రంగారెడ్ది జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన చేసి.. శిలా ఫలకం ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి.. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ దసరా నాలుగు కోట్ల తెలంగాణా ప్రజలకు సుఖ శాంతులు ఇవ్వాలని.. మంచి పంటలు ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు. ప్రభుత్వం ఏర్పడిన రోజునే మేము వాగ్దానం చేసినం..…
మజ్లిస్తో సంబంధం వేరు.. లా అండ్ ఆర్డర్ వేరు అని, తప్పు చేస్తే ఎవరికైనా ఒకటే రూల్ అని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హెల్త్, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ ప్రభుత్వానికి చాలా ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు. కొత్త, పాత అంత కలుపుకుని పోతున్నామని ఆయన తెలిపారు. ఏ అంశంలో అయిన ముందు నుండి ఉన్న కాంగ్రెస్ నాయకులకీ ముందు ప్రియారిటీ ఉంటదన్నారు. కేంద్రమంత్రి హోదాలో ఉండి కిషన్ రెడ్డి…
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (కెఎల్ఐఎస్) కింద కీలకమైన మూడు బ్యారేజీలలో కనీసం రెండింటిని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది . రెండు సీజన్లుగా గోదావరి నీటిని కోల్పోయిన రైతులు, తమ ప్రజాప్రతినిధులతో కలిసి, KLIS కింద ఆయకట్టుకు ఏకైక ఆధారమైన గోదావరికి ఉపనది అయిన ప్రాణహిత నది నుండి సంభావ్య ప్రవాహాలను ఉపయోగించుకోవడానికి పంపింగ్ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని ఒత్తిడి చేస్తున్నారు. , కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గవలసి వచ్చింది, అయితే…
తెలంగాణలో వరదలకు జరిగిన పంట నష్టానికి పరిహారం నిధులు విడుదల చేసింది తెలంగాణ సర్కార్. ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 6 వరకు కురిసిన భారీ వర్షాల వలన జరిగిన పంట నష్టానికి పరిహారం నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. 79,216 మంది రైతులకు చెందిన 79,574 ఎకరాల పంట నష్టానికి 79.57 కోట్ల నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. రైతుల అకౌంట్లకే నేరుగా జమా చేసేటట్టు ఏర్పాట్లు ప్రభుత్వం చేయనుంది. ఆగస్టు 31 నుండి సెప్టెంబర్…
బతుకమ్మ పండుగ సందర్భంగా మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య పోలీస్ కంట్రోల్ రూమ్, శాసనసభ, అప్పర్ ట్యాంక్ బండ్ దగ్గర బతుకమ్మ పండుగ సందర్భంగా కొన్ని ప్రధాన రహదారిలో వాహనాల రాకపోకలు మందగించే అవకాశం ఉంది. హైదరాబాద్ నగర పోలీసులు స్థానిక ట్రాఫిక్ పరిస్థితులను బట్టి అవసరాల ఆధారంగా కొన్ని మళ్లింపులు , పరిమితులను కూడా ప్రకటించారు. ఇక్కడ పరిమితులు లేదా మళ్లింపులు ఉన్నాయి. AP Cabinet: రేపు ఉదయం…
డిజాస్టర్ మేనేజ్మెంట్పై హైడ్రా కమిషనర్ సమీక్ష నిర్వహించారు. నగరంలో వరదలు, కారణాలు, ఉపశమన చర్యలు (డిజాస్టర్ మేనేజ్మెంట్)పై బుధవారం హైడ్రా కార్యాలయంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సమీక్ష చేశారు. బెంగళూరులో అనుసరిస్తున్న విధానాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కర్ణాటక రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ కేంద్రం మాజీ డైరెక్టర్ డా. జీఎస్ శ్రీనివాస్ రెడ్డి వివరించారు. బెంగళూరుతో పాటు.. దేశంలోని ఇతర పట్టణాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి సమన్వయంతో మెరుగైన వ్యవస్థను రూపొందించడంపై కసరత్తు…
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో.. ఇటీవల టీచర్లుగా ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగ నియామకాల గురించి పట్టించుకోలేదని, ఉపాధ్యాయ నియామకాల పై కనీసం ఆలోచన చేయలేదన్నారు. దశాబ్ద కాలం డీఎస్సీ ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి పేదలకు విద్యా అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని, ఎన్ని ఇబ్బందులు వచ్చిన…
తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది, ఇది రాష్ట్రంలోని ఎస్సీ వర్గీకరణ అమలును సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించిన విధానం. ముఖ్యంగా, ఎస్సీ వర్గీకరణపై సమగ్ర నివేదిక అందించేందుకు ఒక వ్యక్తితో కూడిన కమిషన్ను ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ కమిషన్ 60 రోజుల్లో నివేదిక సమర్పించాల్సి ఉంది. రాష్ట్రంలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ఈ నివేదిక ఆధారంగా కుద్రింపు ఉండాలని సీఎం స్పష్టం చేశారు.…
తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కౌన్సిల్ (TGERC) ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఛార్జింగ్ టారిఫ్ను డే టైమ్ (ToD) టారిఫ్ సిస్టమ్ ప్రకారం నిర్ణయించినట్లు నివేదించబడింది. ToD టారిఫ్ విధానంలో, విద్యుత్ ఛార్జీలు రోజు సమయాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ప్రస్తుతం ఉన్న ఫ్లాట్ రేట్ విధానాన్ని భర్తీ చేయనున్నారు. పగటిపూట, సుంకం 20 శాతం వరకు తగ్గవచ్చు, ఇది వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. దీనికి విరుద్ధంగా, రాత్రి సమయంలో, సుంకం అదే మొత్తంలో పెరుగుతుంది. కొత్త…
ఎంఐఎంకి ఫిరోజ్ ఖాన్ అంటే భయం .. అందుకే దాడులు చేస్తుందంటూ నాంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జి ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. రోడ్డు నిర్మాణం జరుగుతుంటే దాంట్లో ఓ వ్యక్తి పడి తల పగిలిందని, అతన్ని పరామర్శించడం కోసం వెళ్ళానన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే తన గుండాలతో వచ్చి దాడి చేశారని ఆయన ఆరోపించారు. లంగపని..దొంగ పని నేను చేయనని ఆయన అన్నారు. విచిత్రం ఏంటంటే.. పోలీసులు ఎంఐఎం వాళ్లపై పెట్టిన కేసులే మా…