‘Naatu Naatu’ becomes ‘Modi Modi’ in BJP election song: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉంది. ఇప్పటికే ప్రచారంలో బీజేపీ దూసుకుపోతోంది. మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే మరోసారి రాష్ట్ర బీజేపీ ప్రధాని నరేంద్రమోదీ ఛరిష్మానే నమ్ముకుంది. ఆయన కేంద్రంగానే ప్రచారం జరగుతోంది. ఇటీవల కాలంలో ప్రధాని పలుమార్లు కర్ణాటకను సందర్శించారు. వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు పలు ప్రాజెక్టులను ప్రారంభించారు.
Karnataka Elections: బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప ఎన్నికల బరి నుంచి వైదొలిగారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదని ప్రకటించారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు ఈశ్వరప్ప. అభ్యర్థుల ఎంపికలో తన పేరును పరిశీలించ వద్దని ఆయన విజ్ఞప్తి చేశారు
Amit Shah: 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ 300కు పైగా లోక్ సభ స్థానాలను కైవసం చేసుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అస్సాం దిబ్రూఘర్ లో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో 14 లోక్ సభ స్థానాలకు గానూ 12 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని అన్నారు.
Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కాకరేపుతోంది.. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పర్యటిస్తున్న సింగరేణి డైరెక్టర్ల బృందం.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో పాల్గొనేందుకు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు స్టీల్ ప్లాంట్లో పర్యటిస్తున్నారు.. ఈవోఐ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ సాధ్యసాధ్యలపై అధ్యయనం చేస్తున్నారు అధికారులు.. మరో రెండు రోజుల పాటు విశాఖలో సింగరేణి…
తెలంగాణలో సంచలనం రేపిన పదో తరగతి పేపర్ లీకేజ్ వ్యవహరంలో వరంగల్ కోర్టు విచారణ చేసి మరో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. బండి సంజయ్ కస్టడీ పిటిషన్ ని న్యాయస్థానం డిస్మిస్ చేసింది.
Uddhav Thackeray: మహారాష్ట్ర మంత్రి చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో చిచ్చుపెట్టాయి. బాబ్రీ మసీదు కూల్చివేతలో ఒక్క శివసేన కార్యకర్త కూడా లేరని ఆయన వ్యాఖ్యానించిన మరుసటి రోజు శివసేన(యూబీటీ)నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఫైర్ అయ్యారు.
ఎంపీని పిలవకుండా హైదరాబాద్ లో బీజేపీ కార్యక్రమాలు నిర్వహించారని ఎంపీ నామా నాగేశ్వరరావు మండిపడ్డారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు.
బీసీ లకు పెద్ద పీట వేసే పార్టీ బీజేపీ నే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. జ్యోతి రావు పూలే జయంతి సందర్బంగా.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పూలే చిత్రపటానికి బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మన్, బండి సంజయ్, బీజేపీ నేతలు నివాళులు అర్పించారు.
రైల్వే భూముల కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మంగళవారం ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరు కానున్నారు. తేజస్వి ఉదయం 11 గంటలకు విచారణలో చేరే అవకాశం ఉంది. ఇదే కేసులో మార్చి 25న తేజస్వీ యాదవ్ ను సీబీఐని ప్రశ్నించింది.