Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Revanth Reddy Revanth Showered Criticism On Kcr

Revanth Reddy: KCR పై విమర్శల వర్షం కురిపించిన రేవంత్..

Published Date :June 11, 2022 , 9:12 pm
By Lakshmi Narayana
Revanth Reddy: KCR పై విమర్శల వర్షం కురిపించిన రేవంత్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

విచారణ ముసుగులో గాంధీ కుటుంబం కి నోటీసులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, అబద్దాల పునాదుల మీద అధికారాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవాలని బీజేపీ కుట్ర చేస్తోందని TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కావాలనే గాంధీకుటుంబాన్నిఅవమానించాలని చూస్తుంది. అందుకే మూత పడిన కేసును..మళ్లీ విచారణ కి తేవడం బీజేపీ కుట్రలో భాగమే అని రేవంత్ మండిపడ్డారు.

అయితే నేషనల్ హెరాల్డ్ పత్రిక మూయించాలని మోడీ కుట్ర చేశారని,13 న రాహుల్ గాంధీ..23 న సోనియా గాంధీ ED ముందు హాజరు అవుతారు. అక్రమంగా..అన్యాయంగా రాహుల్ గాంధీని ED విచారణకు పిలిచారు. ఇందులో పైశాచిక ఆనందం పొందుతున్న అమిత్ షా..మోడీ కుట్రలను త్వరలోనే ఛేదిస్తామని రేవంత్ తెలిపారు. ఇందులో భాగంగానే శాంతియుత నిరసన చేపట్టి ED ఆఫీస్ వరకు పాదయాత్ర గా వెళ్తాం. నెక్లెస్ రోడ్ నుండి ED కార్యాలయం వరకు పాదయాత్రగా ర్యాలీ చేపడుతాం అని ,ఇందిరాగాంధీ విగ్రహం వద్దకు కార్యకర్తలు తరలి రండి అని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.

ఇక తెలంగాణ కు..సోనియా గాంధీకి పేగు బంధం ఉందని, హైదరాబాద్ లో మైనర్ లపై గ్యాంగ్ రేప్ లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయి. MIM, TRS,BJP కలిసి సమస్యను పక్కదారి పట్టించే పని చేస్తున్నారు. గడిచిన వారంలో 15 మందిపై అత్యాచారాలు జరిగాయి. ప్రభుత్వమే నేరాల కు పాల్పడుతున్నది. ప్రభుత్వ పెద్దల పిల్లలే అత్యాచారం లో ఉన్నారు. అసద్ దేశం లో ఎక్కడ ఏం జరిగిన స్పందిస్తారు. మరి అత్యాచారాలపై ఎందుకు స్పందించరు. అత్యాచారాల పై కెసిఆర్ ఎందుకు స్పందించరు. అత్యాచారాలు చేసేవాళ్ల కండ్లు పికుత అన్నావు కదా ..మరి MIM నాయకుల పిల్లలు అత్యాచారం చేస్తే కనీసం స్పందించవా..? కొత్త పార్టీ మీద చర్చ చేస్తున్నారు కానీ… అత్యాచారాల పై మాత్రం స్పందించరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.

ఇక ఈ నెల 15న హైదరాబాద్ బచావో నినాదంతో నగరంలోని శాంతి భద్రతలపై అఖిల పక్షాన్ని ఏర్పాటు చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. రచ్చ బండ కార్యక్రమం జూలై 7 వరకు పొడగిస్తున్నట్టు తెలిపిన రేవంత్ ..కేసీఆర్ వ్యవహారం అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మానందంలా ఉంది. అందులో బ్రహ్మానందం రేడియేటర్ సినిమాలా ఉంది కేసీఆర్ పరిస్థితి. కేసీఆర్ కూడా అనుకోకుండా తెలంగాణ కు సీఎం అయ్యారు అని, కొంత కాలానికి ప్రజలే టీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇస్తారు. గజ్వేల్ ఫాంహౌసే కేసీఆర్ కు ప్రపంచం అవుతోంది అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
.
త్వరలోనే TRS ను BRS చేస్తా అన్నాడు. కానీ ప్రజలు VRS ఇస్తారు అని అన్నారు. కాంగ్రెస్ లేదన్నప్పుడు..కాంగ్రెస్ కాళ్లు ఎందుకు పట్టుకుంటున్నారు. పొత్తు పెట్టుకుంటా అని ఎందుకు తిరుగుతున్నారు. ఆయనకు ఉన్న ఎమ్మెల్యే లు 100 మంది..అందులో సగం లంగలే..TRS పేరుతో దేశం అంతా పోటీ చేయొచ్చు కదా..? మరి BRS ఎందుకు? TRS మీద బ్యాన్ ఉందా..? లేక TRS దుకాణం దివాలా తీసింది కాబట్టి BRS పెట్టిండా..?చివరికి కెసిఆర్..ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి వెళ్తారు.. అని విమర్శించారు రేవంత్.

ఇప్పటికే కెసిఆర్ ఎన్నో కథలు చెప్పారు. అన్నీ ప్రాంతాలు తిరిగి వచ్చి..ఇప్పుడు మళ్లీ కథలు చెప్పిండు.NTR నీ తిట్టింది ఆయనే… మళ్లీ ఇప్పుడేమో మోస్తున్నారు.. కెసిఆర్ మాటలు చిత్తు కాగితం తో సమానం. ఇక కెసిఆర్ నీ ఇంటికి పంపించాలని ప్రజలు డిసైడ్ అయ్యారు. తెలంగాణలో కెసిఆర్ ఎక్స్పైర్డ్ మెడిసిన్ ఇక్కడ ఆయన కాలం చెల్లిపోయింది. కాలం చెల్లిన మెడిసిన్ వాడితే ఎలా రియాక్షన్ వస్తుందో..కెసిఆర్ తో కూడా అంతే. కెసిఆర్ నీ జాతీయ రాజకీయాల్లో..జోకర్ లెక్క చూస్తున్నారు. నెల్లూరు లో ఉప ఎన్నిక ఉంది. జాతీయ రాజకీయాల్లో మక్కువ కెసిఆర్ కి ఉంటే..నెల్లూరు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారా..? అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • MP Revanth Reddy
  • TPCC Chief
  • TRS

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates: అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ల దాడి..

  • Earthquake: ఇరాన్, లెబనాన్‌లో భూప్రకంపనలు.. కారణమిదేనా?

  • క్లాసిక్ స్టైల్‌కు మోడర్న్ టచ్.. Yezdi Roadster Red Wolf Edition భారత్‌లో లాంచ్..!

  • Bobbillanka Murder: బొబ్బిల్లంకలో జంట హత్యలు.. భార్య, అత్తను నరికి చంపిన వ్యక్తి

  • Kollywood : ఆ దర్శకుడు చేసినవీ రెండే సినిమాలు కానీ యూత్‌లో ఫుల్ క్రేజ్

  • China-Iran: యుద్ధంలోకి చైనా! ఇరాన్‌కు డ్రాగన్ మద్దతు

ట్రెండింగ్‌

  • IND Playing 11 vs ENG: ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్‌.. భారత జట్టులో కీలక మార్పు, ఆ స్టార్ ప్లేయర్ అవుట్!

  • రూ. 4,000 డిస్కౌంట్‌తో పాటు ఉచిత ఇయర్‌బడ్స్.. నేటి నుంచి iQOO 15R సేల్ షురూ..!

  • 144Hz డిస్‌ప్లే, 50MP+50MP+50MP కెమెరాలు, 6500mAh బ్యాటరీతో Tecno Camon 50 Ultra 5G లాంచ్..!

  • మరింత పవర్, మెరుగైన పనితీరు.. iPad Air (8th Gen) లాంచ్.. ధర ఎంతంటే?

  • Holi: చెడుపై మంచికి జయం.. భారతీయ సంస్కృతికి సజీవ ప్రతిబింబం హోలీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions