Home
Bjp
Bjp News
-
Mamata Banerjee: నాతో ఆడుకుంటున్నారు.. నాకు టైమొచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుంది.. బీజేపీకి మమత హెచ్చరిక
పశ్చిమ బెంగాల్లో బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై గత వారం దాడి జరినప్పటి నుంచి పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వంపై మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. -
Annamalai: కొత్త పార్టీ పెడతారా?.. బీజేపీకి గుడ్బై చెప్పనున్నారా? అన్నామలై నిర్ణయంపై ఉత్కంఠ..!
తమిళనాడు రాజకీయాల్లో ప్రముఖ నేతగా ఎదిగిన మాజీ ఐపీఎస్ అధికారి, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు K. Annamalai భవిష్యత్తుపై మరోసారి చర్చలు జోరందుకున్నాయి. ఆయన బీజేపీలో కొనసాగుతారా? లేక కొత్త రాజకీయ నిర్ణయం తీసుకుంటారా? అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. అన్నామలై సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు Nitin Nabinతో సమావేశం కోసం అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం జూన్ 3న కీలక… -
West Bengal Cabinet Expansion 2026: పశ్చిమ బెంగాల్ లో మంత్రివర్గ విస్తరణ.. నబన్నాలో 35 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం
పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి Suvendu Adhikari నేతృత్వంలోని ప్రభుత్వంలో సోమవారం భారీ మంత్రివర్గ విస్తరణ జరిగింది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన దాదాపు మూడు వారాల తర్వాత నిర్వహించిన ఈ తొలి విస్తరణలో మొత్తం 35 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ R. N. Ravi నబన్నాలో నిర్వహించిన కార్యక్రమంలో కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రముఖ బీజేపీ నేతలకు చోటు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో దీపక్ బర్మన్, తపస్… -
Mamata Banerjee: సిగ్గుపడాలి.. పాలకులే హంతకులుగా మారారు.. బీజేపీ ప్రభుత్వంపై మమత ఆగ్రహం
పాలకులే హంతకులుగా మారారని.. బెంగాల్ బీజేపీ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనార్పూర్లో మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడిపై ఎక్స్లో స్పందిస్తూ ఫైరయ్యారు. ‘‘వారు సిగ్గుపడాలి.. పాలకులు హంతకులుగా మారారు. బీజేపీకి సిగ్గుచేటు.’’ అని పేర్కొన్నారు. -
Abhishek Banerjee: మమతా బెనర్జీ అల్లుడిని నడిరోడ్డు మీద ఉతికేసిండ్రు.. బట్టలు చింపి, రాళ్లు, గుడ్లతో కొట్టి రచ్చ రచ్చ!
Abhishek Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కలకలం రేగింది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అగ్రనేత, ఎంపీ అభిషేక్ బెనర్జీపై సోనార్పూర్లో ఊహించని విధంగా దాడి జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది. అసలేం జరిగిందంటే.. సోనార్పూర్లో పర్యటిస్తున్న సమయంలో ఎంపీ అభిషేక్ బెనర్జీపై ఒక్కసారిగా దాడి జరిగింది. పరిస్థితిని గమనించిన ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. క్షణాల వ్యవధిలో అభిషేక్ను చుట్టుముట్టి సురక్షిత ప్రాంతానికి తరలించారు. “దొంగ.. దొంగ”… -
Congress: భారత్పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
Congress: ప్రపంచం వ్యతిరేకిస్తున్నా, భారత్లో తమకు భారీ మద్దతు దొరుకుతుందని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అన్నారు. భారత్ నుంచే తమకు ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారని, భారత్లో ఇజ్రాయిల్ అంటే క్రేజ్ ఉందని ఆయన ప్రశంసలు కురిపించారు. నెతన్యాహు, ఆయన భార్య సారా న్యూఢిల్లీలో 2018లో పర్యటించిన సమయంలో ప్రధాని మోడీ నుంచి ఆప్యాయమైన స్వాగతాన్ని అందుకున్నట్లు చెప్పారు. అయితే, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ ఇజ్రాయిల్కు అందిస్తున్న… -
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే చకచకా పనులు జరిగిపోతున్నాయి. తాజాగా కోల్కతా మెట్రో ఆరెంజ్ లైన్లోని చింగ్రిఘాట క్రాసింగ్ సెక్షన్లో గత టీఎంసీ ప్రభుత్వం హయాంలో 15 ఏళ్లు ఆలస్యమైన గర్డర్ లాంచింగ్ పనులను ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం 15 రోజుల్లోనే పూర్తి చేసిందని బీజేపీకి చెందిన అమిత్ మాల్వీయా తెలిపారు. -
Rahul Gandhi: “భయపడొద్దు.. ముస్లింలకు మద్దతుగా నిలవాలి”.. రాహుల్ గాంధీ
Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు మద్దతు ఇచ్చే విషయంలో ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ మైనారిటీ సలహా కమిటీ సమావేశంలో తమ అధినేత ముందు పలువురు నేతలు ఆందోళనల్ని వ్యక్తపరిచారు. రాహుల్ గాంధీ తమ నేతల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ముస్లింలకు మద్దతు నిలిచే విషయంలో భయపడొద్దని సూచించారు. ఇదే సమయంలో వచ్చే ఏడాదిలోగా ప్రధాని నరేంద్రమోడీ పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో… -
Kolkata: మమత కట్టడాలపై బుల్డోజర్ చర్య.. సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ శిల్పం తొలగింపు
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ హయాంలో నిర్మించిన కట్టడాలపై ప్రస్తుత ప్రభుత్వం బుల్డోజర్ చర్యలకు దిగింది. తాజాగా కోల్కతా సాల్ట్లేక్ స్టేడియం దగ్గర మమతా బెనర్జీ స్వయంగా డిజైన్ చేసిన శిల్పాన్ని బుల్డోజర్తో తొలగించారు. ఈ ఘటన ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. -
BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
BJP: భారతదేశంలో బీజేపీ హవా 20 ఏళ్లు కొనసాగుతుందని ప్రముఖ పోల్స్టర్, యాక్సిస్ మై ఇండియా చీఫ్ ప్రదీప్ గుప్తా అన్నారు. సమర్థవంతమైన పాలన అందించే వారి సామర్థ్యంపై ఇది ఆధారపడుతుందని చెప్పారు. బీజేపీ పాలన పనితీరు గణనీయంగా బలహీనపడనంత కాలం ఆ పార్టీ స్థానం సురక్షితంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఒకప్పుడు కాంగ్రెస్ అనుభవించిన సుదీర్ఘ ఆధిపత్యాన్ని, ఇప్పుడు బీజేపీ అనుభవిస్తోందని చెప్పారు. భారతదేశంలో ఏక-పార్టీ ఆధిపత్య పరిస్థితులను చూస్తున్నామని అన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తాజావార్తలు
-
Harish Rao : అసెంబ్లీలో కాంగ్రెస్కు చుక్కలు చూపిస్తాం
-
Dada : ‘దాదా’గా బాలయ్య బ్లాస్టింగ్ ఎంట్రీ: పోలీసులపైనే రివాల్వర్ గురిపెట్టి!
-
Punjab: ఆప్లోకి గ్యాంగ్స్టర్.. పంజాబ్ ఎన్నికల ముందు కీలక పరిణామం..
-
Mokshagna: బరిలోకి సింబా.. బాలయ్య ఆశీస్సులతో మోక్షజ్ఞ మాస్ ఎంట్రీ!
-
Delhi Building Collapse: “రక్షించండి”.. బిల్డింగ్ శిథిలాల కింద నుంచి విద్యార్థుల ఫోన్ కాల్స్..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!