Cyber Attacks: నుపుర్ శర్మ ఎఫెక్ట్,, భారత్పై సైబర్ ఎటాక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ నేత నుపుర్ శర్మ.. మహమ్మద్ ప్రవక్తపై చేసిన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి… ఓవైపు ముస్లిం దేశాల నుంచి భారత్పై తీవ్ర వ్యతిరేకత.. మరోవైపు ఉగ్రవాద సంస్థల నుంచి బెదిరింపులు.. మహమ్మద్ ప్రవక్తను కించపరిచేలా నుపుర్ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశానికే ముప్పు తలపెట్టేలా మారగా.. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ నుపుర్ శర్మ అనుచిత వ్యాఖ్యలకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించిన విషయం తెలిసిందే.. తాజాగా, భారత్పై సైబర్ ఎటాక్స్ మొదలయ్యాయి.. దీనికి ప్రధాన కారణం కూడా నుపుర్ శర్మ కామెంట్స్గానే తెలుస్తోంది..
భారత్లో ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలపై సైబర్ దాడులు జరుగుతున్నాయి.. హ్యాక్టివిస్ట్ గ్రూప్ డ్రాగన్ఫోర్స్ మలేషియాచే నిర్వహించబడిన దాడులు, ఇతర ఆన్లైన్ ప్లాట్ఫారమ్లలో ఇజ్రాయెల్లోని భారత రాయబార కార్యాలయం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ యొక్క ఈ-పోర్టల్ను లక్ష్యంగా చేసుకున్నాయి. మొత్తంగా భారత వెబ్సైట్లపై సైబర్ దాడులు జరిగాయి.. దేశవ్యాప్తంగా పోర్టల్స్తో సహా 70 వెబ్సైట్లను హ్యాక్ చేశారు.. కురుదేశ్ కోరడ్స్ పేరుతో ఈ దాడులు జరిగినట్టు గుర్తించారు.. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, భవన్లు మరియు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర కళాశాలల వంటి ప్రముఖ విద్యాసంస్థలను కూడా వదిలిపెట్టలేదు. ఒక్క మహారాష్ట్రలోనే 50కి పైగా వెబ్సైట్లు ధ్వంసమైనట్లు గుర్తించారు. ఆడియో క్లిప్లు మరియు టెక్స్ట్ల ద్వారా ఒక సందేశాన్ని పంపించారు.. మీ కోసం మీ మతం మరియు నాకు నా మతం.. ముస్లిం హ్యాకర్లు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హ్యాకర్లు, మానవ హక్కుల సంస్థలు మరియు కార్యకర్తలు భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించాలని కూడా పిలుపునిచ్చారు హ్యాకర్లు.
Also Read
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
- Nirmala Sitharaman: యూపీఐపై గుడ్న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
హైదరాబాద్కు చెందిన అగ్రిటెక్ కంపెనీలపై సైబర్ దాడులు జరిగినట్టు గుర్తించారు. ఇజ్రాయెల్లోని భారత రాయబార కార్యాలయ వెబ్సైట్ను ఆదివారం నాటికి భారత అధికారులు పునరుద్ధరించగలిగారు. అయితే ఐసీఏఆర్ పేజీలలో ఒకటి ఇప్పటికీ పునరుద్ధరించలేకపోయినట్టుగా సమాచారం.. జూన్ 8 నుంచి 12 మధ్య భారత ప్రభుత్వ వెబ్సైట్లు, అలాగే ప్రైవేట్ పోర్టళ్లపై సైబర్ ఎటాక్ జరిగినట్టు నిపుణులు నిర్ధారించారు.. అదే హ్యాక్టివిస్ట్ గ్రూప్ ద్వారా భారతదేశంలోని ప్రముఖ బ్యాంకుల సర్వర్లను కూడా హ్యాక్ చేసే ప్రయత్నాలు జరిగినట్లు భద్రతా నిపుణులు సూచించారు.
తాజావార్తలు
-
God Of War : ‘డ్రాగన్’ తర్వాత కొత్త ప్రాజెక్ట్పై ఎన్టీఆర్ ఫోకస్
-
Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..
-
Trump: యుద్ధంపై ట్రంప్ మరోసారి కీలక ప్రకటన.. ఇరాన్ రియాక్షన్ ఇదే!
-
Sakshi Chaudhary: కోహ్లీ వల్లే ఆటపై ఫోకస్ పెట్టా.. కామన్వెల్త్ స్వర్ణ విజేత సాక్షి చౌదరి ఎమోషనల్ కామెంట్స్
-
Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్కు ఫిల్మ్ ఫెడరేషన్ బిగ్ షాక్
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!