వరుణ్ గాంధీ, మేనకా గాంధీలకు బీజేపీ బిగ్ షాక్.. కారణం ఇదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంపీలు వరుణ్ గాంధీ, మేనకా గాంధీలకు షాకిచ్చింది భారతీయ జనతా పార్టీ.. 80మందితో బీజేపీ జాతీయ కార్యనిర్వాహక కమిటీని ఆ పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. కమిటీలో ప్రధాని నరేంద్ర మోడీ, ఎల్కే అద్వానీ, డాక్టర్ మురళీమనోహర్ జోషీ, రాజ్నాథ్సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ సహా పలువురు కీలక నేతలు ఉన్నారు. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు నేతలకు చోటు దక్కింది. ఏపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ, తెలంగాణ నుంచి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జితేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, గరికపాటి రామ్మోహన్రావులకు అవకాశం లభించింది. ఇక, జాతీయ కార్యవర్గ కమిటీకి ప్రత్యేక ఆహ్వానితులుగా 50 మంది, ఎక్స్ అఫిషియో సభ్యులుగా 179 మందిని ఎంపిక చేశారు. ఇక ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ నుంచి విజయశాంతి, ఈటల రాజేందర్కు అవకాశం దక్కింది. వచ్చే నెల7న బీజేపీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ ఢిల్లీలో భేటీ కానుంది. దాదాపు రెండేళ్ల తర్వాత సమావేశం అవుతోంది.
అయితే, ఎంపీలు వరుణ్ గాంధీ, మేనకా గాంధీలకు బీజేపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. వరుణ్ గాంధీ ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలతో పాటు లఖీంపూర్ హింసాత్మక ఘటనలపై తన నిరసన గళం వినిపిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేనకా గాంధీ, వరుణ్ గాంధీలను జాతీయ కార్యవర్గ కమిటీ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి అయినా ఎదురు కావొచ్చు.. కానీ, బీజేపీ హై కమాండ్, కేంద్రం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించడంతోనే.. వారికి ఈ పరిస్థితి వచ్చిందనే టాక్ నడుస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!