Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Will National Leaders Come For The Huzurabad Campaign

హుజురాబాద్ ప్రచారానికి జాతీయ నాయకులు వస్తారా.?

Published Date :October 7, 2021 , 5:32 pm
By Lakshmi Narayana
హుజురాబాద్ ప్రచారానికి  జాతీయ నాయకులు వస్తారా.?
  • Follow Us :
  • google news
  • dailyhunt

హుజురాబాద్‌లో బీజేపీ తరఫున ప్రచారానికి జాతీయ నాయకులు వస్తారా.. లేదా? EC ఆంక్షలు చూశాక కమలనాథులు మార్చిన వ్యూహం ఏంటి? అనుకున్నదొక్కటీ.. అయ్యిందొక్కటా? బీజేపీ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి?

బీజేపీ నేతల దూకుడికి ఈసీ ఆంక్షలు బ్రేక్‌..!

ఉపఎన్నిక షెడ్యూల్‌ రాకమునుపే హుజురాబాద్‌లో ప్రచారం ప్రారంభించింది బీజేపీ. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిశాక.. ప్రచారాన్ని మరో అంకానికి తీసుకెళ్లే పనుల్లో ఉన్నారు కమలనాథులు. రాష్ట్రస్థాయి నాయకులు.. సీనియర్‌ నేతలు.. పార్టీ కేడర్‌ ఇప్పటికే నియోజకవర్గంలో మోహరించాయి. వీటన్నింటికీ తోడుగా జాతీయ నాయకులు, కేంద్రమంత్రులను హుజురాబాద్‌కు తీసుకొచ్చి ప్రచారం చేయించాలని ప్రణాళికలు వేసుకుంది బీజేపీ. సెప్టెంబర్‌ 17 నిర్మల్‌ సభతో శ్రేణుల్లో కొంత ఊపు వచ్చిందని.. ఇప్పుడు ఢిల్లీ నేతలు వస్తే ఇంకా హుషారు వస్తుందని అనుకున్నారు. కానీ.. కమలనాథుల దూకుడికి బ్రేక్‌లు వేసింది కేంద్ర ఎన్నికల సంఘం. కరోనాను దృష్టిలో పెట్టుకుని ప్రచారానికి కఠిన ఆంక్షలు పెట్టింది ఈసీ. అవి చూశాక కాషాయ శిబిరం కాస్త నిరుత్సాహ పడిందట.

వెయ్యి మందితో ఢిల్లీ నేతల సభలంటే తేలిపోతాయా?

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మొదలుకొని.. పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేసీ నడ్డాను తీసుకురావాలని పార్టీలో పెద్ద చర్చ జరిగిందట. వీరంతా వస్తే బీజేపీ ప్రచారం తారాస్థాయికి చేరుకుంటుందని లెక్కలేసుకున్నారు నాయకులు. కానీ.. ఈసీ ఆంక్షల వల్ల ఢిల్లీ పెద్దలు వచ్చే పరిస్థితి లేదట. బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్రను మొదటి విడత ముగింపు సభను హుజురాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించాలని అనుకున్నా.. అప్పటికే ఉపఎన్నిక షెడ్యూల్‌ రావడంతో వేదికను హుస్నాబాద్‌కు మార్చుకున్నారు. EC ఆంక్షల ప్రకారం.. వెయ్యి మందితోనే సభలు పెట్టుకోవాలి. రోడ్‌ షోలకు అనుమతి లేదు. ఢిల్లీ స్థాయిలో పార్టీ నేతలు ప్రచారానికి వస్తే.. భారీగా జనసమీకరణ చేస్తారు. కానీ.. ఇప్పుడా పరిస్థితి లేదు. భారీ జన సమీకరణ లేకుండా.. వారి ప్రచారం పేలవంగా సాగితే అది ప్రతికూల ప్రభావం పడుతుందని బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారట.

రోడ్‌ షోలకు అనుమతి లేకపోవడంతో జాతీయ నేతలు రాకపోవచ్చు..!

ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయ నేతలతోపాటు.. అమిత్‌షా వంటి వారు రోడ్‌ షోలకు ప్రాధాన్యం ఇస్తారు. ఇప్పుడు రోడ్‌ షోలకే అనుమతి లేకపోవడంతో.. హస్తిన నుంచి నేతల రాకపోకలు ఉండొచ్చని టాక్‌. ఇప్పుడు ప్రచార బాధ్యతంతా తెలంగాణ బీజేపీ నేతలదే. అందుకే EC ఆంక్షలకు లోబడి ప్రచారం ఎలా చేయాలి? ఓటర్ల అటెన్షన్‌ తీసుకొచ్చేలా ప్రచారం ఉండాలంటే ఎలా? అనేదానిపై నాయకులు కుస్తీ పడుతున్నారట. ఇది ఒక్క బీజేపీకి వచ్చిన సంకటమే కాదు.. కాంగ్రెస్‌దీ అదే పరిస్థితి. అధికార టీఆర్ఎస్‌కూ ఇబ్బందే. ఒకవేళ కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లలో వేటికైనా భారీ బహిరంగ సభకు EC అనుమతిస్తే.. వెంటనే బీజేపీ నుంచి జాతీయ నేతలను రంగంలోకి దించాలనే యోచన ఉందట.

మాటలతోనే ప్రచార వేడి రగిలిస్తారా?

ఆర్భాటపు ప్రచారానికి అవకాశం లేకపోవడంతో.. మాటలతోనే ఉపఎన్నికల వేడి రగిలించేందకు దృష్టి పెట్టినట్టు సమాచారం. రాజకీయంగా, అభివృద్ధి పరంగా.. స్థానికంగా సమస్యలేంటి? వాటిని ఏ విధంగా ప్రచారంలోకి తీసుకురావాలి? అనేదానిపై ఒకింత కసరత్తు చేస్తున్నారట. మరి.. కమలనాథుల ప్లాన్‌ ఏ మేరకు వర్కవుట్‌ అవుతుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • Etala Rajender
  • Huzurabad by-election
  • off the record

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions