Rahul Gandhi: బీజేపీ ఎంపీలలో ప్రతి ఆరుగురిలో ఒకరు ఓట్ చోరీతో గెలిచారు.. రాహుల్ గాంధీ విమర్శలు
- బీజేపీపై రాహుల్ గాంధీ మరోసారి ఫైర్
- ‘ఓట్ల దొంగతనం’ ఆరోపణలు
- లోక్సభలో 240 బీజేపీ ఎంపీలపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “ఓట్ల దొంగతనం” ఆరోపణలను పునరుద్ఘాటిస్తూ సోషల్ మీడియాలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓట్ల దొంగతనం వల్ల కొన్నిసార్లు సీట్లు మాత్రమే కాదు, మొత్తం ప్రభుత్వాలే కూలిపోతాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తన పోస్టులో గణాంకాలను ప్రస్తావిస్తూ, లోక్సభలోని 240 మంది బీజేపీ ఎంపీలలో సుమారు ఆరుగురిలో ఒకరు ఓట్ల దొంగతనం ద్వారా గెలిచారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో బీజేపీ సొంత పరిభాషలోనే వారిని “చొరబాటుదారులు” అని పిలవాలా? అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు.
ఓటర్ల జాబితాపై ఆరోపణలు
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్లో ట్విస్ట్
రాహుల్ గాంధీ ఓటర్ల జాబితాలు, ఎన్నికల ప్రక్రియలపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. కొన్ని సంస్థలు అధికార పార్టీ ప్రభావంలో పనిచేస్తూ, ఎన్నికల వ్యవస్థను రిమోట్ కంట్రోల్ చేస్తున్నాయని రాహుల్ ఆరోపించారు. “వారి అసలు భయం సత్యం పట్లే. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే, ఈరోజు వారు 140 స్థానాలకు దగ్గరగా కూడా గెలవలేరు” అని రాహుల్ అన్నారు.
హర్యానా ప్రభుత్వంపై విమర్శలు
హర్యానా ప్రభుత్వాన్ని ప్రస్తావిస్తూ, అక్కడి మొత్తం ప్రభుత్వమే ఒక “చొరబాటుదారు”లా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. ఓట్ల దొంగతనం, ఎన్నికల అక్రమాల కారణంగానే ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఎన్నికల సంఘంపై విమర్శలు
ఇటీవల పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం కూడా రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై విమర్శలు చేశారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత ఉండాలని, ఓటర్ల జాబితాలపై పూర్తి స్థాయి పరిశీలన జరగాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ నుంచి దీనిపై ఎలాంటి ప్రతిస్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
- Tags
- bjp
- BJP MPs
- rahul gandhi
- Vote Theft
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..