Jamaat Ulama-e-Hind: ఇస్లాం ప్రకారం నుపుర్ శర్మను క్షమించాలి.. ఫత్వా జారీ చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. అరబ్ సమాజం కూడా ఈ వ్యాఖ్యలపై భారత్ కు తమ నిరసన తెలిపాయి. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మను శిక్షించాలని అంటూ శుక్రవారం ప్రార్థనల తర్వాత పలు ప్రాంతాల్లో నిరసలు, ఆందోళనలు చెలరేగాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో నిరసలు హింసాత్మకంగా మారాయి. పశ్చిమ బెంగాల్ హౌరాలో, జార్ఖండ్ రాంచీలో, యూపీ ప్రయాగలో హింసాత్మక ఘటనలు చెలరేగాయి.
ఇదిలా ఉంటే గత రెండు రోజులుగా జరుగుతున్న ఆందోళనపై జమాత్ ఉలేమా ఎ హింద్ సమావేశం ఏర్పాటు చేసింది. ఇస్లాం ప్రకారం నుపుర్ శర్మను క్షమించాలని అధ్యక్షుడు సుహైబ్ ఖాస్మీ అన్నారు. దేశ వ్యాప్తంగా జరిగిన హింసను జమాత్ ఉలేమా ఏ హింద్ ప్రతినిధులు ఖండించారు. చట్టాన్ని మా చేతిలోకి తీసుకోవడం లేదని అన్నారు. బీజేపీ నుపుర్ శర్మను సస్పెండ్ చేయాడాన్ని ముస్లిం ప్రతినిధులు స్వాగతించారు. రోడ్డుపైకి వచ్చి నిబంధనలను ఉల్లఘించడాన్ని మేము అనుమతించం అని చెప్పారు.
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్పింగ్కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
నుపుర్ శర్మ వ్యాక్యలపై ఎలాంటి హింసకు దిగవద్దని ‘ఫత్వా’ను కూడా జారీ చేస్తామని అన్నారు. అసదుద్దీన్ ఓవైసీ, మహ్మద్ మదానీలకు వ్యతిరేఖంగా ఫత్వా వస్తుందని జమాత్ ఉలేమా ప్రతినిధులు వెల్లడించారు. దీంతో పాటు ముస్లిం సంస్థలు, వాటికి నిధుల సమకూర్చడంపై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. హింసను ప్రేరేపించడాన్ని ముస్లిం సంస్థలు అనుమతించబోవని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
ఇటీవల ఓ టీవీ డిబెట్ కార్యక్రమంలో నుపుర్ శర్మ, మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఖతార్, మలేషియా, ఇరాక్, లెబనాన్, బ్రూనై, యూఏఈ, సౌదీ వంటి అరబ్ దేశాలు భారత్ కు తమ నిరసనను తెలియజేశాయి. అయితే దీనికి సమాధానంగా భారత విదేశాంగ శాఖ.. వ్యక్తులు చేసిన ప్రకటనలను ప్రభుత్వానికి ఆపాదించవద్దని సూచించింది.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!