తెలంగాణ BJP అనుబంధ విభాగాలు ఉన్నాయి. ఈ అనుబంధ మోర్చా లన్నింటికి కమిటీలు కూడా ఉన్నాయి. యువజన మోర్చ, మహిళా, కిసాన్, దళిత, గిరిజన, OBC, మైనార్టీ మోర్చా లు BJPకి ప్రధాన అనుబంధ విభాగాలు. అయితే… ఇందులో కొన్ని మోర్చాలు తమ పరిధిలో జరుగుతున్న వ్యవహారాన్ని అస్సలు పట్టించుకోవడం లేదట. పార్టీ చెప్పేంత వరకు కనీసం స్పందించడం లేదట. తాము ఉన్నామని చెప్పుకునేందుకు ఏదో పార్టీ ఇచ్చిన ప్రోగ్రాంలు అప్పడప్పుడు చేస్తున్నారని లోకల్ టాక్. ప్రధానంగా…
బీజేపీ నేత నుపుర్ శర్మ.. మహమ్మద్ ప్రవక్తపై చేసిన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి… ఓవైపు ముస్లిం దేశాల నుంచి భారత్పై తీవ్ర వ్యతిరేకత.. మరోవైపు ఉగ్రవాద సంస్థల నుంచి బెదిరింపులు.. మహమ్మద్ ప్రవక్తను కించపరిచేలా నుపుర్ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశానికే ముప్పు తలపెట్టేలా మారగా.. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ నుపుర్ శర్మ అనుచిత వ్యాఖ్యలకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించిన విషయం తెలిసిందే.. తాజాగా, భారత్పై సైబర్ ఎటాక్స్ మొదలయ్యాయి.. దీనికి…
బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఊరు మన బడికి కేంద్రం నిధులు ఇచ్చిందని బీజేపీ నేతలు చెబుతున్నారని, కార్యక్రమానికి రూ. 2700కోట్లు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన పైసలు ఎక్కడ విడ్త్రా చేసుకోవాలో బండి సంజయ్ చెప్పాలని సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. ఒక పక్క టెట్ వాయిదా వేయాలంటూనే మరో 20వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలంటున్నారని, బండి సంజయ్ బాధ్యతగా…
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. అరబ్ సమాజం కూడా ఈ వ్యాఖ్యలపై భారత్ కు తమ నిరసన తెలిపాయి. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మను శిక్షించాలని అంటూ శుక్రవారం ప్రార్థనల తర్వాత పలు ప్రాంతాల్లో నిరసలు, ఆందోళనలు చెలరేగాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో నిరసలు హింసాత్మకంగా మారాయి. పశ్చిమ బెంగాల్ హౌరాలో, జార్ఖండ్ రాంచీలో, యూపీ ప్రయాగలో హింసాత్మక ఘటనలు…
బీజేపీ నేత డీకే అరుణ సంచలన కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు సిద్ధం అవుతోందని ఆమె అన్నారు. ప్రజలకు ఇచ్చిన హమీలను కేసీఆర్ తుంగలో తొక్కి మరోసారి ఎన్నికల్లో ప్రజలను మోసగించేందికు సిద్దమవుతున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో బలపడుతున్న బీజేపీని అడ్డుకునేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా,సంక్షేమ పథకాలను ప్రజలకు కార్యకర్తలు విధిగా తెలియజేయాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో అమలు చేయకపోవడంతో పేదలు వైద్యం కోసం ఇబ్బంది పడుతున్నారని…
టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ పై ఘాటు విమర్శలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. మహబూబ్ నగర్ పర్యటనలో ఉన్న ఆయన కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోవటం..బీజేపీ గెలువటం ఖాయమని జోస్యం చెప్పారు. ఒకసారి టీఆర్ఎస్ ఓడిపోతే మళ్లీ గెలిచే అవకాశం లేదని స్పష్టం చేశారు. గోల్ మాల్ చేయాలనుకున్నప్పుడు..ప్రజలను తప్పుదోవ పట్టించాలన్నప్పుడు కేసీఆర్ మీడియా ముందుకు వస్తాడని విమర్శించారు. కేసీఆర్ కు నేను..నా కుటుంబమనే ఆహం పెరిగిందని అన్నారు.…
టీఆర్ఎస్, బీజేపీ పార్టీ మధ్య మాటల యుద్ధం జరుతూనే ఉంది. ఇటీవల కేసీఆర్ జాతీయ పార్టీ పెడతారనే విషయం చర్చకు రావడంతో బీజేపీ విమర్శలకు దిగింది. అసలు కేసీఆర్ తెలంగాణకు ఏం చేశారో చెప్పాలనంటూ బీజేపీ డిమాండ్ చేసింది. ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. ప్రధాని కావాలని అందరికీ కోరిక ఉంటుందని, 2024లో కూడా నరేంద్ర మోదీనే ప్రధాన మంత్రి అని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర…
తెలంగాణ రాష్ట్ర సమితి పేరు త్వరలో భారత్ రాష్ట్రీయ సమితిగా మారనుంది. త్వరలో సీఎం కేసీఆర్ కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు. దానికి భారత్ రాష్ట్రీయ సమితి అని పేరు పెట్టనున్నారు. దీనికి కారు గుర్తునే కొనసాగించాలని కేసీఆర్ భావిస్తున్నారు. పార్టీ పేరు మార్పు, బైలాస్లో మార్పులపై విస్తృతస్థాయి సమావేశంలో చర్చించనున్నారు. దీనికి సంబంధించి ఎన్నికల సంఘంతో TRS ఇప్పటికే చర్చలు పూర్తి చేసింది. గులాబీ బాస్ ఆలోచనలు చూస్తుంటే TRS కాస్తా.. అతి త్వరలోనే BRSగా మారనుండటం…
బీజేపీ గురించి ఇతర దేశాల రాయబారులు తెలుసుకునే విధంగా ‘ బీజేపీని తెలుసుకోండి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అత్యున్నత ప్రజాస్వామ్య దేశాన్ని నడుపుతున్న బీజేపీ పార్టీ గురించి దేశాల రాయబారులు తెలుసుకునేలా పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పలు దేశాల రాయబారులతో సమావేశం అయ్యారు. శనివారం ఈ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యలయలో 13 దేశాలకు చెందిన రాయబారులతో జేపీ నడ్డా సమావేశం అయ్యారు. బీజేపీ చరిత్ర, అభివృద్ధి పయనాన్ని తెలిపే డాక్యుమెంటరీని రాయబారులకు ప్రదర్శించారు.…
విచారణ ముసుగులో గాంధీ కుటుంబం కి నోటీసులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, అబద్దాల పునాదుల మీద అధికారాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవాలని బీజేపీ కుట్ర చేస్తోందని TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కావాలనే గాంధీకుటుంబాన్నిఅవమానించాలని చూస్తుంది. అందుకే మూత పడిన కేసును..మళ్లీ విచారణ కి తేవడం బీజేపీ కుట్రలో భాగమే అని రేవంత్ మండిపడ్డారు. అయితే నేషనల్ హెరాల్డ్ పత్రిక మూయించాలని మోడీ కుట్ర చేశారని,13 న రాహుల్ గాంధీ..23 న సోనియా గాంధీ ED ముందు…