West Bengal polls: బీజేపీ గుర్తుపై టేపులు.. రీపోలింగ్కు ఆదేశం..
- పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో గందరగోళం..
- బీజేపీ గుర్తు కనిపించకుండా ఈవీఎంలపై టేపులు..
- మళ్లీ పోలింగ్కు ఆదేశించిన ఈసీ..
West Bengal polls: పశ్చిమ బెంగాల్ రెండో దశ పోలింగ్ జోరుగా సాగుతోంది. 142 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కును ఉపయోగించుకుంటున్నారు. ఇదిలా ఉంటే, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి గట్టి పట్టు ఉన్న ప్రాంతాల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతోందని బీజేపీ ఆరోపిస్తోంది.
ఫల్తా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పేరు కనిపించకుండా, కమలం గుర్తు కనిపించకుండా ఈవీఎంలపై టేపు అంటించి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బీజేపీ ఐటీ చీఫ్, బెంగాల్ కో-ఇన్చార్జ్ అమిత్ మాలవ్య మాట్లాడుతూ, ఈ ఘటన బూత్ నంబర్ 144లో జరిగినట్లు నివేదించబడిందని, అలాగే బూత్లు 170 ,189 కూడా ఇదే విధంగా ప్రభావితమయ్యాయని ఆరోపించారు.
Also Read
- PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
- Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
- JMI VC Mazhar Asif: "భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!".. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- PM Modi: ప్రధాని మోడీ వారణాసి పర్యటన.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు
Read Also: Venkatesh: మోహన్లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్మెంట్!
ఈ ఘటనను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఇలాంటి బూత్లలో మళ్లీ పోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. ఈవీఎంలపై నలుపు లేదా తెలుపు టేపు కనిపించి ప్రతీ పోలింగ్ కేంద్రంలతో తిరిగి పోలింగ్ నిర్వహిస్తామని పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ అగర్వాల్ తెలిపారు. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో బూత్లలో ఇలా టేపు అంటించి ఉంచినట్లు తేలింతే, మొత్తం నియోజక వర్గానికి పోలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు.
ఫల్తా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పేరు ఈవీఎంపై కనిపించకుండా చేశారని బీజేపీ ఫిర్యాదు చేయడంతో గందరగోళం మొదలైంది. దీనిపై విచారణకు ఈసీ ఆదేశించింది. ఇదిలా ఉంటే, ఫల్తా నియోజకవర్గం తృణమూల్ కీలక నేత జహంగీర్ ఖాన్ సొంత నియోజకవర్గం. ఇటీవల, జహంగీర్ ఖాన్, ఎన్నికల అబ్జర్వర్గా వచ్చిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్న ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మల మధ్య మాటల యుద్ధం చెలరేగింది. జహంగీర్ ఖాన్ మనుషులు ప్రజల్ని భయాందోళకు గురిచేస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని అజయ్ పాల్ శర్మ వార్నింగ్ ఇవ్వడం వైరల్గా మారింది.
తాజావార్తలు
-
West Bengal polls: బీజేపీ గుర్తుపై టేపులు.. రీపోలింగ్కు ఆదేశం..
-
MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
-
PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
-
Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో