బీజేపి ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియా నెంబర్ల నుంచే తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పేర్కొన్న ఆయన… లేపేస్తం… చంపేస్తాం.. బాంబ్ పెడతామంటూ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఆరోపించారు. క్రిమినల్స్ ను పట్టుకుంటున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి సోషల్ మీడియాలో, మీడియా లో ప్రమోట్ చేసుకుంటారని… మరి తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ కు సంబంధించిన నెంబర్లతో సహా పూర్తి వివరాలతో ఫిర్యాదు చేశా… మరి ఇప్పుడు డీజీపీ ఏం చేస్తారో…
మానవ సంపద నిర్వీర్యం కావడం తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్… హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల మహాదీక్షకు మద్దతు తెలిపిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2009 కేసీఆర్ దీక్ష విరమణ జరిగిన వార్త కేయూ 2వ గేటు వద్ద విన్నాను.. నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ ఉద్యమం జరిగింది. విద్యార్థి లోకం జాక్ గా ఏర్పడి దీక్షలు చేశారని గుర్తుచేశారు.. ఇక, మానవ సంపద నిర్వీర్యం కావడం…
సాధారణంగా ఎన్నికలు వస్తున్నాయంటే నేతలకు గుబులు పుడుతుంది. కానీ ఓటర్లకు మాత్రం పండగే. ముఖ్యంగా మందుబాబులకు. నామినేషన్ వేసింది మొదలు పోలింగ్ వరకు తాగినోడికి తాగినంత. రోజంతా మత్తులోనే. ఎవరిని పలకరించినా మాటలు మత్తు మత్తుగా వస్తాయి. ఊళ్లలో మద్యం ఏరులై పారుతుంది. ఉప ఎన్నికలు జరుగుతున్న హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు అదే జరుగుతోంది. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాలేదు. కానీ ఎక్కడ చూసినా పండగ వాతావరణమే. ఎన్నికలు ఎప్పుడైనా పెట్టనీ అప్పటి వరకు…
బండి సంజయ్ సంగ్రామ యాత్రలో కొత్త కమలాలు కనిపిస్తున్నాయా? పాత వాసనలు.. పాతకాలపు పోకడలకు చెక్ పెట్టారా? లేక వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారా? మారిన పరిణామాలు పార్టీసారథికి.. బీజేపీకి వర్కవుట్ అవుతాయా? సంజయ్ యాత్రలో కనిపిస్తున్న సిత్రాలపై చర్చ! యాత్ర అనే పేరు లేకుండా బీజేపీని ఊహించలేం. రథయాత్ర ద్వారా దేశంలో పార్టీ బలోపేతం కావడంతో.. ఇప్పుడు తెలంగాణలో బీజేపీని పటిష్ఠం చేయడానికి ప్రజా సంగ్రామ యాత్రను నమ్ముకున్నారు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఆగస్టు 28న…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్.. హన్మకొండ జిల్లా కమలాపూర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బండి సంజయ్ది పాదయాత్ర కాదు విహారయాత్ర అని ఎద్దేవా చేశారు.. కాళేశ్వరం ఫలితాలను సంజయ్ చూస్తున్నారని.. పాదయాత్రలో ప్రజలు సమస్యలు చెప్పడం లేదన్న ఆయన.. కేసీఆర్ ప్రభుత్వ పథకాలతో సంతోషంగా ఉన్నామని బండి సంజయ్ కి ప్రజలే చెబుతున్నారని.. ఇకనైనా కేసీఆర్పై విమర్శలు మానుకోవాలని…
మా లక్ష్యం ఒక్కటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదు అన్నారు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్రావు… స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం 64 ఏళ్ల వయస్సులో విజయసాయి రెడ్డి పాదయాత్ర చేశారు. 70 ఏళ్ల వయస్సులో గాజువాక ఎమ్మెల్యే కూడా నిర్వాసితుల కోసం పాదయాత్ర చేశారు.. సీఎం వైఎస్ జగన్ ఇప్పటికి 3 సార్లు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు రాశారని గుర్తుచేశారు.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశామన్న ఆయన.. అయితే, ఢిల్లీలో…
త్వరలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సెమీఫైనల్ గా ఈ ఎన్నికలను అన్ని పార్టీలు భావిస్తున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లోని అధికార, విపక్ష పార్టీలన్నీ అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బీజేపీ తమ సీఎం అభ్యర్థులను సైతం మార్చివేసి తగ్గేదేలే అని చాటిచెబుతోంది. ఇదే ఫార్మూలాను తాజాగా కాంగ్రెస్ సైతం అవలంభిస్తుండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో మున్ముందు ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది. పంజాబ్, ఉత్తరాఖండ్,…
ఆరు సార్లు ఈటల రాజేందర్ను ఎమ్మెల్యేగా గెలిపించారు.. ఇప్పుడు రెండేళ్ల కోసం గెల్లు శ్రీనివాస్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఆర్థిక మంత్రి హరీష్రావు.. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పలువురు ఇతర పార్టీలకు చెందిన నేతలు టీఆర్ఎస్లో చేరారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హరీష్రావు మాట్లాడుతూ.. మోత్కులగూడెం 90శాతం టీఆర్ఎస్ వైపు వచ్చిందన్నారు.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో రెండేళ్ల కోసం గెల్లు శ్రీనివాస్ను గెలిపించాలని కోరారు.. 18 ఏళ్లలో మీకు ఈటల చేయని పని, మీ…
మహారాష్ట్ర రాజకీయాల్లో త్వరలోనే కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇటీవల ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే ఆయన యూటర్న్ తీసుకోబోతున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం శివసేన పార్టీ కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి ఈ సమీకరణాలు మరోసారి మారుతాయనే ప్రచారం జోరందుకుంది. ఇందుకు తగ్గట్టుగానే ఉద్దవ్ థాక్రే వ్యాఖ్యలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.…
పశ్చిమ బెంగాల్లో బీజేపీకి దెబ్బమీద దెబ్బ తగులుతున్నాయి. బెంగాల్ ఎన్నికల తరువాత తృణమూల్ నుంచి వచ్చిన కొంతమంది నేతలు తిరిగి ఆ పార్టీలో చేరిపోయారు. తాజాగా మాజీకేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో కూడా తృణమూల్లో చేరడంతో బీజేపీ అధిష్టానం సీరియస్ అయింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ను తప్పించి ఆ స్థానంలో ఎంపీ సుకంత మజుందర్ను నియమించింది. వెస్ట్ బెంగాల్ చీఫ్ నుంచి పక్కకు తప్పుకున్న దిలీప్ ఘోష్కు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా…