Cyber Attacks: నుపుర్ శర్మ ఎఫెక్ట్,, భారత్పై సైబర్ ఎటాక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ నేత నుపుర్ శర్మ.. మహమ్మద్ ప్రవక్తపై చేసిన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి… ఓవైపు ముస్లిం దేశాల నుంచి భారత్పై తీవ్ర వ్యతిరేకత.. మరోవైపు ఉగ్రవాద సంస్థల నుంచి బెదిరింపులు.. మహమ్మద్ ప్రవక్తను కించపరిచేలా నుపుర్ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశానికే ముప్పు తలపెట్టేలా మారగా.. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ నుపుర్ శర్మ అనుచిత వ్యాఖ్యలకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించిన విషయం తెలిసిందే.. తాజాగా, భారత్పై సైబర్ ఎటాక్స్ మొదలయ్యాయి.. దీనికి ప్రధాన కారణం కూడా నుపుర్ శర్మ కామెంట్స్గానే తెలుస్తోంది..
భారత్లో ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలపై సైబర్ దాడులు జరుగుతున్నాయి.. హ్యాక్టివిస్ట్ గ్రూప్ డ్రాగన్ఫోర్స్ మలేషియాచే నిర్వహించబడిన దాడులు, ఇతర ఆన్లైన్ ప్లాట్ఫారమ్లలో ఇజ్రాయెల్లోని భారత రాయబార కార్యాలయం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ యొక్క ఈ-పోర్టల్ను లక్ష్యంగా చేసుకున్నాయి. మొత్తంగా భారత వెబ్సైట్లపై సైబర్ దాడులు జరిగాయి.. దేశవ్యాప్తంగా పోర్టల్స్తో సహా 70 వెబ్సైట్లను హ్యాక్ చేశారు.. కురుదేశ్ కోరడ్స్ పేరుతో ఈ దాడులు జరిగినట్టు గుర్తించారు.. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, భవన్లు మరియు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర కళాశాలల వంటి ప్రముఖ విద్యాసంస్థలను కూడా వదిలిపెట్టలేదు. ఒక్క మహారాష్ట్రలోనే 50కి పైగా వెబ్సైట్లు ధ్వంసమైనట్లు గుర్తించారు. ఆడియో క్లిప్లు మరియు టెక్స్ట్ల ద్వారా ఒక సందేశాన్ని పంపించారు.. మీ కోసం మీ మతం మరియు నాకు నా మతం.. ముస్లిం హ్యాకర్లు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హ్యాకర్లు, మానవ హక్కుల సంస్థలు మరియు కార్యకర్తలు భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించాలని కూడా పిలుపునిచ్చారు హ్యాకర్లు.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
హైదరాబాద్కు చెందిన అగ్రిటెక్ కంపెనీలపై సైబర్ దాడులు జరిగినట్టు గుర్తించారు. ఇజ్రాయెల్లోని భారత రాయబార కార్యాలయ వెబ్సైట్ను ఆదివారం నాటికి భారత అధికారులు పునరుద్ధరించగలిగారు. అయితే ఐసీఏఆర్ పేజీలలో ఒకటి ఇప్పటికీ పునరుద్ధరించలేకపోయినట్టుగా సమాచారం.. జూన్ 8 నుంచి 12 మధ్య భారత ప్రభుత్వ వెబ్సైట్లు, అలాగే ప్రైవేట్ పోర్టళ్లపై సైబర్ ఎటాక్ జరిగినట్టు నిపుణులు నిర్ధారించారు.. అదే హ్యాక్టివిస్ట్ గ్రూప్ ద్వారా భారతదేశంలోని ప్రముఖ బ్యాంకుల సర్వర్లను కూడా హ్యాక్ చేసే ప్రయత్నాలు జరిగినట్లు భద్రతా నిపుణులు సూచించారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!