బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టేందుకు పోలీసులు సిద్ధం అయినట్టు తెలుస్తోంది.. ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీల కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317కు వ్యతిరేకంగా… బండి సంజయ్ తలపెట్టిన దీక్షను భగ్నం చేశారు పోలీసులు.. కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో జాగరణ దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు బండి సంజయ్.. ఓవైపు దీక్షకు మద్దతుగా జిల్లాల నుంచి వస్తున్న నేతలను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.. మరోవైపు.. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య కార్యాలయం బండి సంజయ్ని తీసుకెళ్లారు కార్యకర్తలు.. గేటుకు తాళం వేశారు.. అలా కార్యాలయంలో సంజయ్ జాగరణ దీక్షను ప్రారంభించారు. ఇక, సంజయ్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేయగా.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. రాత్రి పదిన్నర గంటలకు తలుపులు, అద్దాలు బద్దలుకొట్టి.. లోపలికి వెళ్లి సంజయ్ని అరెస్ట్ చేశారు..
Read Also: పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి కరోనా
ఇక, తాజా సమాచారం ప్రకారం.. బండి సంజయ్పై నాన్ బెయిలబుల్ కేసుల నమోదుకు సిద్ధమయ్యారు పోలీసులు.. వైద్య పరీక్షల అనంతరం రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది.. ఉదయం 11 గంటలకు బండి సంజయ్ ను కోర్టుకు తీసుకెళ్ళేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు.. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘన, పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ పలు కేసులు బండి సంజయ్పై నమోదు చేసే అవకాశం ఉంది..