BJP election campaign song: “నాటు నాటు” సాంగ్ “మోడీ మోడీ”గా మారింది.. కర్ణాటకలో వైరల్ అవుతున్న వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘Naatu Naatu’ becomes ‘Modi Modi’ in BJP election song: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉంది. ఇప్పటికే ప్రచారంలో బీజేపీ దూసుకుపోతోంది. మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే మరోసారి రాష్ట్ర బీజేపీ ప్రధాని నరేంద్రమోదీ ఛరిష్మానే నమ్ముకుంది. ఆయన కేంద్రంగానే ప్రచారం జరగుతోంది. ఇటీవల కాలంలో ప్రధాని పలుమార్లు కర్ణాటకను సందర్శించారు. వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు పలు ప్రాజెక్టులను ప్రారంభించారు.
Read Also: Karnataka Elections: బీజేపీకి ఈశ్వరప్ప షాక్.. పోటీ చేయనని నడ్డాకు లేఖ
Also Read
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
ఇదిలా ఉంటే కర్ణాటక బీజేపీ ప్రస్తుతం ‘‘నాటు నాటు’’ సాంగ్ తో అదరగొడుతోంది. ట్రిపుల్ ఆర్ నుంచి ఆస్కార్ గెలుచుకున్న నాటు నాటు పాటను రీమిక్స్ చేసి ‘‘మోడీ మోడీ’’గా విడుదల చేసింది. బీజేపీ ప్రభుత్వం కర్ణాటకలో చేసి అభివృద్ధి పనులను వివరిస్తూ ఈ పాట కొనసాగింది. కన్నడ ప్రజలను ఆకట్టుకునేందుకు బీజేపీ ఏ మార్గాన్ని వదిలిపెట్టడం లేదు. తాజాగా నాటునాటు సాంగ్ తో ప్రజల దృష్టిని ఆకట్టుకోవాలని చూస్తోంది. బీజేపీ మంగళవారం ఈ సాంగ్ ను విడుదల చేసింది.
https://twitter.com/mla_sudhakar/status/1645697648085827584
ఈ పాటలో గత మూడేళ్లలో రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వంలో శివమొగ్గ విమానాశ్రయం, బెంగళూరు – మైసూరు ఎక్స్ప్రెస్వే, మెట్రో లైన్లు మరియు ఇతర సంక్షేమ పథకాలని ప్రస్తావించారు. కర్ణాకట ఆరోగ్యమంత్రి కే సుధాకర్ వీడియోను చేశారు చేస్తూ..‘‘ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో మా డబుల్ ఇంజిన్ సర్కార్ కర్ణాటకలో అభివృద్ధి పండుగను అద్భుతమైన పాట ద్వారా ప్రజల ముందుకు తీసుకురావడానికి కృషి చేస్తుందని, అందరకు బీజేవైఎంకు ప్రశంసలు’’అంటూ ట్వీట్ చేశారు. గతంలో 2009 ఎన్నికల ముందు స్లమ్ డాగా మిలియనీర్ లోని ‘జై హో’ సాంగ్ ను రీమిక్స్ చేసి ‘జై హో కాంగ్రెస్’ అంటూ రీమిక్స్ చేసింది. మే 10న కర్ణాటక ఎన్నికలు జరగబోతున్నాయి. మే 13న ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తం 224 నియోజక వర్గాలకు జరగనున్న పోరులో బీజేపీ, కాంగ్రెస్, జేడీయూ పోటీ చేయనున్నాయి.
తాజావార్తలు
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
-
Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
-
Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!