డిజాస్టర్ మేనేజ్మెంట్పై హైడ్రా కమిషనర్ సమీక్ష నిర్వహించారు. నగరంలో వరదలు, కారణాలు, ఉపశమన చర్యలు (డిజాస్టర్ మేనేజ్మెంట్)పై బుధవారం హైడ్రా కార్యాలయంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సమీక్ష చేశారు. బెంగళూరులో అనుసరిస్తున్న విధానాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కర్ణాటక రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ కేంద్రం మాజీ డైరెక్టర్ డా. జీఎస్ శ్రీనివాస్ రెడ్డి వివరించారు. బెంగళూరుతో పాటు.. దేశంలోని ఇతర పట్టణాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి సమన్వయంతో మెరుగైన వ్యవస్థను రూపొందించడంపై కసరత్తు…
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో.. ఇటీవల టీచర్లుగా ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగ నియామకాల గురించి పట్టించుకోలేదని, ఉపాధ్యాయ నియామకాల పై కనీసం ఆలోచన చేయలేదన్నారు. దశాబ్ద కాలం డీఎస్సీ ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి పేదలకు విద్యా అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని, ఎన్ని ఇబ్బందులు వచ్చిన…
తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది, ఇది రాష్ట్రంలోని ఎస్సీ వర్గీకరణ అమలును సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించిన విధానం. ముఖ్యంగా, ఎస్సీ వర్గీకరణపై సమగ్ర నివేదిక అందించేందుకు ఒక వ్యక్తితో కూడిన కమిషన్ను ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ కమిషన్ 60 రోజుల్లో నివేదిక సమర్పించాల్సి ఉంది. రాష్ట్రంలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ఈ నివేదిక ఆధారంగా కుద్రింపు ఉండాలని సీఎం స్పష్టం చేశారు.…
తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కౌన్సిల్ (TGERC) ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఛార్జింగ్ టారిఫ్ను డే టైమ్ (ToD) టారిఫ్ సిస్టమ్ ప్రకారం నిర్ణయించినట్లు నివేదించబడింది. ToD టారిఫ్ విధానంలో, విద్యుత్ ఛార్జీలు రోజు సమయాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ప్రస్తుతం ఉన్న ఫ్లాట్ రేట్ విధానాన్ని భర్తీ చేయనున్నారు. పగటిపూట, సుంకం 20 శాతం వరకు తగ్గవచ్చు, ఇది వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. దీనికి విరుద్ధంగా, రాత్రి సమయంలో, సుంకం అదే మొత్తంలో పెరుగుతుంది. కొత్త…
ఎంఐఎంకి ఫిరోజ్ ఖాన్ అంటే భయం .. అందుకే దాడులు చేస్తుందంటూ నాంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జి ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. రోడ్డు నిర్మాణం జరుగుతుంటే దాంట్లో ఓ వ్యక్తి పడి తల పగిలిందని, అతన్ని పరామర్శించడం కోసం వెళ్ళానన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే తన గుండాలతో వచ్చి దాడి చేశారని ఆయన ఆరోపించారు. లంగపని..దొంగ పని నేను చేయనని ఆయన అన్నారు. విచిత్రం ఏంటంటే.. పోలీసులు ఎంఐఎం వాళ్లపై పెట్టిన కేసులే మా…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) క్లిష్టమైన వ్యర్థాల నిర్వహణ సవాళ్లను పరిష్కరించడం ద్వారా నగర పరిశుభ్రతను పెంపొందించడంలో గణనీయమైన పురోగతిని సాధిస్తోంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ (SWM) కోసం అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) అభివృద్ధి ప్రయత్నాల్లో భాగంగా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మంగళవారం ఆపరేటర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, అమలు చేయడానికి వినూత్న పరిష్కారాలను అన్వేషించింది. వ్యర్థాల నిర్వహణ కోసం ICCC కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ,…
గొలుసుకట్టు చెరువులకు ప్రసిద్ధి చెందిన నగరంలో అస్సలు ఎన్ని చెరువులుండేవి.. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి లెక్కతేల్చేందుకు సర్వే ఆఫ్ ఇండియాతో కలిసి హైడ్రా పని చేస్తోంది. హబ్సిగూడలో ఉన్న సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయానికి మంగళవారం తన అధికారుల బృందంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వెళ్లారు. సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ బీసీ పరీడా, సూపరింటెండెంట్ ఆఫ్ సర్వే డేబబ్రత పాలిట్తో పాటు ఇతర అధికారులతో హైడ్రా ఉన్నతాధికారుల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సర్వే ఆఫ్…
జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. జమ్మూ ప్రాంతంలో బీజేపీ విజయం చారిత్రాత్మకమని, గతంలో కంటే ఎక్కువ సీట్లు మరియు ఓట్లు పొందామన్నారు. జమ్మూ ప్రజలు మాతో ఉన్నారని మరోసారి నిరూపితమైందని, కాంగ్రెస్ ముక్త జమ్మూకాశ్మీర్ సాధనలో మేం విజయం సాధించామని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర పార్టీ నాయకత్వ మార్గదర్శనంలో.. జమ్మూకశ్మీర్ రాష్ట్ర నాయకులు ఐకమత్యంతో అన్ని స్థాయిల్లో కష్టపడి పనిచేశారన్నారు కిషన్ రెడ్డి. జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో గతంలో ఎప్పుడు కూడా సంపాదించనన్ని…
ఇందిరమ్మ ప్రభుత్వం చారిత్రాత్మకంగా నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇవాళ ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ.. 11వ తేదిన ఇంటిగ్రేడెడ్ పాఠశాలలకు శంఖుస్థాపన చేయనున్నామన్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉంటుందని, ఎక్స్ట్రా కల్చరల్ ఆక్టివిటీస్, స్కూల్ లోనే థియేటర్ ఉంటుందని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నార భట్టి విక్రమార్క. తెలంగాణ మోడల్ దేశానికి ఆదర్శం కానున్నాయని, గత ప్రభుత్వం నెల వారీగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని…
ఈనెల 10న ట్యాంక్బండ్పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్న సీఎస్ శాంతి కుమారి తెలిపారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై దాదాపు పదివేల మంది మహిళలచే ఈనెల 10 వతేదీన సద్దుల బతుకమ్మ ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలియచేశారు. 10వ తేదీన నిర్వహించే సద్దుల బతుకమ్మ వేడుకల ఏర్పాట్ల పై నేడు సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. 10వ తేదీ సాయంత్రం 4…