్టెంట్…